Telecom tariffs: జియో దారిలోనే ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా..యూజర్లకు షాక్..
- పెరిగిన జియో రిఛార్జ్ ధరలు..
- జియో దారిలోనే ఎయిర్టెల్
- వొడాఫోన్ ఇండియా..
- త్వరలో ఛార్జీలను పెంచే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telecom tariffs: రిలయన్స్ జియో యూజర్లు షాక్ ఇస్తూ టారిఫ్ రేట్లను పెంచింది. జూలై 3 నుంచి పెరిగిన రేట్లు అమలులోకి వస్తాయని చెప్పింది. జియో కొత్త అపరిమిత ప్లాన్ల ప్రకటన తర్వాత ఎయిర్టెల్, వొడఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైనట్లు సమచారం. త్వరలో ఈ రెండు టెలికాం సంస్థలు కూడా తమ టారిఫ్లను పెంచతాయని తెలుస్తోంది. త్వరలో భారతీ ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా కూడా తమ మొబైల్ సర్వీస్ రేట్లను పెంచే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. గురువారం జియో తన టారిఫ్లను సవరించింది. కొత్త అపరిమిత ప్లాన్లను ప్రారంభించింది.
Read Also: Amartya Sen: భారత్ హిందూదేశం కాదు.. లోక్సభ ఎన్నికలనే నిదర్శనం..
Also Read
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
- RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
- Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రెండూ కూడా సుస్థిర వృద్ధికి అవసరమైన టారిఫ్ల పెంపుదలని దీర్ఘకాలంగా సమర్ధిస్తున్నందున, టారిఫ్ పెంపును అనుసరించాలనే భావిస్తున్నారు. టెలికాం పరిశ్రమలో చివరిసారిగా 20 శాతం టారిఫ్ పెంపు డిసెంబర్ 2021లో జరిగింది. అంతకుముందు డిసెంబర్ 2019లో టారిఫ్లను పెంచాయి. జియో 2016లో సేవలు ప్రారంభించిన తర్వాత తొలిసారి టారిఫ్లను పెంచింది. 2019 పెంపు సుంకాన్ని 20-40% పెంచింది, 2021 పెంపు 20% పెరిగింది.
‘‘5G మరియు AI టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పరిశ్రమ ఆవిష్కరణలు మరియు స్థిరమైన వృద్ధిని నడిపించే దిశలో కొత్త ప్లాన్ల పరిచయం ఒక అడుగు’’ అని జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు. జియో డిసెంబర్ 2021లో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు మొబైల్ సర్వీస్ రేట్లను పెంచింది. ఎయిర్టెల్ ఎంట్రీ-లెవల్ మొబైల్ సేవల ప్లాన్ను 2023 ప్రారంభంలో రూ.99 నుండి రూ.155కి దాదాపు 56 శాతం పెంచింది. జియో దేశవ్యాప్తంగా 47 కోట్ల మంది మొబైల్ సబ్స్క్రైబర్లను కలిగి ఉంది, దాదాపు 41 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
తాజావార్తలు
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!