Gurugram: పెళ్లైన మూడు నెలలకే.. భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి..
- పెళ్లైన మూడు నెలలకే
- భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి
- కాల్చిచంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మరో దారుణ ఘటన హర్యానాలోని గురుగ్రామ్లో వెలుగుచూసింది. పెళ్లై కేవలం మూడు నెలలే అయిన భార్యను భర్త తన ప్రియురాలి సహాయంతో కాల్చిచంపినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఇద్దరూ నేపాల్కు పారిపోయినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటన హర్యానాలోని మనేసర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
భార్య అదృశ్యంపై తల్లి ఫిర్యాదు
పోలీసుల వివరాల ప్రకారం, 22 ఏళ్ల యువతికి ఈ ఏడాది ఫిబ్రవరిలో మనేసర్కు చెందిన అంకిత్తో వివాహం జరిగింది. అయితే మే 21న యువతి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు బంధువులు, అత్తింటి వారిని సంప్రదించినప్పటికీ సరైన సమాచారం లభించలేదు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన యువతి తల్లి మే 22న మనేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
గదిలో మృతదేహం లభ్యం
దర్యాప్తులో భాగంగా పోలీసులు మనేసర్లోని ఓ అద్దె గదిలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఆమెను తుపాకీతో కాల్చిచంపినట్లు నిర్ధారణ కావడంతో కేసులో హత్య సెక్షన్లు చేర్చి విచారణను ముమ్మరం చేశారు.
భర్త, ప్రియురాలు అరెస్ట్
దర్యాప్తు అనంతరం పోలీసులు నిందితుడు అంకిత్తో పాటు అతని ప్రియురాలు రాజ్ని దేవిని అరెస్ట్ చేశారు. అంకిత్ మనేసర్లో పొగాకు దుకాణం నిర్వహిస్తుండగా, రాజ్ని అదే ప్రాంతంలోని ఒక బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మూడేళ్ల ప్రేమ.. హత్యకు పక్కా ప్రణాళిక
పోలీసుల విచారణలో అంకిత్, రాజ్ని గత మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు వెల్లడైంది. తమ సంబంధానికి భార్య అడ్డుగా ఉందని భావించిన ఇద్దరూ హత్యకు ముందే ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు అంకిత్ తన భార్యను రాజ్ని అద్దెకు ఉంటున్న గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి ఆమెను తుపాకీతో కాల్చిచంపినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు.
రెండు నెలల ముందే తుపాకీ కొనుగోలు
హత్య కోసం ఉపయోగించిన ఆయుధాన్ని ఉత్తరప్రదేశ్ నుంచి రెండు నెలల ముందే కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యను అమలు చేయడానికే ముందస్తుగా ఆయుధాన్ని సమకూర్చుకున్నట్లు అనుమానిస్తున్నారు. హత్య చేసిన తర్వాత అంకిత్, రాజ్ని మొదట హరిద్వార్కు వెళ్లి, అక్కడి నుంచి నేపాల్కు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలం అక్కడే తలదాచుకున్న ఇద్దరూ జూన్ 30న తిరిగి భారత్కు వచ్చినట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా మనేసర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
పోలీసు కస్టడీలో నిందితులు
అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారికి ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. హత్యకు ఉపయోగించిన తుపాకీ స్వాధీనం చేసుకోవడం, ఇతర ఆధారాలు సేకరించడం కోసం నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!