UP: యూపీలో దారుణం.. పెళ్లి ఒత్తిడి తేవడంతో మహిళను ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు
- యూపీలో దారుణం
- పెళ్లి ఒత్తిడి తేవడంతో మహిళను ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. ఎక్కడొక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రియురాలు పదే పదే పెళ్లి ప్రస్తావన తేవడంతో విసిగిపోయి.. అత్యంత దారుణంగా కడతేర్చాడు ఓ ప్రియుడు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లో జరిగింది.
ఇది కూడా చదవండి: Nitish Kumar: మదర్సా కార్యక్రమంలో నితీష్ కుమార్ షాక్.. టోపీ ధరించేందుకు నిరాకరణ.. వీడియో వైరల్
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
ఝాన్సీలోని కిషోర్పురా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సంజయ్ పటేల్.. రచనా యాదవ్ అనే ఒక వితంతువు మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో పదే పదే ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తోంది. దీంతో విసుగుపోయిన అతడు.. ఆమెను వదిలించుకోవాలని కుట్ర పన్నాడు. దీనికి మేనల్లుడు సందీప్ పటేల్, ప్రదీప్ అహిర్వార్ అనే మరొకరి సహాయం కోరాడు. ముగ్గురు కలిసి ఆగస్టు 8న రచనా యాదవ్ను అత్యంత దారుణంగా చంపేసి.. ఏడు ముక్కలుగా చేసి.. సంచుల్లో వేసుకుని పొలంలోని ఒక బావిలో పడేశారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: నేడు బీహార్, బెంగాల్లో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ఈ నెల 13న పొలంలోని బావిలోంచి దుర్వాసన రావడంతో రైతు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకుని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక నీటిలో తేలియాడుతున్న రెండు సంచుల్లోని మహిళ శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్గానికి తరలించారు. ఇక ఆగస్టు 17న ఎండిపోయిన బావిలోంచి చేతులను స్వాధీనం చేసుకున్నారు. ఇక తల, కాళ్లు కనిపించకపోవడంతో గుర్తింపు కష్టంగా మారింది. ఇక పోస్టుమార్టం తర్వాత ఆగస్టు 18న దహన సంస్కారాలు నిర్వహించారు. ఇక మృతదేహం గుర్తింపు కోసం పోలీసులు పోస్టర్లు అతికించారు. అంతేకాకుండా దర్యాప్తులో భాగంగా గ్రామంలో 100 మందిని విచారించారు. 200లకు పైగా సీసీకెమెరా ఫుటేజ్ను పరిశీలించారు. ఎలాంటి పురోగతి లభించలేదు.
ఎట్టకేలకు బాధితురాలు రచనా యాదవ్ సోదరుడు పోస్టర్లలో ఉన్న దానిని బట్టి గుర్తించాడు. దీంతో మాజీ సర్పంచ్తో ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. మాజీ సర్పంచ్తో రచనా యాదవ్కు సంబంధాలు ఉన్నట్లుగా తెలియజేశాడు. దీంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం రూ.25,000 రివార్డ్ ప్రకటించారు. రచనా యాదవ్ది
ఝాన్సీకి రెండు గంటల దూరంలో ఉన్న టికమ్గఢ్కు చెందిన వితంతువుగా పోలీసులు గుర్తించారు. భర్త చనిపోయాక సంజయ్ పటేల్తో సంబంధం పెట్టుకున్నట్లుగా కనిపెట్టారు. అయితే ఈ మధ్య పదే పదే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో వదిలించుకోవాలన్న నిర్ణయంతో చంపేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
ఇక నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు బాధితురాలి తల, కాళ్లకు సంబంధించిన భాగాలు లఖేరి నది నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తును చేయడానికి 8 బృందాలను ఏర్పాటు చేశారు. ఇక దర్యాప్తు పూర్తి చేసినందుకు బృందానికి రూ.50,000 రివార్డు ప్రకటించారు.
తాజావార్తలు
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!