Amartya Sen: భారత్ హిందూదేశం కాదు.. లోక్సభ ఎన్నికలనే నిదర్శనం..
- లోక్సభ ఎన్నికలపై అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు..
- భారత్ హిందూదేశం కాదని నిరూపించాయి..
- కాంగ్రెస్ కన్నా బీజేపీ పాలనలో పరిస్థితి తీవ్రం..
- ఆయన వ్యాఖ్యల పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amartya Sen: లోక్సభ ఎన్నికలపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ హిందూదేశం కాదని ఇటీవల లోక్సభ ఎన్నికలు నిరూపించాయని అన్నారు. బుధవారం అమెరికా నుంచి కోల్కతా చేసుకున్న ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఎలాంటి విచారణ లేకుండా జైలులోకి నెట్టడం కాంగ్రెస్ పాలనలో కన్నా బీజేపీ పాలనలో మరింత తీవ్రంగా ఉందని ఆరోపించారు. ప్రతీ ఎన్నికల తర్వాత మార్పును ఆశిస్తామని, పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలు పెంచడం వంటివి జరిగేవని, అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయిన ఆయన అన్నారు. ఇలాంట వాటికి అడ్డుకట్టపడాల్సిన అవసరముందని చెప్పారు.
Read Also: Delhi Airport : ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూలిన పైకప్పు.. ఆరుగురికి గాయాలు.. చాలా వాహనాలు ధ్వంసం
Also Read
- Randhir Jaiswal: జమ్మూకాశ్మీర్, లడఖ్ గురించి మాట్లాడొద్దు.. ఈయూకు భారత్ సూచన
- PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
- Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
- Mamata Banerjee: "అప్పటి వరకు నేను చావను".. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
లౌకిక దేశమైన భారత్లో రాజకీయాలు పారదర్శకంగా ఉండాలని చెప్పారు. హిందూ దేశంగా మార్చాలనే భావన సరికాదని చెప్పారు. అయోధ్యలో రామమందిరం నిర్మించిన యూపీలోని ఫైజాబాద్లో బీజేపీ ఓటమిపై స్పందిస్తూ.. భారతదేశానికి ఉన్న నిజమైన గుర్తింపు కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. మహాత్మాగాంధీ, రవీంద్ర నాథ్ ఠాగూర్, నేతాజీ పుట్టిన దేశంలో ఎంతో ధనం వెచ్చించి రామాలయం నిర్మించి భారతదేశాన్ని హిందూ దేశంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగి ఉండాల్సింది కాదని చెప్పారు. ఇండియాలో నిరుద్యోగం పెరిగిందని ప్రాథమిక విద్యా, ప్రాథమిక ఆరోగ్య సేవల వంటి రంగాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
అయితే, అమర్త్యసేన్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అయింది. ఆయన వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో వాస్తవాలకు సంబంధం లేకుండా ఉన్నాయని బెంగాల్ బీజేపీ సీనియర్ నేత రాహుల్ సిన్హా అన్నారు. దేశంలో పరిణామాలను ఆయన తటస్థ దృష్టితో చూడాలని సూచించారు. అమెరికాలో ఉంటూ వ్యక్తిగత పనులపై భారత్కి అప్పుడప్పుడు వచ్చే అమర్త్యసేన్ మాటలకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ కేంద్ర మంత్రి దేబాశ్రీ చౌదరి అన్నారు.
తాజావార్తలు
-
Randhir Jaiswal: జమ్మూకాశ్మీర్, లడఖ్ గురించి మాట్లాడొద్దు.. ఈయూకు భారత్ సూచన
-
PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
-
Janhvi Kapoor: ‘స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు’.. ‘పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్ను బయటపెట్టిన బుచ్చిబాబు!
-
CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
-
Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!