Drug Abuse: మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటూ డ్రోన్ కెమెరాకు చిక్కిన యువకులు
- తిరుపతి ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో బీట్..
- వాణి నగర్ సమీపంలోని చెట్లు పొదల మధ్య డ్రోన్ ద్వారా పర్యవేక్షణ..
- మత్తు ఇంజక్షన్లు వేసుకుంటున్న ఆరుగురు యువకులను పసిగట్టిన డ్రోన్ కెమెరా..
- ఆ యువకులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారణ చేపట్టిన పోలీసులు..
Drug Abuse: తిరుపతి జిల్లాలో మత్తు మందు మోజులో పడి యువత తమ బంగారు భవిష్యత్తును సర్వ నాశనం చేసుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు పెరిగిపోవడంతో.. పోలీసులు డ్రోన్ కెమెరాలను ఉపయోగించి.. డ్రగ్స్ తీసుకునే వారిని కనిపెడుతున్నారు. తాజాగా, ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరాగిపెట్టడ, వాణి నగర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాలతో గస్తీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఒక కీలక సమాచారం వెలికి తీశారు.
Read Also: Donald Trump: అర్ధరాత్రి ‘సుంకాల’ బాంబు పేల్చనున్న ట్రంప్.. భారత్పైనేనా?
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
అయితే, వాణి నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న చెట్లు పొదల మధ్య ఆరుగురు యువకులు మత్తు ఇంజక్షన్లు చేతికి ఎక్కించుకుంటున్న విజువల్స్ డ్రోన్ కెమెరా గుర్తించింది. వెంటనే స్పందించిన స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని పోలీస్ స్టేషన్కు తరలించిన.. ఆ తర్వాత వారి తల్లిదండ్రులను కూడా అక్కడికి పిలిపించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. యువత మత్తు మాయలో పడకుండా జాగ్రత్త పడాలని, పిల్లలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ పెంచాలని పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా చర్యలు ముమ్మరం చేయాలని పోలీసుల్ని కోరుతున్నారు. డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వం, పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్మాన్.. అసలేం జరుగుతోంది?
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో