Hyundai-Kia: ఈవీ బ్యాటరీల కోసం ఎక్సైడ్ ఎనర్జీతో హ్యుందాయ్-కియా భాగస్వామ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai-Kia: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV)ల వాడకం పెరుగుతోంది. టూవీలర్స్, కార్లతో ఈవీలను కొనుగోలు చేయడానికి భారత వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కార్ల తయారీ సంస్థలు భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈవీ కార్లను రూపొందిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈవీల వాడకం ఎక్కువగా పెరుగే నేపథ్యంలో కంపెనీలు కూడా అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నాయి.
తాజాగా దక్షిణ కొరియా ఆటోమేకర్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ, కియా కార్పొరేషన్లు భారత బ్యాటరీ తయారీ దిగ్గజ సంస్థ అయిన ఎక్సైడ్ ఎనర్జీతో భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. తమ ఎలక్ట్రిక్ వాహనాల(EV)ల విస్తరణ ప్రణాళికలో భాగంగా ఎక్సైడ్ ఎనర్జీతో అవగాహన ఒప్పందం( MOU) కుదుర్చుకున్నాయని హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు... ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
- Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..'మేక్ ఇన్ ఇండియా'కు బలం
- EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
Read Also:Eknath Shinde: ఉద్ధవ్ ఠాక్రే మమ్మల్ని ‘‘ఇంటి పనివారి’’గా చూశాడు.. ఇదే శివసేన చీలికకు కారణం..
భారత్ లోనే EV బ్యాటరీ ఉత్పత్తిని ఈ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రత్యేకంగా లిథియం-ఐరన్-ఫాస్పేట్(LFP) బ్యాటరీలపై దృష్టిసారించాయి. ఈ చర్య ద్వారా భారతీయ మార్కెట్లో తమ రాబోయే ఈవీ వాహనాలకు దేశీయంగా తయారు చేయబడిన బ్యాటరీలను వర్తింపచేయడంతో అగ్రగామిగా నిలుస్తామని హ్యుందాయ్-కియా సంస్థలు తెలిపాయి. భారత ప్రభుత్వ కార్బన్ న్యూట్రాలిటీ కారణంగా రాబోయే రోజుల్లో విద్యుదీకరణ వాహన రంగానికి భారత్ కీలకమైన మార్కెట్గా ఉందని, స్వదేశంలో బ్యాటరీల ఉత్పత్తి ద్వారా పోటీతత్వం పెరగడంతో పాటు ఖర్చులను తగ్గించవచ్చని హ్యుందాయ్ మోటార్ మరియు కియా యొక్క R&D విభాగం ప్రెసిడెంట్ మరియు హెడ్ హేయు వాన్ యాంగ్ అన్నారు.
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తన ఈవీ మోడల్ కార్లను 2025లో ఎక్కువ సంఖ్యలో విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి కోనా ఎలక్ట్రిక్, ఐయానిక్ 5 వంటి ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. మరోవైపు కియా తన ఈవీ6 మోడల్ని విక్రయిస్తోంది. ఇక ఎక్సైడ్ ఎనర్జీ విషయానికి వస్తే, భారత్లో గత 75 ఏళ్లుగా లెడ్-యాసిడ్ బ్యాటరీ తయారీలో అనుభవం ఉంది. తాజా భాగస్వామ్యంతో లిథియం అయాన్ బ్యాటరీలోకి అడుగుపెడుతోంది.
తాజావార్తలు
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!