Supreme Court: దారుణం..చేయని నేరానికి 11 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి..
- ఓ నిరుపేద గ్రామస్థుడు చేయని నేరానికి 11 ఏళ్లు శిక్ష
- దోషిగా నిర్ధారించి విడుదల చేసిన సుప్రీం కోర్టు
- ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘటన
- సవతి తల్లిని బలవంతంగా నీటిలో ముంచి చంపాడని ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ నిరుపేద గ్రామస్థుడు చేయని నేరానికి 11 ఏళ్లు శిక్ష అనుభవించాడు. ట్రయల్ కోర్టు, హైకోర్టు నిర్ణయం వల్ల ఇన్నాళ్లు జైలులో చిప్పకూడు తిన్నాడు. తాజాగా తడిని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం దోషిగా నిర్ధారించి విడుదల చేసింది. సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అసలేం జరిగిందంటే…
READ MORE: Allu Sirish: ఆగష్టు రేసులోకి అల్లు శిరీష్ మూవీ
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్లోని ఖరోరా గ్రామానికి చెందిన రత్ను యాదవ్ మార్చి 2, 2013న తన సవతి తల్లిని బలవంతంగా నీటిలో ముంచి చంపాడని పోలీసులు ఆరోపిస్తూ.. అరెస్ట్ చేశారు. ట్రయల్ కోర్టులో హాజరు పర్చగా.. 2013 జులై 9న ఫాస్ట్ ట్రాక్ విచారణ ద్వారా అతడిని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఏప్రిల్ 7, 2018న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. నిందితుల తరఫు న్యాయవాది ఎవరూ హాజరుకాకపోవడంతో, ప్రాసిక్యూషన్ రికార్డులో ఉంచిన సాక్ష్యాధారాలను పరిశీలించిన సుప్రీం కోర్టు.. న్యాయవాది శ్రీధర్ వై చిటాలేను అమికస్ క్యూరీగా నియమించింది. పోస్టుమార్టం నివేదికలో నీట మునిగి మృతి చెందినట్లు తేలిందని, అయితే అది హత్య అని నిరూపించే బాధ్యతను ప్రాసిక్యూషన్ చేయలేదని చితాలే అన్నారు. విచారణ సమయంలో నిందితుడు తన సవతి తల్లిని బలవంతంగా మానభంగం చేశాడన్న ప్రాసిక్యూషన్ కథనం విశ్వసనీయతను దెబ్బతీసిందన్నారు.
READ MORE:Lover Kills Family: ప్రేమోన్మాది ఘాతుకం.. తండ్రితో సహా ఇద్దరు కూతుళ్ల హత్య..
న్యాయమూర్తులు ఎఎస్ ఓకా, రాజేష్ బిందాల్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ కేసులో నిర్దిష్టమైన.. సారూప్య వైరుధ్యాలను గుర్తించిన తర్వాత, బెంచ్ ట్రయల్ కోర్టు మరియు హైకోర్టు తీర్పులను పక్కనపెట్టి నిందితుడిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఛత్తీస్గఢ్ హైకోర్టులోని బిలాస్పూర్ బెంచ్ కింది కోర్టు నిర్ణయాన్ని సమర్థించేందుకు ఐదేళ్ల సమయం పట్టగా, హత్యా నేరారోపణల నుంచి ఆయనను నిర్దోషిగా విడుదల చేసేందుకు సుప్రీంకోర్టు ఆరేళ్ల సమయం పట్టింది.
తాజావార్తలు
-
Hi: ఆగస్టు 14న కవిన్తో కలిసి ‘హాయ్’ అంటూ నయనతార హంగామా
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!