Wedding Season: పెళ్లిళ్ల సీజన్పై వ్యాపారవేత్తల కళ్లు.. 25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగతో మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్పై బడా వ్యాపారులతో పాటు చిరు వ్యాపారుల కన్ను పడింది. నవంబర్ 23 తర్వాత దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది.. ఈ నేపథ్యంలో మార్కెట్లో షాపింగ్ మరోసారి పెరిగి రూపాయి చలామణి ప్రారంభంకానుంది. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ రాబోయే ఇతర పండుగలతో సహా భారతదేశంలో మొత్తం రూ. 25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని చిరు వ్యాపారుల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) అంచనా వేసింది.
Hair Care: ఈ ఆకు రాస్తే మీ జుట్టు రాలడం ఆగి పొడవు పెరుగుతుంది..!
Also Read
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
- ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ఇదిలా ఉంటే.. నవరాత్రి నుండి దీపావళి వరకు దేశంలోని ప్రధాన రిటైల్ వ్యాపారంలో రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఇందులో దుర్గాపూజ, ఇతర పండుగల సమయంలోనే దాదాపు రూ.50 వేల కోట్ల వ్యాపారం జరిగింది. గతంలో గణేష్ చతుర్థి 10 రోజుల వేడుకల్లో రూ.20-25 వేల కోట్ల వ్యాపారం జరిగింది. ప్రస్తుతం.. ఈ గణాంకాలు ప్రధానంగా 3 పెద్ద పండుగలకు మాత్రమే ఉన్నాయి. రక్షాబంధన్, జన్మాష్టమి, మహాశివరాత్రి, హోలీ సందర్భంగా జరిగిన వ్యాపారాన్ని కూడా కలుపుకుంటే ఈ లెక్కన కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతుంది.
Naga Chaitanya: ఎంత మంచి మనసు సామీ నీది.. ఎక్కేశావ్ .. అభిమానుల గుండెల్లో ఓ మెట్టు ఎక్కేశావ్
దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఆలయాలు ఉన్నాయని ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఈ ఆలయాలను సందర్శించే భక్తులు ప్రతిరోజూ కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ సంఖ్య లక్షల కోట్లు అవుతుంది. దీనికి పండుగల ఆచారాలు, పెళ్లిళ్లకు చేసే ఖర్చు, తీర్థయాత్రల ఖర్చులు కలిపితే, ప్రపంచంలోని 100కి పైగా దేశాల మొత్తం జీడీపీ కంటే రూపాయి చలామణి ఎక్కువ అవుతుంది. ఇది కొత్త విధానం కాదనీ.. వేల ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. మరోవైపు.. ఒక్క ధన్తేరస్ డే డేటా ఆధారంగానే ఈ ఒక్కరోజే రూ.25,500 కోట్ల విలువైన 41 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు క్యాట్ వెల్లడించింది. అటు వెండి అమ్మకాలు రూ.3000 కోట్లకు చేరుకున్నాయి. కార్ల తయారీదారులు 55,000 కార్లను డెలివరీ చేయగా, 5 లక్షలకు పైగా స్కూటర్లు, మోటార్ సైకిళ్లను డెలివరీ చేశారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!