Charlapally Dead Body: వీడిన డెడ్ బాడీ మిస్టరీ.. అసలు అతడు ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charlapally Dead Body: చర్లపల్లి ప్రాంతంలో మహిళ డెడ్ బాడీకి సంబంధించిన మిస్టరీ వీడింది. మృతురాలిని ప్రమీలగా గుర్తించారు. చంపి..డెడ్ బాడీని తీసుకు వచ్చి పడేసిన సీసీ ఫుటేజీ లభించింది. కానీ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు హత్య చేశాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. చర్లపల్లి రైల్వే స్టేషన్. దీన్ని ఇటీవల అంతర్జాతీయ రైల్వే స్టేషన్ తరహాలో తీర్చిదిద్దారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాంటి నిఘా ఉన్న ప్రాంతంలోనే ఓ వ్యక్తి.. తాపీగా వచ్చి మహిళ డెడ్ బాడీని చాలా క్యాజువల్గా ఓ బ్యాగ్ పెట్టినట్లు వదిలేసి వెళ్లాడు…
READ ALSO: Medchal Wife Murder: కిరాతక మొగుడు కాలయముడయ్యాడు..
Also Read
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Vijayawada Road Accident: ఇద్దరి ప్రాణాలు బలిగొన్న కొబ్బరి బొండం
- Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
ఆ మహిళ ఎవరు?
చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడను ఆనుకుని.. తెల్లటి ప్లాస్టిక్ సంచిలో నుంచి రక్తం కారడాన్ని స్థానికులు గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సంచిని ఓపెన్ చేసి చూడడంతో మహిళ శవం కనిపించింది. దీంతో కేసు నమోదు చేసుకుని ఆ మహిళ ఎవరు? ఎవరు హత్య చేసి ఉంటారు? అనే కోణాల్లో దర్యాప్తు చేశారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. ఈ క్రమంలో నిందితున్ని గుర్తించారు. ఓ ఆటోలో యువకుడు తెల్ల సంచి పట్టుకుని వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అతను గోడ పక్కనే డెడ్ బాడీ పెట్టేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతను నేరుగా రైల్వేస్టేషన్ లోపలికి వెళ్లిపోయాడు. అక్కడ ఉన్న లాంజ్ రూమ్కు చేరుకున్నాడు. స్నానం చేశాడు. బట్టలు మార్చుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత నేరుగా అస్సాం వెళ్తున్న ట్రెయిన్ ఎక్కేశాడు..
చంపింది ఎవరు?
అసలు అతడు ఎవరు అనేది ఇంత వరకు పోలీసులు గుర్తించినప్పటికీ.. అతడు ట్రెయిన్ ఎక్కడ దిగాడు? ఏ ప్రాంతానికి వెళ్లాడు? అసలు అతడు ఎవరు? అనే విషయాలు దర్యాప్తులో తెలుస్తాయంటున్నారు. మరోవైపు మృతి చెందిన మహిళ పేరు ప్రమీలగా గుర్తించారు. ఆమె మణికొండలో.. నిందితుడితో సహజీవనం చేస్తోందని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రమీల.. గత 10 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిందంటున్నారు. నిందితుడు ఆమెను మణికొండలోనే చంపేసి.. దాదాపు 36 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చి పడేశాడు. ప్రస్తుతం మహిళ డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సాంకేతిక ఆధారాల ద్వారా కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
Super Subbu: నెట్ఫ్లిక్స్లో టాప్ లేపుతోన్న ‘సూపర్ సుబ్బు’.. హిందీ ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన సెక్స్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్!
-
Lenin Pre Release Event: రేపే గ్రాండ్గా ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ సస్పెన్స్!
-
Prabhas Record: ప్రభాస్ సరికొత్త రికార్డ్.. రెబల్ స్టార్ కెరీర్లోనే..!
-
IBPS SO Recruitment 2026: 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. నెలకు రూ.85,000కు పైగా జీతం
ట్రెండింగ్
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!