Lentil imports: కెనడా నుంచి ఇండియాకి తగ్గిన పప్పు ధాన్యాల దిగుమతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lentil imports: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య దౌత్యవివాదానికి దారి తీసింది. కెనడా ప్రధాని నేరుగా భారత్ పై విమర్శలు గుప్పించడంతో పాటు భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. ఇక భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను 5 రోజుల్లో దేశం వదిలివెళ్లాలని ఆదేశించింది. కెనడియన్ పౌరులకు వీసాల జారీని భారత్ తాత్కాలికంగా నిలిపేసింది. రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే ఈ దౌత్య వివాదం, వాణిజ్య వివాదంగా మారుతుందా..? అనే భయాలు పట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా నుంచి భారత్ దిగుమతి చేసుకునే పప్పు ధాన్యాల దిగుమతులు మందగించినట్లు తెలుస్తోంది. భారత దేశానికి దిగుమతులు తగ్గితే కెనడా రైతులకు తక్కువ ధరకు దారి తీయవచ్చు. ఇదే సమయంలో భారతదేశంలో ధరలు పెరిగే అవకాశం ఉంది.
Also Read
- Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
- Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
- Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
- Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
దేశంలో లభ్యత తగ్గడంతో గతేడాది భారత్ గోధుల ఎగుమతులపై నిషేధం విధించింది. బాస్మతీయేతర వైట్ రైస్ పై కూడా నిషేధం విధించింది. దీని ద్వారా దేశీయంగా లభ్యత పెంచడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం నేపథ్యంలో వాణిజ్య ఆంక్షలు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
Read Also: UNFPA: రాబోయే దశాబ్దాల్లో యువభారతం వృద్ధాప్య సమాజంగా మారుతుంది..
ఇండియాలో ప్రధాన దిగుమతిదారుగా ఉన్న ఓలమ్ అగ్రి ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నితిన్ గుప్తా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాణిజ్య ఆంక్షలు రావచ్చనే ఆందోళన వెలిబుచ్చారు. కెనడా నుంచి దిగుమతులను తిరస్కరించాలని ప్రభుత్వం దిగుమతిదారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఓ అధికారి వెల్లడించారు.
ఇదిలా ఉండగా, కెనడా గ్లోబల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అధికారులు కెనడా ప్రస్తుతం భారత్తో వాణిజ్యంపై ప్రభావం చూపే ఎలాంటి ప్రత్యక్ష చర్య తీసుకోలేదని తెలిపారు. ఇండియాలో పప్పు ధాన్యాలకు డిమాండ్ ఉంది. భారత్ లో పప్పు ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఇతర దేశాలపై ఆధారపడుతోంది. కెనడా ప్రధాని భారత్ పై ఆరోపణలు చేసిన తర్వాత కెనడా నుంచి సప్లైలో 6 శాతం తగ్గాయని విన్నిపెగ్ కు చెందిన క్రాప్ ట్రేడర్ పారిష్ అండ్ హెమ్ బేకర్ వ్యాపారి కెవిన్ ప్రైస్ తెలిపారు.
పప్పు ధాన్యాల దిగుమతుల్లో కెనడా నుంచి సగం ఉన్నాయి. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కెనడియన్ పప్పు ధాన్యాల దిగుమతులు ఏడాదికి 420 శాతం పెరిగి 1,90,784 టన్నులకు చేరుకుంది. అయితే వాణిజ్య ఆంక్షల భయంతో కెనడాపై ఎక్కువగా ఆధారపడకుండా భారతీయ కొనుగోలుదారులు ఆస్ట్రేలియా వంటి ప్రత్నామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే..”కాక్రోచ్ జనతా పార్టీ” ఫ్లాప్ షో..
-
FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!