NTR District: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని దారుణ హత్య..
- మామిడితోటలో గుర్తు తెలియని మృతదేహం
- రామారావు డెడ్ బాడీగా ధృవీకరించిన పోలీసులు
- ఆదూరి చార్లెస్, బత్తుల కుమారి హత్య చేసినట్టు గుర్తింపు
- చార్లెస్, కుమారి మధ్య వివాహేతర సంబంధం
- కూలి పనులు చేసే చోట రామారావుకు కుమారి పరిచయం
- కుమారిని లైంగికంగా వేధించిన రామారావు
- రామారావును మామిడితోటకు తీసుకెళ్లిన కుమారి
తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ వ్యక్తిని హతమార్చారు. ఈ ఘటన NTR జిల్లా రెడ్డిగూడెంలో జరిగింది. వారం రోజుల క్రితం జరిగిన తాపీ మేస్త్రి రామారావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు కోట రామారావు. NTR జిల్లా ఏ. కొండూరు మండలంలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. రెడ్డిగూడెంలోని మద్దులపర్వ ఇతని స్వస్థలం. ఇతను జూన్ 26 నుంచి కనిపించడం లేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు..
READ MORE: MK Stalin: భాషా ఉద్యమం తమిళనాడు దాటింది.. ఠాక్రేల కలయికపై స్టాలిన్..
Also Read
- Gujarat: సూరత్లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి
- IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Brazilian Athlete: స్విమ్ రేస్ లో ప్రముఖ బ్రెజిలియన్ అథ్లెట్ మృతి..
జూన్ 29న కొత్త రేపుడిలోని ఓ మామిడితోటలో గుర్తు తెలియని మృతదేహం ఉందనే సమాచారం వచ్చింది. దాన్ని రామారావు కుటుంబ సభ్యులకు చూపించగా ఆనవాళ్లు గుర్తించారు. దీంతో రామారావు డెడ్ బాడీగానే ధృవీకరించారు పోలీసులు. ఈ కేసులో విచారణ చేపట్టగా.. పక్కా ప్రణాళిక ప్రకారం మర్డర్ చేసినట్లు తెలిసింది. ఏ. కొండూరు మండలం తూర్పు మాధవరానికి చెందిన ఆదూరి చార్లెస్, రెడ్డిగూడెం మండలం కోనపరాజు పర్వ గ్రామస్థురాలు బత్తుల కుమారి ఈ హత్య చేసినట్టు గుర్తించి ఇద్దరిని అరెస్టు చేశారు.. నిందితులైన చార్లెస్, కుమారి మధ్య ఎప్పటినుంచో వివాహేతర సంబంధం ఉంది.
READ MORE: NTR- Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కోసం స్టార్ విలన్?
అయితే రామారావుకు కూలి పనుల చేసే చోట కుమారితో పరిచయం ఏర్పడింది. దీంతో కుమారిని తన కోరిక తీర్చాలంటూ కొన్ని నెలలుగా రామారావు తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని కుమారి చార్లెస్కు చెప్పటంతో ఇద్దరు రామారావును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా జూన్ 26న రామారావును తీసుకొని కుమారి.. కొత్త రేపూడిలోని మామిడి తోటకు వెళ్లింది. అక్కడ పక్కా ప్లాన్ ప్రకారం చంపేశారు. లైంగిక వేధింపులు సహా ఇతరత్రా ఎలాంటి కేసు అయినా తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు పోలీసులు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటున్నారు..
తాజావార్తలు
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
-
Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
-
Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
-
Tollywood – Bollywood : బాలీవుడ్ హీరోలతో టాలీవుడ్ డైరెక్టర్స్
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?