Stock Market: లాభాల్లో సూచీలు.. ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీ
- లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
- అంతర్జాతీయ సూచీల్లోని సానుకూల పవనాలు మన మార్కెట్లకు సపోర్ట్..
- సరికొత్త రికార్టు సృష్టించిన సెన్సెక్స్.. నిఫ్టీ సూచీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ సూచీల్లోని సానుకూల పవనాలు మన మార్కెట్లకు సపోర్టుగా నిలుస్తున్నాయి. ఆరంభ ట్రేడింగ్లోనే రెండు సూచీలు రికార్డు గరిష్ఠాలను తాకేశాయి. 79,787 దగ్గర సెన్సెక్స్, 24,209 వద్ద నిఫ్టీ ట్రేడింగ్ను స్టార్ట్ చేశాయి. తర్వాత కొనుగోళ్లతో తొలిసారి 80,000 కీలక మైలురాయిని సెన్సెక్స్ తాకి 80,074 వద్ద సరికొత్త రికార్డును సృష్టించింది. నిఫ్టీ 24,296 దగ్గర తాజా రికార్ట్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.53 దగ్గర స్టార్ట్ అయింది. ఉదయం 9: 54 గంటల సమయంలో సెన్సెక్స్ 592 పాయింట్ల లాభంతో 80,033, నిఫ్టీ 175 పాయింట్లు ఎగబాకి 24,299 వద్ద కొనసాగుతున్నాయి.
Read Also: Biden- Trump Debate: ట్రంప్తో డిబేట్లో నిద్రపోయినంత పనైంది.. తడబాటుపై బైడెన్ రియాక్షన్..!
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
సెన్సెక్స్-30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ఉండగా.. టీసీఎస్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్గ్రిడ్, రిలయన్స్, టైటన్, మారుతీ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ నష్టాల్లో స్టార్ట్ అయ్యాయి.
Read Also: Kalki2898AD: ఓరినాయనో.. త్రీడీ కళ్ల జోళ్ల తో నిర్మాతకు కోటి రూపాయలా..!
కాగా, అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగియగా.. నేడు ఆసియా సూచీలూ సానుకూలంగా ట్రేడింగ్ లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 86.72 డాలర్ల దగ్గర కొనసాగుతుంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.2,000 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మకాలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.648 కోట్ల వాటాలను కొనుగోలు చేసేశారు.
తాజావార్తలు
-
OTR: ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉండేవారు.. ఇప్పుడు ఏమైందో ఏమో..
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన SIR ప్రక్రియ.. గందరగోళం మధ్యే డిజిటలైజేషన్
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..