Business Headlines 14-07-22: లేటెస్ట్ బిజినెస్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్లో అమెరికా ద్రవ్యోల్బణం 9.1 శాతం
అమెరికాలో వినియోగదారుల ధర సూచీ (సీపీఐ) ఇంతకుముందెన్నడూ లేనంతగా పెరిగింది. జూన్ నెలలో తొమ్మిదీ పాయింట్ ఒక శాతానికి శరవేగంగా ఎగబాకింది. ఆహార, చమురు ధరలు కలపకుండానే ఈ ఫలితాలను నమోదుచేసింది. ఇది నాలుగు దశాబ్దాల గరిష్టం కావటం చెప్పుకోదగ్గ విషయం. 1981 డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో దూసుకుపోవటం ఇదే తొలిసారి. యూఎస్లో గతేడాది జూన్లో ద్రవ్యోల్బణం 5.9 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి ఈ అంచనా 5.7 శాతమే కావటం గమనార్హం.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు... ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
- Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..'మేక్ ఇన్ ఇండియా'కు బలం
7.6 శాతానికి ఎకానమీ వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరంలో మన ఎకానమీ వృద్ధి శాతం 7.1 నుంచి 7.6 మధ్యలో ఉండొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ఈ మేరకు జులై 2022 రిపోర్టును విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మారుపోతున్న నేపథ్యంలోనూ ఇలాంటి అనుకూల అంచనాలు నెలకొనటం విశేషం.
రూ.4,389 కోట్ల పన్ను ఎగవేసిన ఒప్పో
ఒప్పో ఇండియా సంస్థ సుమారు రూ.4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసినట్లు తేలింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఒప్పో ఇండియా ఆఫీసుతోపాటు ముఖ్యమైన యజమానుల ఇళ్లల్లో ఈ దాడులు జరిగాయి.
విదేశీ నగదు డిపాజిట్లపై వడ్డీ పెంపు
నివాసేతరులు చేసే విదేశీ నగదు డిపాజిట్ల(ఎఫ్సీఎన్ఆర్)పై వడ్డీ రేట్లను మూడు బ్యాంకులు పెంచాయి. ఫారెక్స్ నిల్వలను పెంచేందుకు ఆర్బీఐ గత వారం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా డాలర్ డిపాజిట్లపై వార్షిక వడ్డీని ఎస్బీఐ 2 పాయింట్ ఎనిమిదీ ఐదు శాతం నుంచి 3 పాయింట్ రెండూ ఐదు శాతం మధ్యకి సవరించింది.
79.66కి పడిపోయిన రూపాయి
రూపాయి విలువ వరుసగా మూడో రోజూ రికార్డు స్థాయిలో పడిపోయింది. తాజాగా బుధవారం 79.66కి చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ద్రవ్యోల్బణ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులు రిస్క్ అనుకున్న షేర్లను భారీ సంఖ్యలో అమ్మేసుకున్నారు. ఈ ప్రతికూల ప్రభావం రూపాయి మీద భారీగా పడింది.
తాజావార్తలు
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!