Child Kidnap : బయటపడ్డ.. రిజ్వానా నర్సింగ్ హోమ్ రహస్యాలు..!
- చందానగర్లో చిన్నారి అదృశ్యం.. కీలక ముఠా వెలుగులోకి
- ముఠా నాయకుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ చిలుకూరి రాజు
- రైల్వే స్టేషన్లు, నిర్మానుష్య ప్రదేశాలే లక్ష్యం
- ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసిన గ్యాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Kidnap: హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా నగరంలో పిల్లల కిడ్నాప్లకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆగస్టు 26న చందానగర్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. లింగంపల్లి పోచమ్మగూడెం వద్ద నాలుగేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడని తల్లి ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. దర్యాప్తులో పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముతున్న పెద్ద గ్యాంగ్ బయటపడింది.
USA: మోడీ-పుతిన్ మీటింగ్.. భారత్తో సంబంధాలపై అమెరికా కొత్త నిర్వచనం..
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి ఆయుర్వేదిక్ మెడిసిన్ డాక్టర్ చిలుకూరి రాజుగా గుర్తించారు. అతనితో పాటు మహ్మద్ ఆసిఫ్, రిజ్వానా, నర్సింహ్మారెడ్డి కలిసి గ్యాంగ్గా ఏర్పడి, రైల్వే స్టేషన్లు, నిర్మానుష్య ప్రదేశాల్లో ఐదేళ్లలోపు చిన్నారులను కిడ్నాప్ చేస్తూ, పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఈ ముఠా ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసినట్లు నిర్ధారణ అయింది. డీసీపీ వినీత్ వివరించిన ప్రకారం, ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న రిజ్వానా పిల్లల అమ్మకాలలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
ఆమెను కస్టడీలోకి తీసుకోవడం ద్వారా ఇంకా ఎంత మంది చిన్నారులను అమ్మారన్న విషయంపై స్పష్టత రానుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ముఠాతో పాటు బాల్రాజు అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అతడు తన ఇద్దరు పిల్లలను ఈ గ్యాంగ్కు అమ్మాడని విచారణలో తేలింది. అయితే కిడ్నాప్ చేసిన లాస్య, అమ్ములు అనే ఇద్దరు చిన్నారుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మిగిలిన నలుగురు చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
Sivaji: నారా లోకేష్ ‘ప్రజా గొంతుక’.. నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!