టాలీవుడ్ నటుడు శివాజీ సోమవారం నాడు ఏపీ మంత్రి నారా లోకేశ్ను కలిశారు. ఈ సమావేశం హైదరాబాద్లోని లోకేశ్ నివాసంలో జరిగింది. ఈ భేటీ తర్వాత శివాజీ, లోకేశ్ నాయకత్వ లక్షణాలు, దార్శనికతను ప్రశంసిస్తూ, ఆయన నాయకత్వం తనకు గొప్ప స్ఫూర్తినిచ్చిందని అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Also Read :Mowgli: మోగ్లీ ట్రైలర్.. కామెంట్స్ డిలీట్ చేశారంటూ నటుడు సంచలనం
సోషల్ మీడియా ద్వారా ఈ భేటీ విశేషాలను పంచుకుంటూ శివాజీ ఇలా రాశారు: “నారా లోకేశ్ గారిని ఆయన నివాసంలో కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన దార్శనికత, నాయకత్వ గుణాలు నిజంగా స్ఫూర్తిదాయకం. మా మధ్య జరిగిన సమావేశంలోని అర్థవంతమైన చర్చలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.” ఈ సందర్భంగా లోకేశ్ను ‘ప్రజా గొంతుక’ అని సంబోధిస్తూ శివాజీ ప్రశంసలు కురిపించారు.
Also Read :NTR-NEEL : ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో హీరోయిన్ ఫిక్స్..
ఈ భేటీలో శివాజీ ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని లోకేశ్కు బహూకరించినట్లు తన పోస్ట్లో వెల్లడించారు. గత కొంతకాలంగా రాజకీయ అంశాలపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న శివాజీ, ఇప్పుడు లోకేశ్ను నేరుగా కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశం వెనుక ఉన్న కారణాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.