RBI Orders: అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Orders: 10 వేల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు కలిగిన అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నాటికి చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్లను నియమించాలని రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. టయర్-4 ఎంటిటీస్గా వర్గీకరించిన ఈ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని సూచించింది. వెయ్యి నుంచి 10 వేల కోట్ల రూపాయల లోపు డిపాజిట్లు కలిగిన టయర్-3 బ్యాంకులు ఈ నిర్ణయాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ ఒకటి లోపు అమలుచేయాలని గడువు విధించింది. టయర్-1, టయర్-2 బ్యాంకులకు ప్రస్తుతం ఉన్న నిబంధనలే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
5 ఏళ్లలో 35 వేల కోట్లు
Also Read
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
- GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
- Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 5 ప్రధాన ప్రాజెక్టులను వచ్చే ఐదేళ్లలో పూర్తిచేసేందుకు 35 వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టనున్నట్లు నుమాలీగఢ్ రిఫైనరీ వెల్లడించింది. ఈ ఐదు ప్రాజెక్టుల్లో ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ కూడా ఉండటం గమనించాల్సిన విషయం. దీర్ఘకాల వ్యాపారాభివృద్ధి దృష్ట్యా ఈ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సంస్థ చైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్ రథ్ తెలిపారు. కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశం అనంతరం ఈ వివరాలను వెల్లడించారు.
Tollywood Trends-2: టైటిల్ ఒక్కటే.. సినిమాలే వేరు..
ఇథనాల్ రేటు పెంపు
అన్ని కేటగిరీల్లో ఇథనాల్ కొనుగోలు ధరను వచ్చే సీజన్ నుంచి లీటర్కి రెండు రూపాయల వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త రేట్లు 2022-23 సీజన్లో అంటే ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ మధ్య కాలంలో అమల్లో ఉంటాయని తెలుస్తోంది. మన దేశం 2025 నాటికి 20 శాతం ఇథనాల్ మిశ్రమ ఆటో ఇంధనాన్ని వినియోగించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం 8 శాతం ఇథనాలే కలుపుతున్న సంగతి తెలిసిందే.
స్టాక్ మార్కెట్ అప్డేట్
స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 547 పాయింట్లు లాభపడి 59688 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 182 పాయింట్లు లాభపడి 17804 పైనే కొనసాగుతోంది. బంగారం రూ.49259 వద్ద, వెండి రూ.56,582 వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. రూపాయి విలువ 7 పైసలు పెరిగి 79.52 వద్ద నిలకడగా ఉంది.
తాజావార్తలు
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
-
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
-
WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?