Wedding Season: పెళ్లిళ్ల సీజన్పై వ్యాపారవేత్తల కళ్లు.. 25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగతో మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్పై బడా వ్యాపారులతో పాటు చిరు వ్యాపారుల కన్ను పడింది. నవంబర్ 23 తర్వాత దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది.. ఈ నేపథ్యంలో మార్కెట్లో షాపింగ్ మరోసారి పెరిగి రూపాయి చలామణి ప్రారంభంకానుంది. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ రాబోయే ఇతర పండుగలతో సహా భారతదేశంలో మొత్తం రూ. 25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని చిరు వ్యాపారుల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) అంచనా వేసింది.
Hair Care: ఈ ఆకు రాస్తే మీ జుట్టు రాలడం ఆగి పొడవు పెరుగుతుంది..!
Also Read
- Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
- Mark Zuckerberg: జుకర్బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
ఇదిలా ఉంటే.. నవరాత్రి నుండి దీపావళి వరకు దేశంలోని ప్రధాన రిటైల్ వ్యాపారంలో రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఇందులో దుర్గాపూజ, ఇతర పండుగల సమయంలోనే దాదాపు రూ.50 వేల కోట్ల వ్యాపారం జరిగింది. గతంలో గణేష్ చతుర్థి 10 రోజుల వేడుకల్లో రూ.20-25 వేల కోట్ల వ్యాపారం జరిగింది. ప్రస్తుతం.. ఈ గణాంకాలు ప్రధానంగా 3 పెద్ద పండుగలకు మాత్రమే ఉన్నాయి. రక్షాబంధన్, జన్మాష్టమి, మహాశివరాత్రి, హోలీ సందర్భంగా జరిగిన వ్యాపారాన్ని కూడా కలుపుకుంటే ఈ లెక్కన కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతుంది.
Naga Chaitanya: ఎంత మంచి మనసు సామీ నీది.. ఎక్కేశావ్ .. అభిమానుల గుండెల్లో ఓ మెట్టు ఎక్కేశావ్
దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఆలయాలు ఉన్నాయని ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఈ ఆలయాలను సందర్శించే భక్తులు ప్రతిరోజూ కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ సంఖ్య లక్షల కోట్లు అవుతుంది. దీనికి పండుగల ఆచారాలు, పెళ్లిళ్లకు చేసే ఖర్చు, తీర్థయాత్రల ఖర్చులు కలిపితే, ప్రపంచంలోని 100కి పైగా దేశాల మొత్తం జీడీపీ కంటే రూపాయి చలామణి ఎక్కువ అవుతుంది. ఇది కొత్త విధానం కాదనీ.. వేల ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. మరోవైపు.. ఒక్క ధన్తేరస్ డే డేటా ఆధారంగానే ఈ ఒక్కరోజే రూ.25,500 కోట్ల విలువైన 41 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు క్యాట్ వెల్లడించింది. అటు వెండి అమ్మకాలు రూ.3000 కోట్లకు చేరుకున్నాయి. కార్ల తయారీదారులు 55,000 కార్లను డెలివరీ చేయగా, 5 లక్షలకు పైగా స్కూటర్లు, మోటార్ సైకిళ్లను డెలివరీ చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!