‘Note’ these points: పెద్ద నోట్ల రద్దుతో ఒరిగిందేం లేదన్నారుగా? ఆషిమా గోయెల్ ఏం చెప్పారో విన్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Note’ these points: దాదాపు ఆరేళ్ల కిందట పెద్ద నోట్లను రద్దు చేయటం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలు ఆషిమా గోయెల్ అన్నారు. పన్నుల వసూళ్లు పెరగటానికి ఈ నిర్ణయం పరోక్షంగా దోహదపడిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఎకానమీ.. డిజిటల్ బాటలో శరవేగంగా పయనిస్తోందని చెప్పారు. ఎక్కువ మంది ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి, ట్యాక్స్ పరిధిలోకి రావటం వల్ల పన్నులను ఎగవేసేవారి సంఖ్య తగ్గిందని, దీని వల్ల పన్నుల రేట్లను సైతం తగ్గించే స్థితికి మన దేశం వచ్చిందని ఆషిమా గోయెల్ వివరించారు.
బ్లాక్ మనీ చెలామణికి చెక్ పెట్టేందుకు, డిజిటల్ చెల్లింపులను ఎంకరేజ్ చేసేందుకు, ఎకానమీలో ట్రాన్స్పరెన్సీని తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను తెచ్చిన సంగతి తెలిసిందే. దీనివల్ల అప్పట్లో చాలా మంది క్యాష్ దొరక్క అష్టకష్టాలు పడ్డారు. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద క్యూల్లో నిలబడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఇలాంటి స్వల్ప కాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ పెద్ద నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఈ మధ్యకాలంలోనే తెలిసొస్తున్నాయని ఆషిమా గోయెల్ వెల్లడించారు.
Also Read
- Memory Chip: చిప్ తయారీలో భారత్ సంచలనం.. కొత్త పెట్టుబడుల రాకపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Home Loan : హోమ్ లోన్ తీసుకుంటున్నారా ? ఈ పొరపాటును మాత్రం అస్సలు చేయకండి
- MRM Portal: MRM పోర్టల్ అంటే ఏమిటి? సైబర్ మోసంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఎలా పొందాలి?
- Senior Citizen Savings Scheme : సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా రూ. 20,000 వడ్డీ... ఏ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టాలంటే ?
Diwali Sanctions In Vizag: విశాఖలో అక్కడ దీపావళి వేడుకలు నిషేధం.. ఎందుకో తెలుసా?
పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగే లాభాలను ప్రజలు రానున్న రోజుల్లో మరింతగా అనుభవంలోకి తెచ్చుకుంటారని చెప్పారు. నగదు వాడకాన్ని ఇంకా తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తేనున్న విషయాన్ని ఆషిమా గోయెల్ ప్రస్తావించారు. ఈ నెల 9వ తేదీ నాటికి కార్పొరేట్ మరియు పర్సనల్ (స్థూల) పన్ను వసూళ్లు సుమారు 24 శాతం పెరిగి దాదాపు 9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత నెలలో జీఎస్టీ కలెక్షన్లలో 26 శాతం గ్రోత్ నమోదైంది. మొత్తం వసూళ్లు కోటీ 47 లక్షల కోట్లకు పెరిగాయి. వరుసగా ఏడో నెల కూడా జీఎస్టీ కలెక్షన్లు 1.40 లక్షల కోట్లను దాటడం విశేషం.
తాజావార్తలు
-
INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
-
Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్గా..
-
NEET UG 2026: నీట్ రాసే విద్యార్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డులు వచ్చేశాయి! ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
-
Bhatti Vikramarka : చరిత్రను, భవిష్యత్తును గుండెకు హత్తుకున్న నగరం హైదరాబాద్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
ట్రెండింగ్
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!