Mumbai metro: ముంబైకు తొలి అండర్ గ్రౌండ్ మెట్రో.. ప్రారంభం ఎప్పుడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక రాజధాని ముంబైలో మరో అద్భుతమైన ప్రాజెక్ట్ ఆవిష్కృతం కాబోతుంది. నగరానికే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. మొట్టమొదటిసారిగా భూగర్భంలోంచి మెట్రో రైలు వెళ్లేలా ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పూనుకుంది. ఈ పనులు పూర్తి కావడంతో లాంచింగ్కు రెడీ అయింది. ఈనెల 24న అండర్ గ్రౌండ్ మెట్రో రైలు ప్రారంభం కాబోతున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే బుధవారం తెలిపారు. ప్రధాని మోడీ హామీ మేరకు ముంబై వాసుల కల నెరవేరబోతుందని ఆయన పేర్కొన్నారు.
దాదాపు 33.5 కిలోమీటర్ల మేర భూగర్భ మెట్రో కోసం రూ.23.136 కోట్ల అంచనాతో ప్రాజెక్ట్ చేపట్టారు. ప్రతీ రోజూ 1.7 మిలియన్ల ప్రయాణికులకు ఈ మెట్రో లైన్ సేవలందించనుంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంతో రవాణా వేగం పుంజుకుంటుందని బీజేపీ నేత వినోద్ తావ్డే ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Also Read
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
33.5 కిలోమీటర్ల భూగర్భ మెట్రో మార్గంలో ఆరే కాలనీ, SEEPZ, MIDC, మరోల్ నాకా, CSMIA T2, సహర్ రోడ్, CSMIA T1, శాంతాక్రూజ్, విద్యానగరి, BKC, ధారవి, శిట్లదేవి ఆలయం, దాదర్, సిద్ధివినాయక్ ఆలయం, వర్లి, ఆచార్య ఆత్రే చౌక్, సైన్స్ మ్యూజియం దగ్గర స్టాప్లు ఉంటాయి. మహాలక్ష్మి, ముంబై సెంట్రల్, గ్రాంట్ రోడ్, గిర్గావ్, కల్బాదేవి, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, హుతాత్మా చౌక్, చర్చిగేట్, విధాన్ భవన్, కఫ్ పరేడ్ రూట్లో రైలు పరుగులు పెట్టనుంది. ఇప్పటికే ట్రయల్స్ పూర్తయ్యాయి. త్వరలోనే కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (CMRS) తనిఖీ నిర్వహించనున్నారు.
మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.23,136 కోట్లు. నిధులలో ఎక్కువ భాగం జపాన్దే. 57.2 శాతం నిధులు ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) ODA రుణం రూ. 13,235 కోట్లుగా ఉంది. ఇక 30 సంవత్సరాల్లో రీపేమెంట్ వ్యవధి ఉంది. ప్రాజెక్ట్ కోసం 1.15 శాతం వడ్డీ రేటు కూడా ఉంది. ఇక కొత్త లైన్ యొక్క ప్రత్యేకతలు నిరంతర మొబైల్ సేవ ఉంది. ఒక్కో రైలుకు 3,000 మంది ప్రయాణీకులు జర్నీ చేసే సామర్థ్యం కల్పించారు.
https://twitter.com/TawdeVinod/status/1813466907254624619
తాజావార్తలు
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!