Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లో గత వారం నమోదైన ర్యాలీకి దేశంలోని అతిపెద్ద కంపెనీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్లోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.1.54 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇందులో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అత్యధిక లాభాన్ని నమోదు చేయడం విశేషం. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 582.06 పాయింట్లు (0.75%), ఎన్ఎస్ఈ నిఫ్టీ 127.40 పాయింట్లు (0.52%) పెరిగి ముగిశాయి. మార్కెట్లో పెరిగిన ఇన్వెస్టర్ల విశ్వాసం, కొనుగోళ్ల జోరు కారణంగా ప్రముఖ కంపెనీల మార్కెట్ విలువలు గణనీయంగా పెరిగాయి.
గత వారంలో మార్కెట్ విలువ పరంగా అత్యధిక లాభం పొందిన సంస్థగా TCS నిలిచింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.72,072.30 కోట్లు పెరిగి రూ.8.20 లక్షల కోట్లకు పైగా చేరుకుంది. ఇటీవల ప్రకటించిన జూన్ త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4.61 శాతం పెరగడం, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచింది. దీంతో TCS షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. అదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ సుమారు రూ.29,062 కోట్లు పెరిగి రూ.10.34 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.23,885 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.21,947 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రూ.7,338 కోట్లు పెరిగాయి.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
అయితే అన్ని ప్రముఖ కంపెనీలకు గత వారం లాభాలు దక్కలేదు. లార్సన్ అండ్ టుబ్రో (L&T) మార్కెట్ విలువలో అత్యధిక తగ్గుదల నమోదైంది. కంపెనీ మార్కెట్ క్యాప్ సుమారు రూ.18,098 కోట్లు తగ్గింది. ఇక ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ.12,081 కోట్లు, భారతి ఎయిర్టెల్ రూ.7,706 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.7,085 కోట్లు, హిందుస్థాన్ యూనిలీవర్ రూ.1,222 కోట్లు తగ్గాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఐసీ, లార్సన్ అండ్ టుబ్రో, హిందుస్థాన్ యూనిలీవర్ ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..