Telecom tariffs: జియో దారిలోనే ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా..యూజర్లకు షాక్..
- పెరిగిన జియో రిఛార్జ్ ధరలు..
- జియో దారిలోనే ఎయిర్టెల్
- వొడాఫోన్ ఇండియా..
- త్వరలో ఛార్జీలను పెంచే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telecom tariffs: రిలయన్స్ జియో యూజర్లు షాక్ ఇస్తూ టారిఫ్ రేట్లను పెంచింది. జూలై 3 నుంచి పెరిగిన రేట్లు అమలులోకి వస్తాయని చెప్పింది. జియో కొత్త అపరిమిత ప్లాన్ల ప్రకటన తర్వాత ఎయిర్టెల్, వొడఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైనట్లు సమచారం. త్వరలో ఈ రెండు టెలికాం సంస్థలు కూడా తమ టారిఫ్లను పెంచతాయని తెలుస్తోంది. త్వరలో భారతీ ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా కూడా తమ మొబైల్ సర్వీస్ రేట్లను పెంచే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. గురువారం జియో తన టారిఫ్లను సవరించింది. కొత్త అపరిమిత ప్లాన్లను ప్రారంభించింది.
Read Also: Amartya Sen: భారత్ హిందూదేశం కాదు.. లోక్సభ ఎన్నికలనే నిదర్శనం..
Also Read
- Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
- Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
- Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రెండూ కూడా సుస్థిర వృద్ధికి అవసరమైన టారిఫ్ల పెంపుదలని దీర్ఘకాలంగా సమర్ధిస్తున్నందున, టారిఫ్ పెంపును అనుసరించాలనే భావిస్తున్నారు. టెలికాం పరిశ్రమలో చివరిసారిగా 20 శాతం టారిఫ్ పెంపు డిసెంబర్ 2021లో జరిగింది. అంతకుముందు డిసెంబర్ 2019లో టారిఫ్లను పెంచాయి. జియో 2016లో సేవలు ప్రారంభించిన తర్వాత తొలిసారి టారిఫ్లను పెంచింది. 2019 పెంపు సుంకాన్ని 20-40% పెంచింది, 2021 పెంపు 20% పెరిగింది.
‘‘5G మరియు AI టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పరిశ్రమ ఆవిష్కరణలు మరియు స్థిరమైన వృద్ధిని నడిపించే దిశలో కొత్త ప్లాన్ల పరిచయం ఒక అడుగు’’ అని జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు. జియో డిసెంబర్ 2021లో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు మొబైల్ సర్వీస్ రేట్లను పెంచింది. ఎయిర్టెల్ ఎంట్రీ-లెవల్ మొబైల్ సేవల ప్లాన్ను 2023 ప్రారంభంలో రూ.99 నుండి రూ.155కి దాదాపు 56 శాతం పెంచింది. జియో దేశవ్యాప్తంగా 47 కోట్ల మంది మొబైల్ సబ్స్క్రైబర్లను కలిగి ఉంది, దాదాపు 41 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
తాజావార్తలు
-
Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!