Stock Market: లాభాల్లో సూచీలు.. ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీ
- లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
- అంతర్జాతీయ సూచీల్లోని సానుకూల పవనాలు మన మార్కెట్లకు సపోర్ట్..
- సరికొత్త రికార్టు సృష్టించిన సెన్సెక్స్.. నిఫ్టీ సూచీలు..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ సూచీల్లోని సానుకూల పవనాలు మన మార్కెట్లకు సపోర్టుగా నిలుస్తున్నాయి. ఆరంభ ట్రేడింగ్లోనే రెండు సూచీలు రికార్డు గరిష్ఠాలను తాకేశాయి. 79,787 దగ్గర సెన్సెక్స్, 24,209 వద్ద నిఫ్టీ ట్రేడింగ్ను స్టార్ట్ చేశాయి. తర్వాత కొనుగోళ్లతో తొలిసారి 80,000 కీలక మైలురాయిని సెన్సెక్స్ తాకి 80,074 వద్ద సరికొత్త రికార్డును సృష్టించింది. నిఫ్టీ 24,296 దగ్గర తాజా రికార్ట్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.53 దగ్గర స్టార్ట్ అయింది. ఉదయం 9: 54 గంటల సమయంలో సెన్సెక్స్ 592 పాయింట్ల లాభంతో 80,033, నిఫ్టీ 175 పాయింట్లు ఎగబాకి 24,299 వద్ద కొనసాగుతున్నాయి.
Read Also: Biden- Trump Debate: ట్రంప్తో డిబేట్లో నిద్రపోయినంత పనైంది.. తడబాటుపై బైడెన్ రియాక్షన్..!
Also Read
- Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్లో నేటి రేట్స్ ఇవే!
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
- LPG Cylinder Price: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 993 పెంపు
- Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
సెన్సెక్స్-30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ఉండగా.. టీసీఎస్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్గ్రిడ్, రిలయన్స్, టైటన్, మారుతీ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ నష్టాల్లో స్టార్ట్ అయ్యాయి.
Read Also: Kalki2898AD: ఓరినాయనో.. త్రీడీ కళ్ల జోళ్ల తో నిర్మాతకు కోటి రూపాయలా..!
కాగా, అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగియగా.. నేడు ఆసియా సూచీలూ సానుకూలంగా ట్రేడింగ్ లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 86.72 డాలర్ల దగ్గర కొనసాగుతుంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.2,000 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మకాలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.648 కోట్ల వాటాలను కొనుగోలు చేసేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
-
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
-
Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
-
Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!