Kartika Masa Rituals: కార్తీకమాసం ఆచారాలు.. శాస్త్రీయ రహస్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kartika Masa Rituals: శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం.. ఈ మాసంలో స్త్రీ, పురుషులనే బేధం లేకుండా అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో ఆ పరమశివుడిని ఆరాధిస్తారు. కాగా ఈ మాసం లో నదీస్నాలు, దీపారాధన, ఉపవాసాలు, వనభోజనాలు, ఇలా చాలా ఆచారాలను అనాదిగా పాటిస్తున్నారు. అయితే ఈ మాసంలో పాటించే ప్రతి ఆచారం వెనుక సైన్స్ దాగి ఉంది. కార్తీక మాసం లో ఆచరించే ప్రతి నియమం మన ఆరోగ్యాన్ని మేరుపరుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ ఆచారాల వెనుక దాగిన ఆ నిగూడ శాస్త్రీయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం అనే కాదు హిందూ ధర్మంలో ఏ పండుగను ఆచరించిన మొదటగా గుమ్మానికి మామిడాకు తోరణాలు కడతారు. ఇలా మామిడాకు తోరణాలు కట్టడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది అంటారు. అయితే లక్ష్మి అంటే సంపద మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. చెట్టు నుండి తెంపిన తరువాత కూడా మామిడాకులకు కార్బన్డైఆక్సైడ్ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ను వదిలే శక్తి ఉంది. కనుక మామిడాకులను గుమ్మానికి కడితే అవి కార్బన్డైఆక్సైడ్ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ను మనకు అందిస్తాయి. అందుకే తోరణాలను కడుతారు.
Read also:IT Rides in Hyderabad: మరోసారి ఐటీ దాడులు.. బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో సోదాలు
Also Read
- Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
- Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
- Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
- Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ఇక ఈ మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది. కనుక మనలో వ్యాధినిరోధక తగ్గిపోతుంది. ఇలా వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే నది నీరు అనేక కొండలు, కోనలు, లోయలు దాటుకుంటూ వస్తుంది. ఇలా కొండలు, కోనలు, లోయల మీదుగా ప్రయాణించే సమయంలో ఆ నీటిలో అనేక ఔషధ గుణాలు కలిగిన మూలికలు కలుస్తాయి. కనుక ఆ నీటిలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలానే నది నీరు చల్లగా ఉంటుంది. ఇలా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగుతుంది. దీని కారణంగా అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.కనుక ఈ మాసంలో చాలామంది చన్నీటి స్నానానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇక నదీస్నానం అనంతరం నేతి దీపాలను నది లో వదులుతారు. ఇలా చేయడం వల్ల దీపాల వేడికి వాతావరణం లోని క్రిములు, కీటకాలు, దోమలు నశించిపోయి గాలి శుద్ధవుతుంది.
Read also:RBI Data: ప్రభుత్వం పై 1140శాతం పెరిగిన పెన్షన్ భారం..2022-23లో రూ.4.63లక్షల కోట్లు
అలానే నేతి దీపాలు వెలిగించడం వల్ల గాలిలో ఆక్సీజన్ శాతం పెరుగుతుంది. ఆ గాలిని పీల్చ్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అందుకే ఇంట్లోను గుడి లోనూ నేతి దీపాలను వెలిగిస్తారు. ఇక పసుపులో యాంటీబ్యాక్టీయిల్ గుణాలు ఉంటాయని అందరికి తెలిసిందే అయితే చలికాలంలో కాళ్ళు ఎక్కువగా పగులుతుంటాయి. అయితే ఇలా పసుపు రాసుకోవడం వల్ల కాళ్ళ పగుళ్ళ నుండి ఉపశమనం లభిస్తుంది. అదే మహిళలు కాళ్ళకు పసుపు రాసుకోవడం వెనుక దాగి ఉన్న రహస్యం. అలానే ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తారు. దీనికి కారణం ఉసిరి చెట్టులో ప్రతి భాగం ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.ఇలా ఉసిరి చెట్టు కింద కూర్చొని తినే సమయంలో ఆ చెట్టు ఆకులు పైన రాలుతుంటాయి. అలా పైన రాలిన ఆకుల్లోని ఔషధ గుణాలను శరీరం గ్రహిస్తుంది. అలానే ఇలా కలిసి భోజనం చేయడం వల్ల మానవ సంబంధాలు కూడా బలపడతాయి. అలానే ఉపవాసం చేయడం వల్ల శరీరం లో క్లెన్సింగ్ ప్రక్రియ జరిగి విషపదార్థాలు తొలగిపోతాయి. ఫలితంగా శరీరానికి చురుకుదనం, ఉత్సాహం, శక్తి అందుతాయి. ఇక మాసం తినక పోవడానికి కారణం.. ఈ మాసం లో వేడి తీవ్రత తక్కువగా ఉంటుంది. కనుక మాంసాహారం త్వరగా జీర్ణం కాదు. అందుకే ఈ మాసంలో సాత్విక ఆహరం అంటే కూరాయగలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు.
NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!