NTR District: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని దారుణ హత్య..
- మామిడితోటలో గుర్తు తెలియని మృతదేహం
- రామారావు డెడ్ బాడీగా ధృవీకరించిన పోలీసులు
- ఆదూరి చార్లెస్, బత్తుల కుమారి హత్య చేసినట్టు గుర్తింపు
- చార్లెస్, కుమారి మధ్య వివాహేతర సంబంధం
- కూలి పనులు చేసే చోట రామారావుకు కుమారి పరిచయం
- కుమారిని లైంగికంగా వేధించిన రామారావు
- రామారావును మామిడితోటకు తీసుకెళ్లిన కుమారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ వ్యక్తిని హతమార్చారు. ఈ ఘటన NTR జిల్లా రెడ్డిగూడెంలో జరిగింది. వారం రోజుల క్రితం జరిగిన తాపీ మేస్త్రి రామారావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు కోట రామారావు. NTR జిల్లా ఏ. కొండూరు మండలంలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. రెడ్డిగూడెంలోని మద్దులపర్వ ఇతని స్వస్థలం. ఇతను జూన్ 26 నుంచి కనిపించడం లేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు..
READ MORE: MK Stalin: భాషా ఉద్యమం తమిళనాడు దాటింది.. ఠాక్రేల కలయికపై స్టాలిన్..
Also Read
- Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
- Family Suicide Case: "నా ఏటీఎం పిన్ ఇదే.. ఆ డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి".. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
జూన్ 29న కొత్త రేపుడిలోని ఓ మామిడితోటలో గుర్తు తెలియని మృతదేహం ఉందనే సమాచారం వచ్చింది. దాన్ని రామారావు కుటుంబ సభ్యులకు చూపించగా ఆనవాళ్లు గుర్తించారు. దీంతో రామారావు డెడ్ బాడీగానే ధృవీకరించారు పోలీసులు. ఈ కేసులో విచారణ చేపట్టగా.. పక్కా ప్రణాళిక ప్రకారం మర్డర్ చేసినట్లు తెలిసింది. ఏ. కొండూరు మండలం తూర్పు మాధవరానికి చెందిన ఆదూరి చార్లెస్, రెడ్డిగూడెం మండలం కోనపరాజు పర్వ గ్రామస్థురాలు బత్తుల కుమారి ఈ హత్య చేసినట్టు గుర్తించి ఇద్దరిని అరెస్టు చేశారు.. నిందితులైన చార్లెస్, కుమారి మధ్య ఎప్పటినుంచో వివాహేతర సంబంధం ఉంది.
READ MORE: NTR- Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కోసం స్టార్ విలన్?
అయితే రామారావుకు కూలి పనుల చేసే చోట కుమారితో పరిచయం ఏర్పడింది. దీంతో కుమారిని తన కోరిక తీర్చాలంటూ కొన్ని నెలలుగా రామారావు తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని కుమారి చార్లెస్కు చెప్పటంతో ఇద్దరు రామారావును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా జూన్ 26న రామారావును తీసుకొని కుమారి.. కొత్త రేపూడిలోని మామిడి తోటకు వెళ్లింది. అక్కడ పక్కా ప్లాన్ ప్రకారం చంపేశారు. లైంగిక వేధింపులు సహా ఇతరత్రా ఎలాంటి కేసు అయినా తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు పోలీసులు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటున్నారు..
తాజావార్తలు
-
Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
-
Layoffs: టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ కలకలం.. ఏకంగా 21,000 మందిని తొలగించిన దిగ్గజ కంపెనీ..
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
-
Venkey : AK 47 అక్టోబరు 2 రిలీజ్ కష్టమే?
-
Ben Stokes కెరియర్ సేఫ్.. నైట్క్లబ్ వివాదంలో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీబీ..!
ట్రెండింగ్
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!