Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- కర్ణాటకలో దారుణం
- డాక్టర్ భర్తను చంపిన భార్య
- కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకూ కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయి. రక్తసంబంధుల మధ్యే మానవత్వం మంటగలుస్తోంది. ప్రస్తుతం ఎవరినీ.. ఎవరు నమ్మడానికి అవకాశం ఉండడం లేదు. అయినవాళ్లే ప్రాణాలు తీయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తాజాగా కర్ణాటకలోని ధారవాడలో దారుణం జరిగింది. ప్రముఖ వైద్యుడు కిరణ్ హొన్నన్నవర్ను ఆయన భార్య, డాక్టర్ ప్రియాంక కట్టనహళ్లి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 8 ఏళ్ల కుమారుడిపై కూడా కత్తితో దాడి చేయగా.. బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బుధవారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అపార్ట్మెంట్లో భయానక దృశ్యాలు కనిపించాయి. ఇంటి లోపల అంతా రక్తపు మరకలు కనిపించగా… ఒక గదిలో డాక్టర్ కిరణ్ రక్తపు మడుగులో మృతదేహంగా పడి ఉండగా.. పక్కనే తీవ్ర గాయాలతో కుమారుడు కనిపించాడు. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే.. అదే సమయంలో డాక్టర్ ప్రియాంక మంచంపై పడుకుని మొబైల్ ఫోన్లో స్క్రోల్ చేస్తూ కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు.
Also Read
- Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
సమాచారం అందుకున్న వెంటనే హుబ్బళ్లి-ధారవాడ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ ఘటనాస్థలికి చేరుకున్నారు. మొదట స్పందించిన సిబ్బందికి బాలుడు చనిపోయినట్లు అనిపించినా… కమిషనర్ అతను ఇంకా శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మంగళవారం రాత్రి-బుధవారం ఉదయం డాక్టర్ కిరణ్కు బంధువులు, స్నేహితులు పలుమార్లు ఫోన్ చేశారు. ప్రతి సారి ప్రియాంకే ఫోన్ ఎత్తి… మొదట ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని.. తర్వాత విధులకు వెళ్లారని చెప్పినట్లు సమాచారం. అయితే సాయంత్రం కూడా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు నేరుగా అపార్ట్మెంట్కు వెళ్లగా.. భర్త మృతదేహం, గాయపడిన కుమారుడు కనిపించారు. అదే సమయంలో ప్రియాంక గదిలో ప్రశాంతంగా మొబైల్ చూస్తూ ఉండటంతో దిగ్భ్రాంతికి గురి చేసింది.
పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ స్థానిక చిరాయు ఆస్పత్రిలో అనస్థీషియా నిపుణుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య ప్రియాంక ఎంబీబీఎస్ పూర్తి చేసి… ఆఫ్తాల్మాలజీలో ఎంఎస్ చేశారు. కుమారుడితో కలిసి ధారవాడలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఘటన జరిగిన సమయంలో ఇంట్లో భర్త, భార్య, కుమారుడు మాత్రమే ఉన్నట్లు తేలిందని, బయట వ్యక్తులు ఇంట్లోకి వచ్చిన ఆనవాళ్లు ఇప్పటివరకు లభించలేదని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన ఎప్పుడు జరిగింది? హత్యకు దారితీసిన కారణాలేమిటి? ప్రియాంక ఎవరితో మాట్లాడింది? కుటుంబ సభ్యులకు ఎందుకు తప్పుదారి పట్టించే సమాచారం ఇచ్చింది? వంటి అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!