Tragedy : ఆసుపత్రిలో మంచినీళ్లు అనుకొని కెమికల్ తాగి యువకుడు మృతి..
- ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర నిర్లక్ష్యం
- మంచినీళ్ల స్థానంలో కెమికల్
- యువకుడి దుర్మరణం
- ఆసుపత్రి ఎదుట ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గుండెలను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా, చికిత్స కోసం వచ్చిన ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. మంచినీళ్లు అనుకొని పొరపాటున లాబరేటరీ కెమికల్ తాగడంతో 19 ఏళ్ల యువకుడు మరణించిన ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. అనుముల మండలం చిన్న అనుముల గ్రామానికి చెందిన గణేష్ అనే యువకుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న గణేష్ను చికిత్స నిమిత్తం అతని తల్లి మిర్యాలగూడలోని కృష్ణ సాయి హాస్పిటల్కు తీసుకువచ్చారు. ఆసుపత్రిలో వేచి ఉన్న సమయంలో గణేష్కు విపరీతంగా దాహం వేయడంతో, అక్కడ అందుబాటులో ఉన్న ఒక క్యాన్ను చూసి అతని తల్లి అది మంచినీళ్లేనని భావించింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ క్యాన్లో ఉంది మంచినీళ్లు కావు, లాబరేటరీ పరీక్షల కోసం వినియోగించే అత్యంత ప్రమాదకరమైన కెమికల్ లిక్విడ్.
Also Read
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
Mahabubabad: తల్లి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో.. కొడుకు షాకింగ్ డెసిషన్
ఏమాత్రం అనుమానం కలగని తల్లి, ఆ లిక్విడ్ను కుమారుడికి తాగించింది. అది తాగిన కొద్దిసేపటికే గణేష్ తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పరిస్థితి విషమించడంతో ఆ యువకుడు మృతి చెందాడు. ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రిలోనే, యాజమాన్యం చేసిన చిన్న పొరపాటు ఒక కుటుంబంలో తీరని చీకట్లు నింపింది. విషపూరితమైన కెమికల్స్ ఉన్న డబ్బాలను రోగులకు అందుబాటులో ఉంచడం, వాటిపై ఎటువంటి హెచ్చరిక గుర్తులు లేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
తమ కళ్ల ముందే కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో గణేష్ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. చదువుకుని ఉన్నత స్థాయికి చేరుతాడనుకున్న కొడుకు, జ్వరం తగ్గించుకోవడానికి వచ్చి ఇలా శవమై పడి ఉండటాన్ని చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో చిన్న అనుముల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Sweet Potatoes: డయాబెటిస్ స్వీట్ పోటాటో తినొచ్చా.. నిపుణులు ఏమంటున్నారంటే..
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!