UP: యూపీలో దారుణం.. పెళ్లి ఒత్తిడి తేవడంతో మహిళను ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు
- యూపీలో దారుణం
- పెళ్లి ఒత్తిడి తేవడంతో మహిళను ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. ఎక్కడొక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రియురాలు పదే పదే పెళ్లి ప్రస్తావన తేవడంతో విసిగిపోయి.. అత్యంత దారుణంగా కడతేర్చాడు ఓ ప్రియుడు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లో జరిగింది.
ఇది కూడా చదవండి: Nitish Kumar: మదర్సా కార్యక్రమంలో నితీష్ కుమార్ షాక్.. టోపీ ధరించేందుకు నిరాకరణ.. వీడియో వైరల్
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
ఝాన్సీలోని కిషోర్పురా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సంజయ్ పటేల్.. రచనా యాదవ్ అనే ఒక వితంతువు మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో పదే పదే ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తోంది. దీంతో విసుగుపోయిన అతడు.. ఆమెను వదిలించుకోవాలని కుట్ర పన్నాడు. దీనికి మేనల్లుడు సందీప్ పటేల్, ప్రదీప్ అహిర్వార్ అనే మరొకరి సహాయం కోరాడు. ముగ్గురు కలిసి ఆగస్టు 8న రచనా యాదవ్ను అత్యంత దారుణంగా చంపేసి.. ఏడు ముక్కలుగా చేసి.. సంచుల్లో వేసుకుని పొలంలోని ఒక బావిలో పడేశారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: నేడు బీహార్, బెంగాల్లో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ఈ నెల 13న పొలంలోని బావిలోంచి దుర్వాసన రావడంతో రైతు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకుని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక నీటిలో తేలియాడుతున్న రెండు సంచుల్లోని మహిళ శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్గానికి తరలించారు. ఇక ఆగస్టు 17న ఎండిపోయిన బావిలోంచి చేతులను స్వాధీనం చేసుకున్నారు. ఇక తల, కాళ్లు కనిపించకపోవడంతో గుర్తింపు కష్టంగా మారింది. ఇక పోస్టుమార్టం తర్వాత ఆగస్టు 18న దహన సంస్కారాలు నిర్వహించారు. ఇక మృతదేహం గుర్తింపు కోసం పోలీసులు పోస్టర్లు అతికించారు. అంతేకాకుండా దర్యాప్తులో భాగంగా గ్రామంలో 100 మందిని విచారించారు. 200లకు పైగా సీసీకెమెరా ఫుటేజ్ను పరిశీలించారు. ఎలాంటి పురోగతి లభించలేదు.
ఎట్టకేలకు బాధితురాలు రచనా యాదవ్ సోదరుడు పోస్టర్లలో ఉన్న దానిని బట్టి గుర్తించాడు. దీంతో మాజీ సర్పంచ్తో ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. మాజీ సర్పంచ్తో రచనా యాదవ్కు సంబంధాలు ఉన్నట్లుగా తెలియజేశాడు. దీంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం రూ.25,000 రివార్డ్ ప్రకటించారు. రచనా యాదవ్ది
ఝాన్సీకి రెండు గంటల దూరంలో ఉన్న టికమ్గఢ్కు చెందిన వితంతువుగా పోలీసులు గుర్తించారు. భర్త చనిపోయాక సంజయ్ పటేల్తో సంబంధం పెట్టుకున్నట్లుగా కనిపెట్టారు. అయితే ఈ మధ్య పదే పదే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో వదిలించుకోవాలన్న నిర్ణయంతో చంపేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
ఇక నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు బాధితురాలి తల, కాళ్లకు సంబంధించిన భాగాలు లఖేరి నది నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తును చేయడానికి 8 బృందాలను ఏర్పాటు చేశారు. ఇక దర్యాప్తు పూర్తి చేసినందుకు బృందానికి రూ.50,000 రివార్డు ప్రకటించారు.
తాజావార్తలు
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!