Hyderabad Honeytrap: తల్లి సహకారంతోనే కొడుకుల ‘రొమాంటిక్’ ట్రాప్.. రంగంలోకి సీపీ సజ్జనార్
- గుంటూరు ముఠా అరాచకాలు
- ఇన్స్టాగ్రామ్ వేదికగా రిచ్ కిడ్స్ను టార్గెట్
- మైనర్ బాలికలను ట్రాప్ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములు
Hyderabad Honeytrap: మహానగరంలో దిగ్భ్రాంతికరమైన హనీట్రాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా రిచ్ కిడ్స్ను టార్గెట్ చేస్తూ, మైనర్ బాలికలను ట్రాప్ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా సీపీ సజ్జనార్ స్వయంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితులను మూడు గంటల పాటు విచారించడం సంచలనంగా మారింది.
ఎవరీ నిందితులు..
గుంటూరుకు చెందిన అర్జున్ (అలియాస్ చంద్రశేఖర్ ఆజాద్), ప్రవీణ్ అనే అన్నదమ్ములు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. వీరికి వీరి తల్లి మీనాకుమారి కూడా సహకరిస్తుండటం గమనార్హం. గతంలో కూడా అర్జున్ ఒక మైనర్ బాలికను ట్రాప్ చేసిన కేసులో జైలుకు వెళ్లి, కేవలం మూడు రోజుల్లోనే బయటకు వచ్చి మళ్లీ అదే వృత్తిని కొనసాగించాడు. నిందితుడు అర్జున్ ఇన్స్టాగ్రామ్లో ఎస్కార్ట్గా నటిస్తూ, ‘రొమాంటిక్ మూడ్’ అంటూ మైనర్లను ఆకర్షించేలా రీల్స్ చేసేవాడు. రిచ్ కిడ్స్ మాత్రమే వీరి టార్గెట్. అర్జున్ను ఇన్స్టాగ్రామ్లో సుమారు 150 మంది అమ్మాయిలు ఫాలో అవుతున్నారు. నిందితుడు ఖరీదైన కార్లు, విలాసవంతమైన షికార్ల పేరుతో మైనర్లకు వల వేసి హైదరాబాద్ రోడ్లపై తిప్పేవారు.
Also Read
- Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
- Viral: ఒక్క రాత్రి నగ్న పూజకు కూర్చొంటే రూ.30 లక్షలు.. యువతికి ఎర వేసిన కారు డ్రైవర్..
- Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
- B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
లైంగిక వేధింపులు – బ్లాక్ మెయిలింగ్
కేవలం తిప్పడమే కాకుండా, ఖరీదైన కార్లలోనే బాలికలపై లైంగిక దాడికి పాల్పడేవారు. ఆ దృశ్యాలను రహస్యంగా వీడియోలు తీసి, వాటిని చూపించి బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేసేవాడు. “మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, పెట్టుబడి కావాలి” అని నమ్మించి లేదా బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. ఈ క్రమంలోనే ఒక మైనర్ బాలిక ఇంట్లో ఎవరికీ తెలియకుండా రూ.13 లక్షలు వీరికి ఇచ్చినట్లు విచారణలో తేలింది. పోలీసుల కస్టడీలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు సుమారు 19 మంది మైనర్ బాలికలను ఈ అన్నదమ్ములు ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అర్జున్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ను పోలీసులు లాక్ చేశారు. నిందితుల తల్లి మీనాకుమారికి కూడా ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు తేలడంతో ఆమె పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజావార్తలు
-
Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
-
KL Rahul: ‘నన్ను టెస్ట్ ప్లేయర్ అన్నారు.. టీ20 ఆడటం రాదన్నారు’.. కేఎల్ రాహుల్ భావోద్వేగం..
-
Rajamouli: సబ్స్క్రిప్షన్ ట్రెండ్ నూ వదలని జక్కన్న.. ఇదెక్కడి మాస్ ప్లాన్ అయ్యా!
-
Spirit: ‘స్పిరిట్’ ఫాన్స్’కి బ్యాడ్ న్యూస్?
-
TVK Vijay: టీవీకే ఎమ్మెల్యేల భేటీ.. శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ ఎన్నిక
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!