Temba Bavuma: రోహిత్ టీ20 ప్రపంచకప్ ఆడుతున్నపుడు నేను స్కూల్లో ఉన్నా.. హిట్మ్యాన్ ఇంకా ఆడుతున్నాడు!
- రోహిత్ టీ20 ప్రపంచకప్ ఆడుతున్నపుడు నేను స్కూల్లో ఉన్నా
- హిట్మ్యాన్ రోహిత్ ఇంకా ఆడుతున్నాడు
- తొలి వన్డేకు దూరంగా ఉన్న బావుమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్లో ఆడుతున్నప్పుడు తాను స్కూల్లో ఉన్నానని దక్షిణాఫ్రికా సారథి తెంబా బావుమా గుర్తుచేసుకున్నాడు. ఇప్పటికీ హిట్మ్యాన్ రోహిత్ భారత జట్టులో ఉన్నాడని, అతడు ప్రపంచ స్థాయి ప్లేయర్ ప్రశంసించాడు. రోహిత్, విరాట్ కోహ్లీ రాకతో భారత జట్టు బలంగా మారిందని బావుమా చెప్పాడు. తొలి వన్డేకు దూరంగా ఉన్న బావుమా.. రెండో వన్డేలో ఆడనున్నాడు. రెండో వన్డే నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో బావుమా మాట్లాడాడు.
‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాకతో భారత జట్టు బలంగా మారింది. రో-కోల అనుభవం జట్టుకు ఉపదయోగపడుతుందని సిరీస్ ఆరంభంలోనే చెప్పా. ఆ విషయం మాకు తెలుసు. హిట్మ్యాన్ రోహిత్ 2007 టీ20 ప్రపంచకప్ ఆడుతున్నపుడు నేను స్కూల్ చదువుతున్నా. ఇప్పటికీ రోహిత్ భారత జట్టులో ఉన్నాడు. రో-కోలు వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. వారితో చాలా మ్యాచ్లు ఆడాం. ఇద్దరి వల్ల మా జట్టు చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్నిసార్లు మేం విజయం సాధించాం. భారత జట్టులో రోహిత్, కోహ్లీ ఉండడం ఉత్సాహాన్ని పెంచుతుంది. అన్ని సిరీస్ను మరింత ఉత్తేజకరంగా మారుస్తాయి’ అని తెంబా బావుమా చెప్పాడు.
Also Read
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
- Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
- Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
Also Read: IND vs SA: నేడు దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. భారత జట్టులో మార్పులు?, ఒక్క మ్యాచ్కే పక్కనపెడితే!
రాంచి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో గెలిచింది. విరాట్ కోహ్లీ (135) సెంచరీ చేయగా.. రోహిత్ శర్మ (57) హాఫ్ సెంచరీ బాదాడు. నేడు రెండు జట్ల మధ్య రాయ్పుర్లో రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత్ చూస్తోంది. రో-కోలు రాయ్పుర్లో చెలరేగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు ఒకే వన్డే మ్యాచ్ ఆడి ఘన విజయం సాధించింది.
తాజావార్తలు
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
-
5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..