IT Rides in Hyderabad: మరోసారి ఐటీ దాడులు.. బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుల ఇళ్లలో సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Rides in Hyderabad: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐటీ దాడులు మరోసారి కలకలం సృష్టించాయి. ఈసారి ఈ దాడుల టార్గెట్ బీఆర్ఎస్ నేతలే. మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అనుచరులు ఇళ్లలో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడలోని వైదేహి వెంచర్స్ లో సోదాలు కొనసాగిస్తున్న ఐటీ అధికారులు. మిర్యాలగూడ, నల్గొండ, హైదరాబాదులో 40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు శ్రీధర్ తో పాటు వాళ్ళ కుమారుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. వైదేహి కన్స్ట్రక్షన్ పేరుతో నల్లమోతు భాస్కరరావు అనుచరులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారంతో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు భారీగా డబ్బు ఆదా అయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సమాచారం అందిన వెంటనే ఐటీ అధికారులు వారి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు.
ఇటీవల మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుల ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. సోమవారం (నవంబర్ 13) మొదలైన ఐటీ సోదాలు బుధవారం (నవంబర్ 15)తో ముగిశాయి. ఈ సోదాల్లో సబిత అనుచరురాలుగా ప్రచారం పొందుతున్న నరేంద్రరెడ్డి ఇంట్లో రూ.7.50 కోట్లు, ప్రదీప్ రెడ్డి ఇంట్లో రూ.5 కోట్లకు పైగా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం ఎన్నికల కోసం ఈ డబ్బును సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి సబిత కుమారుడితో ప్రదీప్ రెడ్డి, నరేంద్రరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నట్లు ఐటీ అధికారులు విచారణలో గుర్తించారు. కొద్ది వారాల క్రితం కాంగ్రెస్ నేత పారిజాత నరసింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేఎల్ఆర్ ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరిగాయి. మాజీ మంత్రి జానా రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. తుమ్మల నాగేశ్వరరావు ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో స్పందించిన టీపీసీసీ రేవంత్ కాంగ్రెస్ నేతల ఇళ్లను టార్గెట్ చేశారు. దీని వెనుక బీఆర్ఎస్, బీజేపీ నేతల హస్తం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయనే గందరగోళం నెలకొంది.
RBI Data: ప్రభుత్వం పై 1140శాతం పెరిగిన పెన్షన్ భారం..2022-23లో రూ.4.63లక్షల కోట్లు
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!