Business Headlines 14-07-22: లేటెస్ట్ బిజినెస్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్లో అమెరికా ద్రవ్యోల్బణం 9.1 శాతం
అమెరికాలో వినియోగదారుల ధర సూచీ (సీపీఐ) ఇంతకుముందెన్నడూ లేనంతగా పెరిగింది. జూన్ నెలలో తొమ్మిదీ పాయింట్ ఒక శాతానికి శరవేగంగా ఎగబాకింది. ఆహార, చమురు ధరలు కలపకుండానే ఈ ఫలితాలను నమోదుచేసింది. ఇది నాలుగు దశాబ్దాల గరిష్టం కావటం చెప్పుకోదగ్గ విషయం. 1981 డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో దూసుకుపోవటం ఇదే తొలిసారి. యూఎస్లో గతేడాది జూన్లో ద్రవ్యోల్బణం 5.9 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి ఈ అంచనా 5.7 శాతమే కావటం గమనార్హం.
Also Read
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
- ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
7.6 శాతానికి ఎకానమీ వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరంలో మన ఎకానమీ వృద్ధి శాతం 7.1 నుంచి 7.6 మధ్యలో ఉండొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ఈ మేరకు జులై 2022 రిపోర్టును విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మారుపోతున్న నేపథ్యంలోనూ ఇలాంటి అనుకూల అంచనాలు నెలకొనటం విశేషం.
రూ.4,389 కోట్ల పన్ను ఎగవేసిన ఒప్పో
ఒప్పో ఇండియా సంస్థ సుమారు రూ.4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసినట్లు తేలింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఒప్పో ఇండియా ఆఫీసుతోపాటు ముఖ్యమైన యజమానుల ఇళ్లల్లో ఈ దాడులు జరిగాయి.
విదేశీ నగదు డిపాజిట్లపై వడ్డీ పెంపు
నివాసేతరులు చేసే విదేశీ నగదు డిపాజిట్ల(ఎఫ్సీఎన్ఆర్)పై వడ్డీ రేట్లను మూడు బ్యాంకులు పెంచాయి. ఫారెక్స్ నిల్వలను పెంచేందుకు ఆర్బీఐ గత వారం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా డాలర్ డిపాజిట్లపై వార్షిక వడ్డీని ఎస్బీఐ 2 పాయింట్ ఎనిమిదీ ఐదు శాతం నుంచి 3 పాయింట్ రెండూ ఐదు శాతం మధ్యకి సవరించింది.
79.66కి పడిపోయిన రూపాయి
రూపాయి విలువ వరుసగా మూడో రోజూ రికార్డు స్థాయిలో పడిపోయింది. తాజాగా బుధవారం 79.66కి చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ద్రవ్యోల్బణ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులు రిస్క్ అనుకున్న షేర్లను భారీ సంఖ్యలో అమ్మేసుకున్నారు. ఈ ప్రతికూల ప్రభావం రూపాయి మీద భారీగా పడింది.
తాజావార్తలు
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!