Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
- దుర్గమ్మ ఆలయంలో టికెట్ల గోల్మాల్..
- భక్తుల సొమ్ముతో సిబ్బంది దందా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్ల గోల్మాల్ కలకలం రేపుతోంది. అమ్మవారి ఆదాయానికి గండి కొడుతూ, భక్తులను మోసం చేస్తున్న అక్రమార్కుల గుట్టు ఒక్కొక్కటిగా రట్టవుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి రెండు పెద్ద ఘటనలు వెలుగుచూడటంతో ఆలయ ఈవో శీనా నాయక్ సీరియస్ అయ్యారు. ఈవో ఫిర్యాదు మేరకు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు (FIR) నమోదు చేశారు.
తాజాగా నిన్న ఆలయంలో టికెట్ల పంచింగ్ దగ్గర పెద్ద మోసం వెలుగుచూసింది. రూ. 100 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో వాటిని పంచింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే, అక్కడ విధుల్లో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చింతాడ సాయి, మరో మహిళా ఉద్యోగి కలిసి సుమారు 70 నుంచి 80 టికెట్లను పంచింగ్ చేయకుండా దాచిపెట్టారు. ఈ టికెట్లను మళ్లీ అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనేది వీరి ప్లాన్. దీనిని గమనించిన ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు వెంటనే అలర్ట్ అయి, ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తనిఖీ చేయగా పంచింగ్ చేయని టికెట్లు బయటపడ్డాయి. వెంటనే ఈ సమాచారాన్ని ఈవోకు చేరవేయగా.. టెంపుల్ పోలీస్ సిబ్బంది నరసింహారావు, జగదీష్లు నిందితులను పట్టుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఈవో శీనా నాయక్ ఆ ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
ఇలాగే ఈ నెల 14వ తేదీన కూడా ఆలయంలో అనధికార దర్శనాలు చేయిస్తున్న దళారీ గుట్టు రట్టయింది. గతంలో దుర్గమ్మ ఆలయంలో హోంగార్డ్గా పనిచేసిన చంద్రశేఖర్ అనే వ్యక్తి.. దళారీగా మారి భక్తులను నిలువునా ముంచాడు. ఏకంగా 50 మంది భక్తుల దగ్గర తలా రూ. 500 చొప్పున మొత్తం రూ. 25,000 వసూలు చేసి అక్రమంగా దర్శనాలు చేయిస్తుండగా ఈవో శీనా నాయక్ స్వయంగా రంగంలోకి దిగి అతడిని పట్టుకున్నారు. ఈవో ఫిర్యాదుతో స్పందించిన సీపీ రాజశేఖర్ బాబు.. హోంగార్డ్ చంద్రశేఖర్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. గతంలో కూడా అమ్మవారి ఆలయంలో నకిలీ రూ. 500 టికెట్ల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే అప్పట్లో నిందితులపై అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేశారని, ఆ ఉదాసీనత వల్లే ఇప్పుడు సిబ్బంది, దళారీలు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారని భక్తులు, స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా నిందితులపై కఠిన చర్యలు తీసుకుని ఆలయ పవిత్రతను కాపాడాలని వారు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?