Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఎలక్ట్రిక్ వాహన యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- దేశవ్యాప్తంగా భారీ ఛార్జింగ్ నెట్వర్క్ ఏర్పాటు..
- 4,874 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Vehicle: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల( EV) ట్రెండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ రేట్ల అనిశ్చితి మధ్య చాలా మంది వినియోగదారులు ఈవీల వైపు మళ్లుతున్నారు. భారత ఆటోమొబైల్ మార్కెట్లో EV వాటా 5.77 శాతానికి చేరింది. అయితే, ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, రేంజ్ తక్కువగా ఉండటం వల్ల దూర ప్రాంతాల ప్రయాణాలు కష్టంగా మారుతున్నాయి. ఈ తరుణంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు, రేంజ్, ఛార్జింగ్ సమస్యల్ని దూరం చేసేందుకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రకటించింది . ఈ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 4,874 ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.503.86 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ పీఎం ఇ-డ్రైవ్ పథకంలో భాగంగా తీసుకువస్తు్న్నారు.
Also Read
- Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
- Norton Atlas India: భారత మార్కెట్లోకి నార్టన్ బైక్స్.. హోసూర్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం.. జూలైలో గ్లోబల్ లాంచ్!
- Skoda Peak EV: స్కోడా కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV ‘పీక్’ ఆవిష్కరణ.. 647KM రేంజ్తో అదిరిపోయే ఫీచర్లు
- 160cc Bikes: మంచి మైలేజ్ కోసం చూస్తున్నారా?.. 160cc సెగ్మెంట్లో బెస్ట్ బైక్లు ఇవే..!
Read Also: US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి మే 12న బెంగళూర్లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈవీ వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత రేంజ్ అనేది వినియోగదారులకు ఆందోళనకర విషయంగా మారింది. దీనిని దూరం చేసేందుకే కేంద్రం ఈ చర్యను చేపట్టింది. ప్రజలు తమ వాహనాలను అవసరమైనప్పుడు ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఒక పటిష్టమైన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఈ ఛార్జింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, త్రీవీలర్, బస్సులు, భారీ ట్రక్కులను ఛార్జింగ్ చేసే సౌకర్యం ఉంటుంది. ప్లాన్ ప్రకారం ఈ ఛార్జింగ్ స్టేషన్లను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. వీటిలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయి. ఎక్కువగా కర్ణాటకలో ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 1243 ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు రూ. 123.66 ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్యాసింజర్ వాహన మార్కెట్లో ఈవీల వాటా 5.77 శాతంగా ఉంది. టూ వీలర్ వాహన విభాగంలో వీటి వాటా 7.76 శాతానికి చేరుకుంది. కమర్షియల్ వాహన విభాగంలో వీటి వాటా 2.26 శాతానికి చేరుకుంది.
తాజావార్తలు
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!