Dowry harassment: ప్రేమ పెళ్లి చేసుకున్న కట్నం వేధింపులు తప్పలేదు.. 2 నెలలకే నవవధువు మృతి..
- ఢిల్లీలో 72 రోజుల క్రితం పెళ్లైన యువతి అనుమానాస్పద మృతి.
- కట్న వేధింపుల కేసులో భర్త అరెస్ట్ చేసిన పోలీసులు.
- రూ.20 లక్షల కట్నం కోసం వేధించారని కుటుంబ సభ్యుల ఆరోపణ.
- బెల్ట్తో కొట్టేవాడని, చంపేస్తాడని ముందే చెప్పిందన్న తల్లి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dowry harassment: ఢిల్లీలో పెళ్లైన రెండు నెలలకే నవవధువు ఆకృతి అనుమానాస్పదంగా మరణించింది. 28 ఏళ్ల ఆకృతి సుతార్ జూలై 4న లోధీ కాలనీలోని పాలికా కుంజ్ అపార్ట్మెంట్ వద్ద భవనం పై నుంచి కిందపడిన స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఎయిమ్స్కు తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.అయితే, ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె భర్త అరస్తూ సిక్కాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు అతడిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఛతర్పూర్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన ఆకృతి, తన చిన్ననాటి స్నేహితురాలి సోదరుడైన అరస్తు సిక్కాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ప్రేమ వివాహమైనా చివరకు వరకట్న వేధింపులు తప్పలేదు.
ఆకృతి తల్లి అను సాయ్ సుతార్ ఫిర్యాదులో కీలక ఆరోపణలు చేశారు. తన కుమార్తెను భర్తతో పాటు ఆమె అత్తమామలు వివాహం జరిగినప్పటి నుంచి వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండాలని, త్వరగా గర్భం దాల్చాలని ఒత్తిడి తెచ్చినట్లు చెప్పింది. వివాహానికి ముందు ఉద్యోగం కొనసాగించడానికి అంగీకరించినప్పటికీ, పెళ్లి తర్వాత మాట మార్చినట్లు వెల్లడించింది. ఆకృతిని భర్త బెల్ట్తో కొట్టినట్లు తనకు చెప్పిందని తల్లి ఆరోపించారు. జూన్ 29న అతను నన్ను చంపేస్తాడని చెబుతూ ఫోన్ చేసినట్లు వెల్లడించింది. అదే రోజు భోజనం వేడిగా లేదని మరోసారి దాడి చేసినట్లు ఆకృతి తల్లి ఆరోపించింది. జూలై 4 ఉదయం ఆఫీస్కు వెళ్లే ముందు చివరిసారిగా ఫోన్ చేసిందని, రాత్రికి ఆమె మృతి చెందినట్లు సమాచారం అందిందని తల్లి చెప్పింది.
Also Read
ఆకృతి పెళ్లికి రూ. 7-8 లక్షలు ఖర్చు చేశామని, అయినప్పటికీ భర్త కుటుంబం రూ. 20 లక్షల కట్నం డిమాండ్ చేసిందని ఆరోపించారు. ఆకృతి మానసికంగా ఎంతో ధైర్యవంతురాలని, ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని, ప్లాన్ ప్రకారం అత్తింటి వారు ఆకృతిని హత్య చేసినట్లు అను సాయ్ సుతార్ ఆరోపించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఈ కేసును సమగ్రంగా విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటన..
-
Israel: వెస్ట్ బ్యాంక్లో భారీ ఆపరేషన్కు సిద్ధం: నెతన్యాహు కీలక ప్రకటన
-
Kishan Reddy : కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
-
IND Vs ZIM: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం..
-
Harish Rao : డాక్టర్ మమతకు హరీష్ రావు సెల్యూట్.. ‘దేవుళ్లు ఎందుకంటారో నిరూపించారు.!’
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!