USA: మోడీ-పుతిన్ మీటింగ్.. భారత్తో సంబంధాలపై అమెరికా కొత్త నిర్వచనం..
- మోడీ-పుతిన్ భేటీ ముందు అమెరికా నుంచి కొత్త నిర్వచనం..
- భారత్- అమెరికా సంబంధాలపై విదేశాంగ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు..
- 21 శతాబ్ధాన్ని నిర్వచించే సంబంధమని ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: చైనాలోని టియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. రష్యా అధినేత పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికా, భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంతో ఈ మూడు దేశాలు మరింత దగ్గర అవుతున్నాయి. పుతిన్, జిన్పింగ్లతో మోడీ కరచాలనం, ఆత్మీయ ఆలింగనం చూస్తే అమెరికాకు కాలుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, భారత్ తమ నుంచి దూరం కాకుండా ఉండేందుకు ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మోడీ-పుతిన్ భేటీకి కొన్ని నిమిషాల ముందు అమెరికా నుంచి ఈ ప్రకటన వచ్చింది.
Read Also: Uttar Pradesh: సీఎం ఆఫీస్ ముందే మహిళ అంత పని చేసిందా.. అసలేమైందంటే…
Also Read
- Nitin Gadkari: E20 పెట్రోల్ వల్ల ఒక్క కారైనా పాడైందా?.. విమర్శకులపై కేంద్ర మంత్రి గడ్కరీ ఫైర్..
- Awiqli Insulin India: మధుమేహ రోగుల కష్టాలు తీరినట్టే.. భారత్లో తొలి ఇన్సులిన్ 'Awiqli' విడుదల.. వారానికి ఒక్కసారి చాలు!
- Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..
- Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు...ఇంతటి విలయానికి అదే కారణమా...?
తాజాగా, అమెరికా-భారత బంధానికి కొత్త నిర్వచనం ఇచ్చింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ.. ‘‘ 21 శతాబ్దాన్ని నిర్వచించే సంబంధం’’గా కొనియాడారు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలు కొత్త శిఖరానికి చేరుకుంటాయని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ, ద్వైపాక్షిక సంబంధాల వరకు, రెండు దేశాల ప్రజల మధ్య శాశ్వత స్నేహమే ఈ ప్రయాణానికి ఇంధనం అని రూబియో అన్నట్లు అమెరికా రాయబార కార్యాలయం ఉటంకించింది.
ట్రంప్ భారత్పై సుంకాల విధింపు నేపథ్యంలో ఇప్పుడు భారత్, చైనా, రష్యాల మధ్య సమావేశాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ సమయంలోనే అమెరికా నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ట్రంప్ సుంకాలను భారత్ ఏ మాత్రం పట్టించుకోకుండా, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు భారత్ సహకరిస్తోందని అమెరికా వాదిస్తోంది. అయితే 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతను నిర్ధారిస్తున్నామని భారత్ చెబుతోంది. అమెరికా బెదిరింపులకు లొంగి, దశాబ్ధాల కాలంగా రష్యాతో ఉన్న సంబంధాలను పాడు చేసుకోలేమని భారత్ చెప్పకనే చెబుతోంది.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు 70.. ప్యాషన్ మాత్రం 25.. హ్యాట్సాఫ్ చిరు!
-
Abhishek Sharma: “గర్ల్ఫ్రెండ్” అంటూ ప్రచారం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అభిషేక్ శర్మ.. కట్చేస్తే..
-
CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!
-
Tirumala: తిరుమలలో తలనీలాలు సమర్పించే ఆచారం ఎలా మొదలైంది.. దాని వెనుక ఉన్న పురాణం ఏంటి?
-
Monsoon Hair Care Tips: వర్షంలో జుట్టు తడిసిందా..? ఇలా చేస్తే చాలు జుట్టు రాలదు..
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!