Reliance Jio: చైనా కంపెనీని వెనక్కి నెట్టిన జియో!.. డెటా వినియోగంలో ప్రపంచంలోనే నంబర్ వన్..
- మరో రికార్డు సృష్టించిన రిలయన్స్ జియో
- ప్రపంచవ్యాప్తంగా డేటా వినియోగంలో నంబర్ వన్ గా నిలిచిన కంపెనీ
- చైనా కంపెనీలను వెనక్కు నెట్టేసిన జియో
- దాదాపు 13 కోట్లకు చేరిన 5G కస్టమర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా డేటా వినియోగంలో నంబర్ వన్ కంపెనీగా అవతరించింది. చైనా కంపెనీలను వెనక్కు నెట్టేసింది. రిలయన్స్ జియో యొక్క జూన్ త్రైమాసిక గణాంకాలు తాజాగా వెల్లడించింది. అందులో కంపెనీ డేటా వినియోగం 4400 కోట్ల జీబీని మించిపోయింది. గతేడాది గణాంకాలతో పోలిస్తే ఈ సారి 33 శాతం పెరిగింది. దేశంలోని కస్టమర్లు రోజూ సగటున 1జీబీ (GB) కంటే ఎక్కువ డేటాను వినియోగిస్తున్న ఏకైక కంపెనీగా జియో అవతరించింది.
READ MORE: Uttam Kumar Reddy: కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి నిర్మించారు..
Also Read
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
- ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
- SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
జియో కస్టమర్లు 5G డేటాను విరివిగా ఉపయోగిస్తున్నారు. పెద్ద మొత్తంలో డేటాను ఉపయోగించే 5G కస్టమర్ల సంఖ్య దాదాపు 13 కోట్లకు చేరింది. అయితే.. 5G ఇప్పటికీ వినియోగదారులకు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా అందుబాటులో ఉంది. అర్హత కలిగిన కస్టమర్లు 4G డేటా ప్లాన్తో రీఛార్జ్పై అపరిమిత 5G డేటాను కూడా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం జియోకు 49 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. గత సంవత్సరంలోనే కంపెనీ 4 కోట్లకు పైగా కస్టమర్లను చేర్చుకుంది.
READ MORE: Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 3 ఏళ్లలో 3 వైకల్య సర్టిఫికేట్లు..
మొబైల్ వినియోగదారులే కాదు.. ఫిక్స్డ్ వైర్లెస్ ఇంటర్నెట్ పరంగా కూడా కంపెనీ రికార్డులు సృష్టించింది. 10 లక్షలకు పైగా ఇళ్లు మరియు ప్రాంగణాలకు ఎయిర్ఫైబర్ను అందించిన మొదటి టెలికాం కంపెనీగా జియో అవతరించింది. ఇంటర్నెట్తో పాటు, జియో వినియోగదారులు వాయిస్ కాలింగ్లో కూడా ముందున్నారు. జూన్ త్రైమాసికంలో వాయిస్ కాలింగ్ విషయంలో కంపెనీ 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఇప్పుడు రికార్డు స్థాయి 1.42 ట్రిలియన్ నిమిషాలకు చేరుకుంది.
READ MORE:Rammohan Naidu: రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరం.. నిధులను ఏపీకి రప్పిస్తాం..
డిజిటల్ ఇండియాకు వెన్నెముక, అధిక కవరేజీతో సరసమైన ఇంటర్నెట్ అందిస్తున్న సంస్థ జియో అని కంపెనీ ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ ఎం అంబానీ అన్నారు. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు, 5G సేవలు, AI సెక్టార్లో ఆవిష్కరణ వృద్ధిని పెంచుతాయన్నారు. రాబోయే కాలంలో జియో మెరుగైన నెట్వర్క్, సేవల ఆధారంగా మార్కెట్లో తన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!