Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఎలక్ట్రిక్ వాహన యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- దేశవ్యాప్తంగా భారీ ఛార్జింగ్ నెట్వర్క్ ఏర్పాటు..
- 4,874 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Vehicle: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల( EV) ట్రెండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ రేట్ల అనిశ్చితి మధ్య చాలా మంది వినియోగదారులు ఈవీల వైపు మళ్లుతున్నారు. భారత ఆటోమొబైల్ మార్కెట్లో EV వాటా 5.77 శాతానికి చేరింది. అయితే, ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, రేంజ్ తక్కువగా ఉండటం వల్ల దూర ప్రాంతాల ప్రయాణాలు కష్టంగా మారుతున్నాయి. ఈ తరుణంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు, రేంజ్, ఛార్జింగ్ సమస్యల్ని దూరం చేసేందుకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రకటించింది . ఈ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 4,874 ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.503.86 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ పీఎం ఇ-డ్రైవ్ పథకంలో భాగంగా తీసుకువస్తు్న్నారు.
Also Read
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
- Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
- TVS iQube MillionR Edition: 145KM రేంజ్తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్తో MillionR Edition!
Read Also: US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి మే 12న బెంగళూర్లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈవీ వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత రేంజ్ అనేది వినియోగదారులకు ఆందోళనకర విషయంగా మారింది. దీనిని దూరం చేసేందుకే కేంద్రం ఈ చర్యను చేపట్టింది. ప్రజలు తమ వాహనాలను అవసరమైనప్పుడు ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఒక పటిష్టమైన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఈ ఛార్జింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, త్రీవీలర్, బస్సులు, భారీ ట్రక్కులను ఛార్జింగ్ చేసే సౌకర్యం ఉంటుంది. ప్లాన్ ప్రకారం ఈ ఛార్జింగ్ స్టేషన్లను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. వీటిలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయి. ఎక్కువగా కర్ణాటకలో ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 1243 ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు రూ. 123.66 ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్యాసింజర్ వాహన మార్కెట్లో ఈవీల వాటా 5.77 శాతంగా ఉంది. టూ వీలర్ వాహన విభాగంలో వీటి వాటా 7.76 శాతానికి చేరుకుంది. కమర్షియల్ వాహన విభాగంలో వీటి వాటా 2.26 శాతానికి చేరుకుంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..