Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఎలక్ట్రిక్ వాహన యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- దేశవ్యాప్తంగా భారీ ఛార్జింగ్ నెట్వర్క్ ఏర్పాటు..
- 4,874 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Vehicle: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల( EV) ట్రెండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ రేట్ల అనిశ్చితి మధ్య చాలా మంది వినియోగదారులు ఈవీల వైపు మళ్లుతున్నారు. భారత ఆటోమొబైల్ మార్కెట్లో EV వాటా 5.77 శాతానికి చేరింది. అయితే, ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, రేంజ్ తక్కువగా ఉండటం వల్ల దూర ప్రాంతాల ప్రయాణాలు కష్టంగా మారుతున్నాయి. ఈ తరుణంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు, రేంజ్, ఛార్జింగ్ సమస్యల్ని దూరం చేసేందుకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రకటించింది . ఈ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 4,874 ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.503.86 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ పీఎం ఇ-డ్రైవ్ పథకంలో భాగంగా తీసుకువస్తు్న్నారు.
Also Read
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
Read Also: US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి మే 12న బెంగళూర్లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈవీ వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత రేంజ్ అనేది వినియోగదారులకు ఆందోళనకర విషయంగా మారింది. దీనిని దూరం చేసేందుకే కేంద్రం ఈ చర్యను చేపట్టింది. ప్రజలు తమ వాహనాలను అవసరమైనప్పుడు ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఒక పటిష్టమైన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఈ ఛార్జింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, త్రీవీలర్, బస్సులు, భారీ ట్రక్కులను ఛార్జింగ్ చేసే సౌకర్యం ఉంటుంది. ప్లాన్ ప్రకారం ఈ ఛార్జింగ్ స్టేషన్లను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. వీటిలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయి. ఎక్కువగా కర్ణాటకలో ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 1243 ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు రూ. 123.66 ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్యాసింజర్ వాహన మార్కెట్లో ఈవీల వాటా 5.77 శాతంగా ఉంది. టూ వీలర్ వాహన విభాగంలో వీటి వాటా 7.76 శాతానికి చేరుకుంది. కమర్షియల్ వాహన విభాగంలో వీటి వాటా 2.26 శాతానికి చేరుకుంది.
తాజావార్తలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
-
Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!