Business Flash: ప్రపంచ కుబేరుల జాబితాలో బిల్గేట్స్ని దాటేసిన అదానీ
Business Flash: ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ బిల్గేట్స్ని దాటేశారు. గౌతమ్ అదానీ తాజాగా 4వ స్థానానికి చేరుకున్నారని ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్గేట్స్ తన సంపదలోని 20 బిలియన్ డాలర్లను దానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బిల్ &మిలిందా గేట్స్ ఫౌండేషన్ అనే తన కుటుంబ అధీనంలోని స్వచ్ఛంద సంస్థకి ఈ విరాళం ఇస్తానని ప్రకటించారు. దీంతో ఆయన నికర సంపద 102 బిలియన్ డాలర్లకు తగ్గింది. మరో వైపు గౌతమ్ అదానీ 114 బిలియన్ డాలర్లకు పైగా సంపదతో బెస్ట్ ర్యాంక్ సాధించారు.
బిర్లా గ్రూప్ భారీ వ్యయం
Also Read
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
- Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
బిల్డింగ్ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ సెగ్మెంట్లో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(ఎంఎస్ఎంఈ)ల కోసం ఇ-కామర్స్ వెంచర్ అందుబాటులోకి రానుంది. దీనికోసం బిర్లా గ్రూప్ 2 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టనుంది. బిజినెస్ టు బిజినెస్పై స్పెషల్ ఫోకస్ పెట్టేందుకే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని రూపొందించనున్నారు. గడచిన మూడేళ్ల ఈ సెక్టార్లో 14 శాతానికి పైగా వృద్ధి నమోదు కావటం గమనార్హం. ఇదిలాఉండగా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రకటించింది.
read more: Ravi Teja : ఆ వార్తల్లో నిజం లేదు.. ఇదే నిజం..
8-8.5 శాతం వృద్ధి సాధిస్తాం
వచ్చే ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో 8 నుంచి 8.5 శాతం వరకు వృద్ధి సాధిస్తామని కేంద్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. హైఫ్రీక్వెన్సీ సూచికల ఆధారంగా సర్కారు ఈ అంచనాకొచ్చింది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపడుతున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించామని, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీని/సెస్ను కూడా తగ్గించామని చెప్పారు.
స్టాక్ మార్కెట్ అప్డేట్
స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 16,550 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం విండ్ఫాల్ ట్యాక్స్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించటంతోపాటు ప్రపంచ మార్కెట్లలో పాజిటివ్ సాంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో కీలకమైన రంగాలకు భారీ లాభాలు వచ్చాయి. ఈ లిస్టులో ఐటీ, మెటల్, ఆయిల్, గ్యాస్ తదితర సెక్టార్లు ఉన్నాయి. వీటి షేర్ల విలువ నిఫ్టీలో 2 శాతం చొప్పున పెరిగింది.
తాజావార్తలు
-
Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
-
Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
-
Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
-
RR vs DC: జస్ట్ మిస్! బ్యాట్తో కుల్దీప్ ముఖం పగులగొట్టబోయిన జడేజా.. ఒక్క క్షణం అంతా గందరగోళం!(వీడియో)
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!