Uttarakhand: దారుణం.. క్లాస్ రూమ్లో తిట్టాడని టీచర్ను కాల్పులు జరిపిన 9వ తరగతి విద్యార్థి
- ఉత్తరాఖండ్లో దారుణం
- క్లాస్ రూమ్లో తిట్టాడని టీచర్ను కాల్పులు జరిపిన 9వ తరగతి విద్యార్థి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి కాలంలో ఆచార్య దేవో భవకు అర్థమే మారిపోతుంది. సినిమాల ప్రభావమో.. లేదంటే సోషల్ మీడియా ప్రభావమో తెలియదు గానీ.. విద్యార్థులు గాడి తప్పుతున్నారు. మొన్నటికి మొన్న అహ్మదాబాద్లో విద్యార్థుల మధ్య ఘర్షణతో టెన్త్ స్టూడెండ్ను 8వ తరగతి విద్యార్థి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటనను ఇంకా మరువక ముందే ఉత్తరాఖండ్లో మరో ఘోరం వెలుగు చూసింది. క్లాస్రూమ్లో అందరి ముందు ఉపాధ్యాయుడు మందలించాడని.. కోపంతో 8వ తరగతి విద్యార్థి తుపాకీతో కాల్పులు జరిపాడు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో దారుణం.. పెళ్లి ఒత్తిడి తేవడంతో మహిళను ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
ఉత్తరాఖండ్లోని కాశీపూర్లో తుపాకీ పేలుడు శబ్దం భయాందోళనకు గురిచేసింది. బుధవారం 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి తరగతి గదిలో ఉపాధ్యాయుడు గగన్ సింగ్ను తుపాకీతో కాల్చాడు. బుల్లెట్ నేరుగా భుజంలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా పాఠశాల భవనం గందరగోళానికి గురైంది. వెంటనే సిబ్బంది టీచర్ను ఆస్పత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించారు. తుపాకీని లంచ్ బాక్స్లో దాచుకుని తెచ్చినట్లుగా గుర్తించారు. బుల్లెట్ ఉపాధ్యాయుడి భుజానికి తాకిందని.. శస్త్ర చికిత్స తర్వాత తొలగింపడిందన్నారు. ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడినట్లుగా పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Nitish Kumar: మదర్సా కార్యక్రమంలో నితీష్ కుమార్ షాక్.. టోపీ ధరించేందుకు నిరాకరణ.. వీడియో వైరల్
ఇక విచారణలో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్రమశిక్షణలో భాగంగా కొద్దిరోజుల క్రితం ఉపాధ్యాయుడు.. విద్యార్థిని తిట్టి, చెంపదెబ్బ కొట్టినట్లుగా తేలింది. దీంతో అప్పటినుంచి విద్యార్థి పగతో రగిలిపోతున్నట్లుగా కనిపెట్టారు. కోపం చల్లారకపోవడంతో తుపాకీ తీసుకొచ్చి కాల్పులు జరిపినట్లుగా పోలీసులు కనుగొన్నారు. కాశీపూర్ ఎస్పీ అభయ్ ప్రతాప్ సింగ్.. ఇతర విద్యార్థులతో కూడా మాట్లాడి వివరాలు సేకరించారు. అలాగే పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. విద్యార్థిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇక విద్యార్థికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే దాని గురించి కూడా వివరాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థిని త్వరలో జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ సంఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని ఉధమ్ సింగ్ నగర్ ఎస్ఎస్పీ మణికాంత్ మిశ్రా అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!