Child Kidnap : బయటపడ్డ.. రిజ్వానా నర్సింగ్ హోమ్ రహస్యాలు..!
- చందానగర్లో చిన్నారి అదృశ్యం.. కీలక ముఠా వెలుగులోకి
- ముఠా నాయకుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ చిలుకూరి రాజు
- రైల్వే స్టేషన్లు, నిర్మానుష్య ప్రదేశాలే లక్ష్యం
- ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసిన గ్యాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Kidnap: హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా నగరంలో పిల్లల కిడ్నాప్లకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆగస్టు 26న చందానగర్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. లింగంపల్లి పోచమ్మగూడెం వద్ద నాలుగేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడని తల్లి ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. దర్యాప్తులో పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముతున్న పెద్ద గ్యాంగ్ బయటపడింది.
USA: మోడీ-పుతిన్ మీటింగ్.. భారత్తో సంబంధాలపై అమెరికా కొత్త నిర్వచనం..
Also Read
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి ఆయుర్వేదిక్ మెడిసిన్ డాక్టర్ చిలుకూరి రాజుగా గుర్తించారు. అతనితో పాటు మహ్మద్ ఆసిఫ్, రిజ్వానా, నర్సింహ్మారెడ్డి కలిసి గ్యాంగ్గా ఏర్పడి, రైల్వే స్టేషన్లు, నిర్మానుష్య ప్రదేశాల్లో ఐదేళ్లలోపు చిన్నారులను కిడ్నాప్ చేస్తూ, పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఈ ముఠా ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసినట్లు నిర్ధారణ అయింది. డీసీపీ వినీత్ వివరించిన ప్రకారం, ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న రిజ్వానా పిల్లల అమ్మకాలలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
ఆమెను కస్టడీలోకి తీసుకోవడం ద్వారా ఇంకా ఎంత మంది చిన్నారులను అమ్మారన్న విషయంపై స్పష్టత రానుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ముఠాతో పాటు బాల్రాజు అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అతడు తన ఇద్దరు పిల్లలను ఈ గ్యాంగ్కు అమ్మాడని విచారణలో తేలింది. అయితే కిడ్నాప్ చేసిన లాస్య, అమ్ములు అనే ఇద్దరు చిన్నారుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మిగిలిన నలుగురు చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
Sivaji: నారా లోకేష్ ‘ప్రజా గొంతుక’.. నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!