Elon Musk: ఎలాన్ మస్క్ ఇండియా పర్యటన.. 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడిపై కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: టెస్లా చీఫ్, ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్న ఎలాన్ మస్క్ వచ్చే వారం భారత పర్యటనకు రాబోతున్నారు. ఈ పర్యటనలో ఎలక్ట్రిక్ కార్ నిర్మాణానికి సంబంధించి టెస్లా ప్లాంట్ గురించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భారత ప్రధాని మోడీతో ఎలాన్ మస్క్ భేటీ కానున్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ మార్కెట్గా ఉన్న భారత్లోకి టెస్లా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సోమవారం భారత్లో జరిగే మస్క్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ పర్యటనలో ఇండియాలో టెస్లా కార్ ప్లాంట్ కోసం 2 నుంచి 3 బిలియన్ డాలర్ల పెట్టుబడిపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టెస్లాకు చెందిన టీం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు టెస్లా ప్లాంట్కి అనుకూలంగా ఉన్నాయని చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతరిక్ష స్టార్టప్లతో భారత ప్రభుత్వం న్యూఢిల్లీలో నిర్వహించే కార్యక్రమానికి కూడా ఎలోన్ మస్క్ హాజరయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read
- Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
Read Also: Angry Rantman: ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత.. విషాదంలో నెటిజన్లు
భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రానిక్ వాహనాల(ఈవీ) ఇండస్ట్రీ ఊపందుకుంది. ప్రస్తుతం ఈవీ కార్లలో మార్కెట్ లీడర్గా టాటా ఉంది. 2023లో మొత్తం కార్ల అమ్మకాల్లో ఈవీలు 2 శాతం మాత్రమే ఉన్నాయి. అయితే, 2030 నాటికి దీన్ని 30 శాతంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా, చైనాలో టెస్లా అమ్మకాలు మందగించడంతో భారత్ వైపు ఎలాన్ మస్క్ దృష్టి సారించారు.
గత కొన్నేళ్లుగా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు టెస్లా ప్రయత్నిస్తోంది. అయితే, భారత్ స్థానిక తయారీకి ప్రాధాన్యత ఇవ్వడంతో టెస్లా కార్లు ఇతర దేశాల్లో తయారై భారత్లోకి దిగుమతి చేస్తే భారీగా సుంకాలను విధిస్తానమి చెప్పింది. అయితే, 500 మిలియన్ల పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే 100 శాతం ఉన్న సుంకాలను 15 శాతానికి తగ్గించే కొత్త ఈవీ పాలసీని మార్చి నెలలో ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంతో టెస్లా ఇండియా ఎంట్రీకి అవకాశాలు ఏర్పడ్డాయి. మూడేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం అయ్యేంత వరకు ఇతర దేశాల నుంచి టెస్లా కార్లు ఇండియాలోకి పరిమిత సంఖ్యలో దిగుమతి కానున్నాయి. ఇప్పటికే జర్మనీలో ఇండియా కోసమని ప్రత్యేకంగా రైట్ హ్యాండ్ డ్రైవ్(RHD) కార్లను ఉత్పత్తి చేస్తోంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!