Business Headlines 14-07-22: లేటెస్ట్ బిజినెస్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్లో అమెరికా ద్రవ్యోల్బణం 9.1 శాతం
అమెరికాలో వినియోగదారుల ధర సూచీ (సీపీఐ) ఇంతకుముందెన్నడూ లేనంతగా పెరిగింది. జూన్ నెలలో తొమ్మిదీ పాయింట్ ఒక శాతానికి శరవేగంగా ఎగబాకింది. ఆహార, చమురు ధరలు కలపకుండానే ఈ ఫలితాలను నమోదుచేసింది. ఇది నాలుగు దశాబ్దాల గరిష్టం కావటం చెప్పుకోదగ్గ విషయం. 1981 డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో దూసుకుపోవటం ఇదే తొలిసారి. యూఎస్లో గతేడాది జూన్లో ద్రవ్యోల్బణం 5.9 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి ఈ అంచనా 5.7 శాతమే కావటం గమనార్హం.
Also Read
- Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
- Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
7.6 శాతానికి ఎకానమీ వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరంలో మన ఎకానమీ వృద్ధి శాతం 7.1 నుంచి 7.6 మధ్యలో ఉండొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ఈ మేరకు జులై 2022 రిపోర్టును విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మారుపోతున్న నేపథ్యంలోనూ ఇలాంటి అనుకూల అంచనాలు నెలకొనటం విశేషం.
రూ.4,389 కోట్ల పన్ను ఎగవేసిన ఒప్పో
ఒప్పో ఇండియా సంస్థ సుమారు రూ.4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసినట్లు తేలింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఒప్పో ఇండియా ఆఫీసుతోపాటు ముఖ్యమైన యజమానుల ఇళ్లల్లో ఈ దాడులు జరిగాయి.
విదేశీ నగదు డిపాజిట్లపై వడ్డీ పెంపు
నివాసేతరులు చేసే విదేశీ నగదు డిపాజిట్ల(ఎఫ్సీఎన్ఆర్)పై వడ్డీ రేట్లను మూడు బ్యాంకులు పెంచాయి. ఫారెక్స్ నిల్వలను పెంచేందుకు ఆర్బీఐ గత వారం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా డాలర్ డిపాజిట్లపై వార్షిక వడ్డీని ఎస్బీఐ 2 పాయింట్ ఎనిమిదీ ఐదు శాతం నుంచి 3 పాయింట్ రెండూ ఐదు శాతం మధ్యకి సవరించింది.
79.66కి పడిపోయిన రూపాయి
రూపాయి విలువ వరుసగా మూడో రోజూ రికార్డు స్థాయిలో పడిపోయింది. తాజాగా బుధవారం 79.66కి చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ద్రవ్యోల్బణ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులు రిస్క్ అనుకున్న షేర్లను భారీ సంఖ్యలో అమ్మేసుకున్నారు. ఈ ప్రతికూల ప్రభావం రూపాయి మీద భారీగా పడింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
-
T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!