Husband Suicide: ప్రియుడి మోజులో భార్య.. సెల్ఫీ వీడియో రికార్డు చేసి భర్త ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు భర్తల వేధింపులు భరించలేక భార్యలు ఆత్మహత్యలకు పాల్పడేవారు. తర్వాత కట్నం వేదింపులకు మహిళలు బలయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. భార్య వేదింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొంత మంది భర్తలు. సరిగ్గా గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరి పేర్లు బ్రహ్మయ్య, కౌసల్య. వీరిద్దరూ భార్యాభర్తలు. కాపురానికి వచ్చిన మొదటి మూడు నెలలు అంతా బాగానే ఉంది. తర్వాత అత్తతో కౌసల్యకు విభేదాలు మొదలయ్యాయి. అది కాస్తా ముదిరింది. దీంతో తాను ఇంట్లో ఉండనని తేల్చిచెప్పింది కౌసల్య. ఇక చేసేదేమీలేక భర్త బ్రహ్మయ్య తన భార్య కౌసల్యతో కలిసి తాడేపల్లిలో వేరుకాపురం పెట్టాడు..
READ MORE: Crime News: ప్రియుడు కాదు.. ఆమె పాలిట యముడు..!
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
సీసీ కెమెరా టెక్నీషియన్గా పనిచేస్తున్న బ్రహ్మయ్య.. తన భార్య తరచూ ఫోన్లో మాట్లాడడం గమనించాడు. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావంటూ భార్యను అడిగాడు. కానీ కౌసల్య నుంచి సరైన సమాధానం రాలేదు. చివరకు తన భార్యకు పెళ్లికి ముందే మరొకరితో ప్రేమవ్యవహారం నడిపిన విషయం తెలుసుకున్నాడు. వెంటనే అత్తామామలను పిలిపి ఇదే విషయాన్ని చెప్పాడు. కొంతకాలం దూరంగా ఉంటే అంతా సర్దుకుంటాయని భావించిన కౌసల్య తల్లితండ్రులు.. తమ కూతురిని తీసుకెళ్లారు. నాలుగు నెలల తర్వాత అల్లుడితో మాట్లాడి మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని, ఇద్దరూ కలిసి ఉండండని చెప్పారు. దీంతో అల్లుడు బ్రహ్మయ్య సరే అన్నాడు. కొన్నిరోజులు బాగానే ఉన్న కౌసల్య మళ్లీ తన పాత పద్దతిలోనే ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది. దీంతో తన భార్య మారదని భావించాడు. ఇదే సమయంలో ఆషాడమాసం రావడంతో కౌసల్య పుట్టింటికి వెళ్లింది. అక్కడైనా పద్దతిగా ఉంటుందని భావించాడు. అయితే పుట్టింటికి వెళ్లిన భార్యతో మాట్లాడదామని బ్రహ్మయ్య ఫోన్ చేస్తే ఎప్పుడూ ఎంగేజ్ వస్తుంది.
రాత్రి సమయంలో అయినా మాట్లాడాలని ప్రయత్నించినా భార్య ఫోన్ ఎంగేజ్ రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీనికితోడు కౌసల్య భర్తతో ఫోన్లో బెదిరింపులకు దిగినట్లు మాట్లాడేది. తన భార్య మారకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఇంట్లో సెల్ ఫోన్లో రికార్డు చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందు తన చావుకు కారణం తన భార్యే అంటూ చెప్పాడు. మరుసటిరోజు ఇంటినుంచి బ్రహ్మయ్య బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చింది. ఇంటి కిటికీలోనుంచి చూస్తే ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయిన బ్రహ్మయ్య కనిపించాడు. వెంటనే కుటుంబ సబ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. నులకపేటలో ఉన్న బ్రహ్మయ్య తల్లి విజయప్రమీల కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యింది. తన కొడుకు మృతికి కారణమైన కోడలు కౌసల్యను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది. బ్రహ్మయ్య తల్లి విజయ ప్రమీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సెల్పీ వీడియోతోపాటు బ్రహ్మయ్య తల్లి చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు..
తాజావార్తలు
-
Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
-
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, ప్లేఆఫ్స్కు చేరుతాం.. అభిమానులకు పంజాబ్ ప్లేయర్ భరోసా!
-
Peddi: సాలిడ్ మార్క్ క్రాస్ చేసి.. US మార్కెట్లో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ .. !
-
Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
-
Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!