POK: భారత్పై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పాక్..? ధ్వంసమైన ఉగ్ర శిబిరాల పునర్నిర్మాణం..?
- పహల్గామ్ దాడి తర్వాత తీవ్రంగా నష్టపోయిన పాక్
- అయిన తన బుద్ధి మార్చుకోని శత్రుదేశం పాకిస్థాన్
- ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ధ్వంసమైన ఉగ్ర కేంద్రాలు
- వాటిని పునర్నిర్మించేందుకు పాకిస్థాన్ యత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ దాడి తర్వాత తీవ్రంగా నష్టపోయిన పాకిస్థాన్ తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. పాక్ మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు పాల్పడుతోందని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దాయాది దేశంలో ధ్వంసమైన ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్లు, శిక్షణా కేంద్రాలను పునర్నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా పీవోకే లోని దట్టమైన అడవుల్లో ఈ కార్యకలాపాలు కనిపిస్తున్నాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం వెల్లడించింది.
READ MORE: Kerala High Court: “జానకి” ఉంటే తప్పేంటి.. అనుపమ పరమేశ్వరన్ సినిమాపై వివాదం..
Also Read
- Pesara Idli: పెసరట్టు కాదు.. 'పెసర ఇడ్లీ' ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
- Vaibhav Sooryavanshi: "నువ్వు గ్రేట్ రా బుడ్డోడా".. కెప్టెన్ తిలక్ వర్మ నమ్మకాన్ని నిలబెట్టిన వైభవ్..
- Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆదేశ సైన్యం, ప్రభుత్వం ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నాయి. ఇటీవల బహవల్పూర్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ శిబిరాలను తిరిగి స్థాపించాలని నిర్ణయించారు. జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, టీఆర్ఎఫ్ వంటి ఉగ్రవాద సంస్థల అగ్ర కమాండర్లతో పాటు పాక్ సైన్యం, ఐఎస్ఐ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
READ MORE: Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!
నిఘా సంస్థల సమాచారం ప్రకారం.. ఈసారి ఉగ్రవాద శిబిరాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అమర్చనున్నారు. తద్వారా భారత నిఘా సంస్థలు వాటిని చేరుకోవడం కష్ట తరంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఈ శిబిరాల భద్రతా బాధ్యతను పాకిస్థాన్ సైన్యంలోని ప్రత్యేక భద్రతా గార్డులకు అప్పగించారు. వారు డ్రోన్లు, థర్మల్ సెన్సార్లు, నైట్ విజన్ కెమెరాలు వంటి ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో ఈ ప్రాంతాలను పర్యవేక్షిస్తారు. ఈసారి ఉగ్రవాద సంస్థలు తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి. ఇప్పుడు ఒక శిబిరంలో 200 కంటే తక్కువ మంది ఉగ్రవాదులను ఉంచుతారట. భారతీయ ఏజెన్సీలకు ట్రాక్ చేయడం కష్టతరం అయ్యేలా అనేక చిన్న శిబిరాలను నిర్మిస్తున్నారు. శిక్షణ పూర్తయిన వెంటనే, ఉగ్రవాదులను వెంటనే సరిహద్దు వైపు పంపుతారు.
READ MORE: Gujarat High Court: టాయిలెట్లో కూర్చుని వర్చువల్ విచారణకు హాజరైన యువకుడు.. వీడియో వైరల్
ఈ సమాచారం అందిన తర్వాత, భారత భద్రతా సంస్థలు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో కార్యకలాపాలపై తమ పర్యవేక్షణను మరింత ముమ్మరం చేశాయి. సైన్యం, నిఘా సంస్థలు హై అలర్ట్ జారీ చేశాయి. పీఓకేలో ఈ స్థావరాలను తిరిగి ఏర్పాటు చేస్తున్న వారిపై ఉపగ్రహ చిత్రాలు, గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ద్వారా నిఘా పెంచారు. కాగా.. ఆపరేషన్ సింధూర్ కింద భారత భద్రతా సంస్థలు పాకిస్థాన్లోని అనేక ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేశాయి. వాటిలో లూని, పుత్వాల్, భైరోనాథ్, పిపి ధన్ధర్, టిప్పు, ముంతాజ్ కాంప్లెక్స్, జమీల్, సైధ్వాలి, ఉమ్రాన్వాలి బంకర్, చాప్రార్ ఫార్వర్డ్, చోటా చక్ పోస్ట్, అఫ్జల్ షహీద్ పోస్ట్, జంగ్లోరా పోస్ట్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ప్రదేశాలన్నింటిలోనూ వాటిని కొత్త మార్గాల్లో తిరిగి సిద్ధం చేసే కసరత్తు ప్రారంభమైంది.
తాజావార్తలు
-
The Paradise : ఇంటెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్… ‘ది ప్యారడైజ్’పై బజ్ పెంచే అప్డేట్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Vaibhav Sooryavanshi: “నువ్వు గ్రేట్ రా బుడ్డోడా”.. కెప్టెన్ తిలక్ వర్మ నమ్మకాన్ని నిలబెట్టిన వైభవ్..
-
Janhvi Kapoor : బాయ్ ఫ్రెండ్ తో మ్యారేజ్ ఫిక్సా? వైరల్ ఫొటోతో వార్తల్లోకి జాన్వీ పెళ్లి
-
ToxicTheMovie : వాయిదాల పర్వం ముగిసింది.. టాక్సిక్ రిలీజ్ డేట్ వచ్చింది
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!