Jagannath Rath Yatra 2025: జగన్నాథ రథ యాత్రలో బంగారు చీపురుతో ఎందుకు శుభ్రం చేస్తారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష రెండవ రోజున ప్రారంభమవుతుంది. ఈ యాత్ర ఈరోజు అంటే జూన్ 27న ప్రారంభమవుతుంది. ఈ మహా యాత్ర జూలై 8 వరకు కొనసాగుతుంది. 12 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో జగన్నాథుడు, అతని సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర పూరి ఆలయం నుంచి గుండిచా ఆలయానికి వారి వారి రథాలపై ఊరేగుతారు. ఈ మహా యాత్ర సందర్భంగా.. జగన్నాథ ఆలయంలో ‘ఛేరా పహారా’ అనే ప్రత్యేకమైన సంప్రదాయం నిర్వహిస్తారు. ఈ సంప్రదాయంలో భాగంగా యాత్ర ప్రారంభమయ్యే ముందు, ఆ మార్గాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. అసలు బంగారు చీపురుతో ఎందుకు శుభ్రం చేస్తారు? అనే సందేహం అందరికీ వచ్చే ఉంటుంది. ఈ సంప్రదాయం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుందాం.
READ MORE: Maargan Review: మార్గన్ రివ్యూ
Also Read
- Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త, లేదంటే భారీ మూల్యం తప్పదు!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
పూరి జగన్నాథ ఆలయంలో నిర్వహించే ఈ ప్రత్యేకమైన ‘ఛెరా పహారా’ ఆచారం వెనుక బలమైన విశ్వాసం ఉంది. రాజుల వారసులు మాత్రమే ఈ ప్రత్యేక ఆచారంలో పాల్గొంటారు. పౌరాణిక నమ్మకం ప్రకారం.. బంగారాన్ని విలువైన, అత్యంత పవిత్రమైన లోహంగా పరిగణిస్తారు. రథం వెళ్లే మార్గాన్ని శుభ్రం చేయడానికి బంగారంతో చేసిన చీపురును ఉపయోగించడం శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. రథయాత్ర ప్రారంభమయ్యే ముందు, మూడు రథాల మార్గాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేసి, వేద మంత్రాలు జపిస్తారు. భగవంతుడిని స్వాగతించడానికి సన్నాహానికి చిహ్నంగా భావిస్తారు. అంటే భగవంతుడిని ఆహ్వానిస్తారన్న మాట. అలాగే.. రథయాత్ర విజయవంతంగా సాగాలని కోరుకునే సంకేతంగా భావిస్తారు.
READ MORE: Asus Chromebook CX14: ఆసుస్ కొత్త ల్యాప్టాప్ విడుదల.. స్మార్ట్ ఫోన్ ధరకన్న తక్కువకే!
మతపరమైన ప్రాముఖ్యత..
బంగారు చీపురుతో శుభ్రం చేయడానికి మతపరమైన కారణం ఏమిటంటే.. బంగారాన్ని శుభం, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. ఆలయ మార్గాన్ని శుభ్రం చేయడానికి దీనిని ఉపయోగించడం దేవుని పట్ల గౌరవం, భక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ ఆచారం భక్తుల భక్తి, అంకితభావాన్ని వ్యక్తపరుస్తుంది. బంగారు చీపురుతో శుభ్రం చేసుకోవడం వల్ల ఆ ప్రాంతంలో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందని నమ్మిక. బంగారం అదృష్టం, శ్రేయస్సుకు చిహ్నం, కాబట్టి ఇలా చేయడం వల్ల యాత్రలో స్వచ్ఛత, సానుకూలత కొనసాగుతుందని భావిస్తారు. ఇది మతపరంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక దృక్కోణం నుండి కూడా చాలా ముఖ్యమైనది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?