Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఎలక్ట్రిక్ వాహన యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- దేశవ్యాప్తంగా భారీ ఛార్జింగ్ నెట్వర్క్ ఏర్పాటు..
- 4,874 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Vehicle: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల( EV) ట్రెండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ రేట్ల అనిశ్చితి మధ్య చాలా మంది వినియోగదారులు ఈవీల వైపు మళ్లుతున్నారు. భారత ఆటోమొబైల్ మార్కెట్లో EV వాటా 5.77 శాతానికి చేరింది. అయితే, ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, రేంజ్ తక్కువగా ఉండటం వల్ల దూర ప్రాంతాల ప్రయాణాలు కష్టంగా మారుతున్నాయి. ఈ తరుణంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు, రేంజ్, ఛార్జింగ్ సమస్యల్ని దూరం చేసేందుకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రకటించింది . ఈ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 4,874 ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.503.86 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ పీఎం ఇ-డ్రైవ్ పథకంలో భాగంగా తీసుకువస్తు్న్నారు.
Also Read
- క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
- 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
- Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో
- TVS iQube S: టీవీఎస్ iQube S 4.7kWh ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 175KM రేంజ్.. ధర ఎంతంటే?
Read Also: US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి మే 12న బెంగళూర్లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈవీ వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత రేంజ్ అనేది వినియోగదారులకు ఆందోళనకర విషయంగా మారింది. దీనిని దూరం చేసేందుకే కేంద్రం ఈ చర్యను చేపట్టింది. ప్రజలు తమ వాహనాలను అవసరమైనప్పుడు ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఒక పటిష్టమైన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఈ ఛార్జింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, త్రీవీలర్, బస్సులు, భారీ ట్రక్కులను ఛార్జింగ్ చేసే సౌకర్యం ఉంటుంది. ప్లాన్ ప్రకారం ఈ ఛార్జింగ్ స్టేషన్లను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. వీటిలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయి. ఎక్కువగా కర్ణాటకలో ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 1243 ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు రూ. 123.66 ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్యాసింజర్ వాహన మార్కెట్లో ఈవీల వాటా 5.77 శాతంగా ఉంది. టూ వీలర్ వాహన విభాగంలో వీటి వాటా 7.76 శాతానికి చేరుకుంది. కమర్షియల్ వాహన విభాగంలో వీటి వాటా 2.26 శాతానికి చేరుకుంది.
తాజావార్తలు
-
Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!