Maruti Suzuki: మారుతి సుజుకి చరిత్ర.. 30 రోజుల్లో 2.29 లక్షల కార్ల విక్రయాలు!
- మారుతి సుజుకి చరిత్ర
- 30 రోజుల్లో 2.29 లక్షల కార్ల విక్రయాలు
- మొత్తం 229,021 యూనిట్ల అమ్మకాలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’కి 2025 నవంబర్ మాసం ప్రత్యేకంగా మారిందనే చెప్పాలి. గత నెలలో ఎన్నడూ లేనివిధంగా కంపెనీ అత్యధిక కార్ల విక్రయాలను నమోదు చేసింది. ఒకే నెలలో 2.29 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. దాంతో మారుతి సుజుకి చరిత్ర సృష్టించింది. మారుతి సుజుకి ఒక నెలలో ఇన్ని కార్లను ఎన్నడూ అమ్మలేదు. జీఎస్టీ రేటు తగ్గింపు, పండుగ సీజన్ అమ్మకాలు కంపెనీకి కలిసొచ్చాయి.
నవంబర్ 2025లో మారుతి సుజుకి మొత్తం 229,021 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది దేశీయ మార్కెట్లో తన బ్రాండ్ ఉత్పత్తి పోర్ట్ఫోలియోకు బలమైన డిమాండ్ను, అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ కార్ల ప్రజాదరణలో వృద్ధిని స్పష్టంగా సూచిస్తుంది. మొత్తం అమ్మకాలలో 174,593 యూనిట్లు దేశీయ మార్కెట్లో అమ్ముడయ్యాయి. 8,371 యూనిట్లు ఇతర OEMలకు (టయోటాతో సహా) రవాణా చేయబడ్డాయి. ఈ రికార్డును సాధించడంలో ఎగుమతులు ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యంగా జిమ్నీ ఫైవ్-డోర్, బాలెనో వంటి మోడళ్లకు ప్రపంచ డిమాండ్ ఉండడం కలిసొచ్చింది.
Also Read
- TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
- Ampere Magnus Neo: ఫ్యామిలీ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆంపియర్ మాగ్నస్ నియో రిలీజ్.. 10 సంవత్సరాల బ్యాటరీ లైఫ్
- IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్పై సంచలన ఆరోపణలు.. స్లాప్గేట్ మళ్లీ వార్తల్లో
- Mercedes CLA EV: భారత్ లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ CLA EV.. 792 km రేంజ్, 800V ఫాస్ట్ ఛార్జింగ్ - పూర్తి వివరాలు
మారుతి సుజుకి ఎంట్రీ-లెవల్, కాంపాక్ట్ కార్లకు డిమాండ్ బాగా ఉంది. ఈ విభాగంలో ఆల్టో K10, S-ప్రెస్సో, బాలెనో, స్విఫ్ట్, వాగన్ఆర్, డిజైర్, సెలెరియో అమ్మకాలు బాగున్నాయి. జీఎస్టీ 2.0 అమలు తర్వాత ధర తగ్గింపు, పండుగ సీజన్ కావడంతో అమ్మకాలు భారీగా జరిగాయి. మినీ, కాంపాక్ట్ విభాగాలు కలిసి 85,273 యూనిట్స్ అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువ. మారుతి సుజుకి యుటిలిటీ వెహికల్ విభాగంలో తన ఉనికిని చాటుతోంది. ఇటీవల కంపెనీ తన కొత్త మిడ్-సైజ్ SUV విక్టోరిస్ను విడుదల చేసింది. బ్రెజ్జా, ఎర్టిగా, గ్రాండ్ విటారా, XL6, జిమ్నీ, ఇన్విక్టో వంటి ప్రసిద్ధ SUVలు 72,498 యూనిట్లను విక్రయించాయి.
అత్యంత ప్రజాదరణ పొందిన కారు మారుతి ఈకో నవంబర్లో 13,200 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈకో వ్యాన్కు డిమాండ్ స్థిరంగా ఉంది. సూపర్ క్యారీ 3,622 యూనిట్లు అమ్ముడైంది. మొత్తం దేశీయ అమ్మకాలు 174,593 యూనిట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అమ్మకాలు కూడా గత ఆర్థిక సంవత్సరం కంటే మెరుగ్గా ఉన్నాయి. మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారు మారుతి ఇ విటారాను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్లతో వచ్చింది. ఏడు ఎయిర్బ్యాగ్లను కలిగి ఉన్న మారుతి మొదటి కారు ఇదే. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిమీ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.
తాజావార్తలు
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
-
ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!