Cyber Crime: సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్న టీజీ పోలీసులు.. రాష్ట్రం దాటినా వదలట్లే…
- మొన్ననే 25 మంది సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
- ఇటీవల ఓ వృద్దురాలికి ఓ ఫోన్ కాల్
- సీబీఐ ఆఫీసర్ అని పరిచయం చేసుకున్న వ్యక్తి
- ఆర్ధిక నేరాలు చేశారంటూ వృద్దురాలికి బెదిరింపు
- చెప్పినట్లు వినకపోతే డిజిటల్ అరెస్ట్
- వాళ్లు చెప్పిన విధంగా చేసిన వృద్ధురాలు
- అప్పు తెచ్చి మరీ డబ్బు చెల్లింపు
- కింగ్ పిన్ ముంబైలో ఉన్నట్లు పోలీసుల గుర్తింపు
- గోయల్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి
- సైబర్ నేరగాళ్లకు సహకరించిన ఆరుగురు వ్యక్తులు
- బ్యాంకు అకౌంట్లను ప్రొవైడ్ చేసిన సుధాకర్, పేర్ని రాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వాళ్లకి మ్యూల్ అకౌంట్లు సమకూర్చిన నేరగాళ్లను గుర్తించారు. మొత్తంగా ఆరుగురిపై కేసులు పెట్టిన పోలీసులు.. తాజాగా ఒకరిని ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు. మొన్ననే 25 మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ముఠా బాగోతాన్ని బయట పెట్టారు. సైబర్ క్రిమినల్స్కు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్న నేరగాళ్లను గుర్తించారు.. ఇటీవల హైదరాబాద్లో ఉంటున్న ఓ వృద్దురాలికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తులు సీబీఐ ఆఫీసర్గా పరిచయం చేసుకున్నాడు. ఆమెపై కేసు నమోదైందని బెదిరించాడు. అక్రమ ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయని భయపెట్టాడు. సీబీఐ తోపాటు ఈడీలోనూ కేసు నమోదైందని మరో వ్యక్తి బెదిరించాడు. తాము చెప్పినట్లు వినకపోతే డిజిటల్ అరెస్ట్ చేస్తామన్నారు. ఫలితంగా వాళ్లు చెప్పిన విధంగా చేసింది ఆ వృద్ధురాలు. సైబర్ నేరగాళ్లకు తన అకౌంట్లో సొమ్మంతా ట్రాన్స్ఫర్ చేసింది. అప్పు తెచ్చి మరీ డబ్బు చెల్లించింది. కానీ ఇంకా ఇంకా కావాలని ఆమెను వేధించారు. ప్రతిరోజు నిత్య నరకాన్ని అనుభవించిన వృద్ధురాలు.. చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది..
READ MORE: Poolachokka Naveen: నెగిటివ్ రివ్యూ కేసు.. పోలీసుల అదుపులో యూట్యూబర్ పూలచొక్క నవీన్..
Also Read
ఈ కేసులో కింగ్ పిన్ ముంబైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలోని గోయల్ అనే వ్యక్తి దీనికి సూత్రధారిగా తేల్చారు. దీంతో ముంబై కేంద్రంగా నడుస్తున్న సైబర్ నేరగాళ్ల భరతం పట్టారు. వాళ్ళలో కొందరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ తెలంగాణలో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా వాళ్లకు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. హైదరాబాదులోని ఆరుగురు వ్యక్తులు సైబర్ నెరగాళ్ళకు సహకారం అందించారని బయటపడింది. ఇందులో సుధాకర్తో పాటు పేర్ని డాన్సర్ రాజ్ కూడా వాళ్లకు సహాయం అందించాడని పోలీసులు చెప్పారు. సైబర్ నేరగాళ్లకు వీళ్ళు బ్యాంకు అకౌంట్లను ప్రొవైడ్ చేశారు. ఈ బ్యాంకు అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత సైబర్ నేరగాళ్లు వాటిని డ్రా చేసుకున్నారు.. సైబర్ నేరగాళ్లకు సహాయం చేసిన వాళ్ళపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఒకరిద్దరూ దుబాయ్లో ఉండి సైబర్ నేరాలకు సహాయం అందించారు. హైదరాబాదులో ఉన్న విజయ్ కుమార్ అనే వ్యక్తి కూడా సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అకౌంట్లను ఇచ్చారు. పోలీసులు అరెస్టు చేస్తారని భయపడి ఏకంగా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్పటికే లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు పోలీసులు. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన విజయకుమార్ని ముంబై ఎయిర్ పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పేర్ని డాన్సర్తో సహా ఆరుగురు పైనా కేసులు నమోదు చేశారు.
READ MORE: Mahesh Kumar Goud: రాయలసీమను రతనాల సీఎం చేస్తా అన్నది కేసీఆర్ కాదా..?
తాజావార్తలు
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!