ట్విట్టర్ డైరెక్టర్ల బోర్డు కీలక తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.. టెస్లా సీఈవో ఎలన్మస్క్ కు 44 బిలియన్ల డాలర్లకు ట్విట్టర్కు అప్పగించేందుకు తీర్మానం చేసింది.. ట్విట్టర్ సంస్థ ఉద్యోగులతో గత వారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఆ సంస్థను టేకోవర్ చేయడానికి తాను ఆసక్తితో ఉన్నట్లు ఎలన్మస్క్ వెల్లడించిన విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు బోర్డు ఏకగ్రీవంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, బిలియనీర్ మరియు టెస్లా సీఈవో ఎలన్మస్క్కు కంపెనీ యొక్క ప్రతిపాదిత 44 బిలియన్ల డాలర్లకు విక్రయాన్ని వాటాదారులు ఆమోదించాలని ట్విట్టర్ బోర్డు ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది.
అయితే, ట్విట్టర్ షేర్లు అతని ఆఫర్ ధర కంటే చాలా తక్కువగా ఉన్నాయి.. మంగళవారం స్టాక్మార్కెట్లు ప్రారంభమైన గంటకు ముందు షేర్లు దాదాపు 3 శాతం పెరిగి 38.98 డాలర్లకు చేరుకున్నాయి, అయితే, మస్క్ ఆఫర్ చేసిన 54.20 డాలర్ల కంటే ట్విట్టర్ షేర్ విలువ తక్కువగానే ఉంది.. కంపెనీ స్టాక్ చివరిసారిగా ఏప్రిల్ 5న ఆ స్థాయికి చేరుకుంది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్తో మంగళవారం పెట్టుబడిదారులకు లిట్టర్ను వివరిస్తూ, ట్విట్టర్ యొక్క డైరెక్టర్ల బోర్డు విలీన ఒప్పందాన్ని ఆమోదించడానికి మీరు ఓటు వేయాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తున్నట్టు తెలిపింది. డీల్ ఇప్పుడు ముగిస్తే, కంపెనీలోని పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న ప్రతి షేరుకు 15.22 డాలర్ల లాభాన్ని పొందుతారని తెలిపారు.