‘Note’ these points: పెద్ద నోట్ల రద్దుతో ఒరిగిందేం లేదన్నారుగా? ఆషిమా గోయెల్ ఏం చెప్పారో విన్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Note’ these points: దాదాపు ఆరేళ్ల కిందట పెద్ద నోట్లను రద్దు చేయటం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలు ఆషిమా గోయెల్ అన్నారు. పన్నుల వసూళ్లు పెరగటానికి ఈ నిర్ణయం పరోక్షంగా దోహదపడిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఎకానమీ.. డిజిటల్ బాటలో శరవేగంగా పయనిస్తోందని చెప్పారు. ఎక్కువ మంది ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి, ట్యాక్స్ పరిధిలోకి రావటం వల్ల పన్నులను ఎగవేసేవారి సంఖ్య తగ్గిందని, దీని వల్ల పన్నుల రేట్లను సైతం తగ్గించే స్థితికి మన దేశం వచ్చిందని ఆషిమా గోయెల్ వివరించారు.
బ్లాక్ మనీ చెలామణికి చెక్ పెట్టేందుకు, డిజిటల్ చెల్లింపులను ఎంకరేజ్ చేసేందుకు, ఎకానమీలో ట్రాన్స్పరెన్సీని తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను తెచ్చిన సంగతి తెలిసిందే. దీనివల్ల అప్పట్లో చాలా మంది క్యాష్ దొరక్క అష్టకష్టాలు పడ్డారు. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద క్యూల్లో నిలబడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఇలాంటి స్వల్ప కాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ పెద్ద నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఈ మధ్యకాలంలోనే తెలిసొస్తున్నాయని ఆషిమా గోయెల్ వెల్లడించారు.
Also Read
- RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
- SpaceX IPO: స్పేస్ఎక్స్ IPOతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ అవుతారా?.. ప్రపంచ దృష్టి నాస్డాక్పై
- Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
Diwali Sanctions In Vizag: విశాఖలో అక్కడ దీపావళి వేడుకలు నిషేధం.. ఎందుకో తెలుసా?
పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగే లాభాలను ప్రజలు రానున్న రోజుల్లో మరింతగా అనుభవంలోకి తెచ్చుకుంటారని చెప్పారు. నగదు వాడకాన్ని ఇంకా తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తేనున్న విషయాన్ని ఆషిమా గోయెల్ ప్రస్తావించారు. ఈ నెల 9వ తేదీ నాటికి కార్పొరేట్ మరియు పర్సనల్ (స్థూల) పన్ను వసూళ్లు సుమారు 24 శాతం పెరిగి దాదాపు 9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత నెలలో జీఎస్టీ కలెక్షన్లలో 26 శాతం గ్రోత్ నమోదైంది. మొత్తం వసూళ్లు కోటీ 47 లక్షల కోట్లకు పెరిగాయి. వరుసగా ఏడో నెల కూడా జీఎస్టీ కలెక్షన్లు 1.40 లక్షల కోట్లను దాటడం విశేషం.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!