Home
Todays Updates
Todays Updates News
-
ONDC Network: ఓఎన్డీసీలోకి తొలి ఇంటర్-సిటీ లాజిస్టిక్స్ ప్రొవైడర్ Shiprocket
ONDC Network: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ‘‘ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’’లోకి షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ Shiprocket చేరింది. తద్వారా ఈ పరిధిలోకి వచ్చిన తొలి ఇంటర్-సిటీ లాజిస్టిక్స్ ప్రొవైడర్ గా నిలిచింది. ఈ మేరకు ఈ నెల 22న తొలి లావాదేవీని విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ఇకపై అన్ని సెగ్మెంట్లకు సంబంధించిన విక్రయదారులు తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ఉన్న సిటీలకు, టౌన్లకు చేరవేసే వీలు కలిగింది. -
Vijayawada to Sharjah: విజయవాడ నుంచి నేరుగా షార్జాకి విమానం
Vijayawada to Sharjah: విజయవాడ నుంచి షార్జాకి నేరుగా రాకపోకలు సాగించే ఎయిరిండియా విమాన సర్వీసులు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఎక్స్ప్రెస్ ఫ్లైట్ సోమవారం సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు విజయవాడలో బయలుదేరుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఇదే తొలి విమాన సర్వీసు కావటం విశేషం. స్టార్టింగ్ ఆఫర్ కింద టికెట్ ప్రారంభ ధర 13,669 రూపాయలని అధికార వర్గాలు పేర్కొన్నాయి. షార్జా నుంచి విజయవాడకి సర్వీస్ ఛార్జ్… -
5G Towers: వారానికి కనీసం 10 వేల 5జీ టవర్లను ఏర్పాటుచేయాలి
5G Towers: టెలీకమ్యూనికేషన్ కంపెనీలు ప్రస్తుతం వారానికి 2 వేల 5 వందల 5జీ టవర్లను మాత్రమే ఏర్పాటుచేస్తుండగా ఆ సంఖ్యను వారానికి కనీసం 10 వేలకు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇప్పటివరకు మొత్తం 8 వేల టవర్లను మాత్రమే ఇన్స్టాల్ చేశారని, 5జీ మౌలిక సదుపాయాల ఏర్పాటులో టెల్కోలకు ప్రభుత్వం నుంచి పాలసీకి సంబంధించిన ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
Heritage Foods: నేషనల్ బ్రాండ్ అవ్వాలని హెరిటేజ్ ప్లాన్
Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్ని నేషనల్ బ్రాండ్గా అభివృద్ధి చేయాలని కంపెనీ యాజమాన్యం భవిష్యత్ ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రొడక్టుల మ్యానిఫ్యాక్షరింగ్ కెపాసిటీలను పెంచుకోవాలని నిర్ణయించింది. పాల సేకరణ కోసం పల్లె స్థాయిలో మౌలిక వసతులను ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు, 11 రాష్ట్రాల్లో 121 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, ఒకటీ పాయింట్ మూడు లక్షల రిటైల్ ఔట్లెట్లు, 859 పార్లర్లు ఉన్నాయి. -
MosChip: హైదరాబాద్ టెక్ కంపెనీ ‘మాస్ చిప్’ ప్రత్యేకతేంటి?
MosChip: హైదరాబాద్లోని టెక్నాలజీ కంపెనీ ‘మాస్ చిప్’.. 52 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని నమోదుచేసింది. గత నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. నిరుడు ఇదే టైమ్లో ఈ సంస్థ 39 కోట్లకు పైగా మాత్రమే రెవెన్యూని ఆర్జించింది. దీంతో పోల్చితే ఈసారి 33 శాతం అధిక ఆదాయాన్ని సొంతం చేసుకుంది. అయితే.. రెవెన్యూ పెరిగినప్పటికీ నికర లాభం మాత్రం తగ్గిందని మాస్ చిప్ పేర్కొంది. నెట్ ప్రాఫిట్.. కోటీ 60 లక్షల రూపాయల నుంచి… -
Sai Silks (Kalamandir): త్వరలో.. సాయి సిల్క్స్ (కళామందిర్) పబ్లిక్ ఇష్యూ
Sai Silks (Kalamandir): హైదరాబాద్లోని శారీ రిటైలర్ సంస్థ సాయి సిల్క్స్ కళామందిర్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా 12 వందల కోట్ల రూపాయల నిధుల సమీకరణ దిశగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కోసం వెయిట్ చేస్తోంది. ఇక మీదట ఫ్రాంచైజీ విధానంలో బిజినెస్ను విస్తరించాలనుకుంటోంది. ఈ కంపెనీకి ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో సొంతగా 50 రిటైల్ స్టోర్లు ఉండగా రానున్న రెండేళ్లలో మరో 25 స్టోర్లను… -
Gopuff Layoff: గోపఫ్.. 200 మందికి పైగా స్టాఫ్ ఉఫ్
Gopuff Layoff: అమెరికన్ కన్జ్యూమర్ గూడ్స్ మరియు ఫుడ్ డెలివరీ కంపెనీ గోపఫ్ రీసెంటుగా 200 మందికి పైగా కస్టమర్ సర్వీస్ ఉద్యోగులను తొలగించింది. జులై రౌండ్ లేఆఫ్ లో భాగంగా వీళ్లను తీసేసినట్లు తెలిపింది. సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక మందగమనంతోపాటు నిధుల సమీకరణ నెమ్మదించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాభాలపై ఫోకస్ పెట్టేందుకు సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వర్క్ ఫోర్సును 10 శాతం తగ్గించుకోనున్నట్లు గోపఫ్ జులై నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
Buy Now Pay Later: ‘పైన్ ల్యాబ్స్’వారి.. బై నౌ పే లేటర్కి.. చిన్న టౌన్లలో పెద్ద డిమాండ్
Buy Now Pay Later: ఫిన్ టెక్ యూనికార్న్ పైన్ ల్యాబ్స్ అందిస్తున్న బుక్ నౌ పే లేటర్ (బీఎన్పీఎల్) సర్వీసుకి చిన్న పట్టణాల్లో భారీ డిమాండ్ నెలకొంటోంది. ఈ లావాదేవీల విలువ ఈ నెలలో 5 వేల కోట్ల రూపాయలకు చేరనుందని అంచనా వేస్తోంది. పండగ సీజన్ నేపథ్యంలో ప్రొడక్టులను ఈఎంఐ (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్) పద్ధతిలో (ఆఫ్లైన్ మర్చెంట్ కమ్యూనిటీలో) కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. -
Sony Pictures India: ‘సోనీ పిక్చర్స్ ఇండియా’ రీబ్రాండ్
Sony Pictures India: సోనీ పిక్చర్స్ ఇండియా తన నెట్వర్క్లోని ఛానల్స్ అన్నింటినీ రీబ్రాండ్ చేసింది. గ్లోబల్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. సోనీ బ్రాండ్ పవర్ మరియు వ్యాల్యూస్ ఇన్నాళ్లూ తమ వర్క్ ఎథిక్స్కి వెన్నెముకగా నిలిచాయని, అవి ఇప్పుడు తమ ఛానల్ బ్రాండ్ ఆర్కిటెక్చర్లోనూ ప్రతిబింబిస్తాయని సంస్థ ఎండీ, సీఈఓ ఎన్ పీ సింగ్ చెప్పారు. రీబ్రాండింగ్కి సంబంధించిన పనులను మూడేళ్ల కిందట ప్రారంభిస్తే ఇన్నాళ్లకు కొలిక్కి వచ్చాయి. -
Indian Brands: 100 ఇండియన్ బ్రాండ్లకు గ్లోబల్ ఛాంపియన్లుగా ప్రమోషన్
Indian Brands: 2047 నాటికి గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో 10 శాతం వాటాను సొంతం చేసుకోవాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ ఎగుమతుల్లో మన దేశం షేరు ప్రస్తుతం 2.1 శాతం మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. ఈ పర్సంటేజీని 2027 నాటికి 3 శాతానికి 2047 నాటికి 10 శాతానికి పెంచాలని ఆశిస్తోంది. 100 ఇండియన్ బ్రాండ్లను గ్లోబల్ ఛాంపియన్లుగా ప్రమోట్ చేయటం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!