JioCinema: జియో సినిమాకు ఇక ఛార్జీలు.. ఐపీఎల్ తర్వాత ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JioCinema: ఐపీఎల్ హక్కలను సొంతం చేసుకున్న తర్వాత జియో సినిమా చాలా మందికి దగ్గరైంది. అయితే ఇప్పుడు జియో సినిమాను అతిపెద్ద స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ గా మార్చేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్ లను తన జియో సినిమా యాప్ లోకి తీసుకురావాలని అనుకుంటోంది. ఇప్పటికే దేశంలో అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, నెట్ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలకు జియో సినిమా ద్వారా పోటీ ఇవ్వాలని రిలయన్స్ భావిస్తోంది. అయితే జియో సినిమా కంటెంట్ కు ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తోంది. ఐపీఎల్ తర్వాత ఛార్జీలను వసూలు చేసేందుకు సిద్ధం అవుతోంది.
Read Also: IPL 2023 : పంజాబ్ హ్యాట్రిక్ ఓటమి నుంచి తప్పించుకుంటుందా..? లక్నో టాప్ ప్లేప్ లోకి వెళ్తుందా..?
Also Read
- SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
- ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
అయితే ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచులకు సంబంధించి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది వయాకాప్ 18. జియో సినిమా యాప్ ద్వారా ఐపీఎల్ ప్రసారాలను ఫ్రీగా అందిస్తోంది. దీంతో జియో సినిమా రీచ్ బాగా పెరిగింది. కొన్ని కోట్ల మంది జియో సినిమా ద్వారా ఐపీఎల్ మ్యచ్ లను వీక్షిస్తున్నారు. అయితే ఐపీఎల్ మ్యాచులు ఐపోయిన తర్వాత కొత్త కంటెంట్ యాడ్ చేయాలనుకుంటోంది. దీనికి ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తోంది. ఐపీఎల్ మ్యాచులను మాత్రం ఫ్రీగా అందించనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఐపీఎల్ తో జియో సినిమాకు వచ్చిన ఆదరణను అలాగే కొనసాగించాలని రిలయన్స్ అనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే స్ట్రీమింగ్ దిగ్గజంగా మార్చాలని యోచిస్తోంది.
ఐపీఎల్ మ్యాచులు మే 28తో ముగియనున్నాయి. ఆ లోపే కొత్త కంటెంట్ యాడ్ చేయాలని రిలయన్స్ భావిస్తోంది. ఐపీఎల్ ను మాత్రం యథాతధంగా వీక్షించవచ్చని రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఎంత మేర ఛార్జీలు వసూలు చేయాలనే దానిపై ప్రస్తుతానికైతే ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇప్పటికే వ్యూయర్షిప్ లో జియో సినిమా అదరగొడుతోంది. తొలివారంలోనే 5.5 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 12న చెన్నై-రాజస్థాన్ మ్యాచును రికార్డు స్థాయిలో 2.2 కోట్ల మంది చూశారు. ఇదిలా ఉంటే ఇప్పుడైతే ఐపీఎల్ ఫ్రీగా చూస్తున్నాం కానీ, వచ్చే ఏడాది ఫ్రీగా ఇస్తారా..? లేదా.?? అనేది తెలియలేదు. అయితే నెటిజన్లు మాత్రం అలవాటు చేసి ఇప్పుడు ఛార్జంటున్నారని మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా..?
-
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!