Tragedy : ఆసుపత్రిలో మంచినీళ్లు అనుకొని కెమికల్ తాగి యువకుడు మృతి..
- ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర నిర్లక్ష్యం
- మంచినీళ్ల స్థానంలో కెమికల్
- యువకుడి దుర్మరణం
- ఆసుపత్రి ఎదుట ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గుండెలను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా, చికిత్స కోసం వచ్చిన ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. మంచినీళ్లు అనుకొని పొరపాటున లాబరేటరీ కెమికల్ తాగడంతో 19 ఏళ్ల యువకుడు మరణించిన ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. అనుముల మండలం చిన్న అనుముల గ్రామానికి చెందిన గణేష్ అనే యువకుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న గణేష్ను చికిత్స నిమిత్తం అతని తల్లి మిర్యాలగూడలోని కృష్ణ సాయి హాస్పిటల్కు తీసుకువచ్చారు. ఆసుపత్రిలో వేచి ఉన్న సమయంలో గణేష్కు విపరీతంగా దాహం వేయడంతో, అక్కడ అందుబాటులో ఉన్న ఒక క్యాన్ను చూసి అతని తల్లి అది మంచినీళ్లేనని భావించింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ క్యాన్లో ఉంది మంచినీళ్లు కావు, లాబరేటరీ పరీక్షల కోసం వినియోగించే అత్యంత ప్రమాదకరమైన కెమికల్ లిక్విడ్.
Also Read
- Maharashtra: డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయని భార్య.. దారుణానికి ఒడిగట్టిన భర్త..
- Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
- Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
Mahabubabad: తల్లి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో.. కొడుకు షాకింగ్ డెసిషన్
ఏమాత్రం అనుమానం కలగని తల్లి, ఆ లిక్విడ్ను కుమారుడికి తాగించింది. అది తాగిన కొద్దిసేపటికే గణేష్ తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పరిస్థితి విషమించడంతో ఆ యువకుడు మృతి చెందాడు. ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రిలోనే, యాజమాన్యం చేసిన చిన్న పొరపాటు ఒక కుటుంబంలో తీరని చీకట్లు నింపింది. విషపూరితమైన కెమికల్స్ ఉన్న డబ్బాలను రోగులకు అందుబాటులో ఉంచడం, వాటిపై ఎటువంటి హెచ్చరిక గుర్తులు లేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
తమ కళ్ల ముందే కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో గణేష్ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. చదువుకుని ఉన్నత స్థాయికి చేరుతాడనుకున్న కొడుకు, జ్వరం తగ్గించుకోవడానికి వచ్చి ఇలా శవమై పడి ఉండటాన్ని చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో చిన్న అనుముల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Sweet Potatoes: డయాబెటిస్ స్వీట్ పోటాటో తినొచ్చా.. నిపుణులు ఏమంటున్నారంటే..
తాజావార్తలు
-
Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
-
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
-
Tata Osprey SUV: టాటా Osprey SUV లాంచ్.. 120 PS పవర్, DCT గేర్బాక్స్, 6 ఎయిర్బ్యాగ్స్
-
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
-
KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!