మగువలకు పసిడి ధరలు మళ్లీ షాకిచ్చాయి. కనకం దూకుడికి బ్రేక్లు పడడం లేదు. రోజుకోలాగా ధరలు హెచ్చుతగ్గులు అవుతున్నాయి. ఒకరోజు తగ్గినట్టే తగ్గి మరుసటి రోజు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో పుత్తడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు తులం గోల్డ్పై రూ. 2,240 పెరగగా.. కిలో వెండిపై రూ.15,000 పెరిగింది. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Cyber Crime: రిటైర్డ్ ఇంజనీర్పై వలపు వల.. రూ.4 కోట్లు నొక్కేసిన కిలాడీ
తులం గోల్డ్పై రూ.2,240 పెరగడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,58,840 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,050 పెరగడంతో రూ.1,45,600 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,680 పెరగడంతో రూ.1,19,130 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Sanju Samson: రెండు ప్రపంచకప్లు, 10 మ్యాచ్లు.. సంజు శాంసన్ ఎన్ని రన్స్ చేశాడంటే?
వెండి ధర కూడా భారీ షాకిచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.15,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.3, 00, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కూడా కిలో వెండి ధర రూ.3,00, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.