Vijayawada Double Murder: బెజవాడ వీధుల్లో వీరవిహారం.. ఇద్దరు యువకులను కిరాతకంగా హత్య చేసిన రౌడీ షీటర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Double Murder: విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఇద్దరు యువకులను ఒక రౌడీ షీటర్ అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. నగరం నడిబొడ్డున గవర్నర్పేటలో జరిగిన ఈ జంట హత్యలతో నగరం ఉలిక్కిపడింది. నిందితుడిని రౌడీ షీటర్ జమ్ముల కిషోర్గా గుర్తించిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. నిత్యం గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు, రౌడీ షీటర్లు.. బెజవాడ వీధుల్లో వీరవిహారం సృష్టిస్తున్నారు.
CM Relief Fund Scam: సెక్రటేరియట్లో దొంగలు.. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులే హామ్ ఫట్..!
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
తాజాగా బెజవాడ గవర్నర్పేటలో ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. ఒకేసారి ఇద్దరు వ్యక్తులను చంపేసి పారిపోయాడు. అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా ఉన్న సందులో ఈ దారుణం జరిగింది. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. యువకులను ఎవరో హత్య చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ కత్తి పొట్లతో రక్తపు మడుగులో ఇద్దరు యువకులు పడి ఉన్నారు. మృతి చెందిన వారిని విజయవాడకి చెందిన రాజు, విశాఖపట్నానికి చెందిన వెంకట రావుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు క్యాటరింగ్ పని చేస్తున్నట్టు చెబుతున్నారు.
AI Video: వాస్తవాన్ని తలపించే నకిలీ వీడియో.. వీడియో వైరల్..!
ఈ జంట హత్య కేసులను సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు షురూ చేశారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. దీంతో ఈ ఇద్దరు యువకులను జమ్ము కిశోర్ అనే రౌడీ షీటర్ హత్య చేసినట్టుగా సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. హత్య చేసిన తర్వాత కిషోర్ పరారైనట్టు CC కెమెరాల్లో రికార్డయింది. మద్యం మత్తులో ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఏంటి అనే విషయాలు విచారిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కిషోర్ను పట్టుకోవడం కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కిషోర్పై ఇప్పటికే 8 కేసులు ఉండగా అందులో ఒక హత్య కేసు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కిషోర్ను అరెస్ట్ చేస్తే.. జంట హత్యలకు అసలు రీజన్ ఏంటనే విషయం బయట పడుతుందంటున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..