Kartika Masa Rituals: కార్తీకమాసం ఆచారాలు.. శాస్త్రీయ రహస్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kartika Masa Rituals: శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం.. ఈ మాసంలో స్త్రీ, పురుషులనే బేధం లేకుండా అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో ఆ పరమశివుడిని ఆరాధిస్తారు. కాగా ఈ మాసం లో నదీస్నాలు, దీపారాధన, ఉపవాసాలు, వనభోజనాలు, ఇలా చాలా ఆచారాలను అనాదిగా పాటిస్తున్నారు. అయితే ఈ మాసంలో పాటించే ప్రతి ఆచారం వెనుక సైన్స్ దాగి ఉంది. కార్తీక మాసం లో ఆచరించే ప్రతి నియమం మన ఆరోగ్యాన్ని మేరుపరుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ ఆచారాల వెనుక దాగిన ఆ నిగూడ శాస్త్రీయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం అనే కాదు హిందూ ధర్మంలో ఏ పండుగను ఆచరించిన మొదటగా గుమ్మానికి మామిడాకు తోరణాలు కడతారు. ఇలా మామిడాకు తోరణాలు కట్టడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది అంటారు. అయితే లక్ష్మి అంటే సంపద మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. చెట్టు నుండి తెంపిన తరువాత కూడా మామిడాకులకు కార్బన్డైఆక్సైడ్ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ను వదిలే శక్తి ఉంది. కనుక మామిడాకులను గుమ్మానికి కడితే అవి కార్బన్డైఆక్సైడ్ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ను మనకు అందిస్తాయి. అందుకే తోరణాలను కడుతారు.
Read also:IT Rides in Hyderabad: మరోసారి ఐటీ దాడులు.. బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో సోదాలు
Also Read
ఇక ఈ మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది. కనుక మనలో వ్యాధినిరోధక తగ్గిపోతుంది. ఇలా వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే నది నీరు అనేక కొండలు, కోనలు, లోయలు దాటుకుంటూ వస్తుంది. ఇలా కొండలు, కోనలు, లోయల మీదుగా ప్రయాణించే సమయంలో ఆ నీటిలో అనేక ఔషధ గుణాలు కలిగిన మూలికలు కలుస్తాయి. కనుక ఆ నీటిలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలానే నది నీరు చల్లగా ఉంటుంది. ఇలా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగుతుంది. దీని కారణంగా అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.కనుక ఈ మాసంలో చాలామంది చన్నీటి స్నానానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇక నదీస్నానం అనంతరం నేతి దీపాలను నది లో వదులుతారు. ఇలా చేయడం వల్ల దీపాల వేడికి వాతావరణం లోని క్రిములు, కీటకాలు, దోమలు నశించిపోయి గాలి శుద్ధవుతుంది.
Read also:RBI Data: ప్రభుత్వం పై 1140శాతం పెరిగిన పెన్షన్ భారం..2022-23లో రూ.4.63లక్షల కోట్లు
అలానే నేతి దీపాలు వెలిగించడం వల్ల గాలిలో ఆక్సీజన్ శాతం పెరుగుతుంది. ఆ గాలిని పీల్చ్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అందుకే ఇంట్లోను గుడి లోనూ నేతి దీపాలను వెలిగిస్తారు. ఇక పసుపులో యాంటీబ్యాక్టీయిల్ గుణాలు ఉంటాయని అందరికి తెలిసిందే అయితే చలికాలంలో కాళ్ళు ఎక్కువగా పగులుతుంటాయి. అయితే ఇలా పసుపు రాసుకోవడం వల్ల కాళ్ళ పగుళ్ళ నుండి ఉపశమనం లభిస్తుంది. అదే మహిళలు కాళ్ళకు పసుపు రాసుకోవడం వెనుక దాగి ఉన్న రహస్యం. అలానే ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తారు. దీనికి కారణం ఉసిరి చెట్టులో ప్రతి భాగం ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.ఇలా ఉసిరి చెట్టు కింద కూర్చొని తినే సమయంలో ఆ చెట్టు ఆకులు పైన రాలుతుంటాయి. అలా పైన రాలిన ఆకుల్లోని ఔషధ గుణాలను శరీరం గ్రహిస్తుంది. అలానే ఇలా కలిసి భోజనం చేయడం వల్ల మానవ సంబంధాలు కూడా బలపడతాయి. అలానే ఉపవాసం చేయడం వల్ల శరీరం లో క్లెన్సింగ్ ప్రక్రియ జరిగి విషపదార్థాలు తొలగిపోతాయి. ఫలితంగా శరీరానికి చురుకుదనం, ఉత్సాహం, శక్తి అందుతాయి. ఇక మాసం తినక పోవడానికి కారణం.. ఈ మాసం లో వేడి తీవ్రత తక్కువగా ఉంటుంది. కనుక మాంసాహారం త్వరగా జీర్ణం కాదు. అందుకే ఈ మాసంలో సాత్విక ఆహరం అంటే కూరాయగలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు.
NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..
తాజావార్తలు
-
Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
-
Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
-
Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్పై క్రేజీ అప్డేట్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!