Nandyal Tragedy: అల్లుడు చేసిన అప్పుకు.. మామకు బలయ్యాడు ! మైక్రో ఫైనాన్స్ వాళ్ల వేధింపులతో సామాన్యుడి ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandyal Tragedy: నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఘోరం జరిగింది. అల్లుడు చేసిన ఆర్థిక లావాదేవీల గొడవ.. ఓ నిరుపేద కార్పెంటర్ ప్రాణాలను బలి తీసుకుంది. మైక్రో ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులు, పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక రమణ అనే వ్యక్తి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన రమణ.. గత కొన్నేళ్లుగా కార్పెంటర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కుమార్తె కొద్దికాలం క్రితం గంగాధర్ ఆచారి అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. అయితే, గంగాధర్ ఓ ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ సుమారు 70 లక్షల రూపాయల సంస్థ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఫైనాన్స్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది.
READ ALSO: Notice to Haleem Stalls: హలీమ్ స్టాల్స్కు అధికారుల నోటీసులు.. ఉదయం వరకు తొలగించాల్సిందే..!
Also Read
- Champapet Murder : అన్నదమ్ముల గొడవలో దారుణం.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు.!
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
అల్లుడు గంగాధర్ అప్పు చెల్లించలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు, ఫైనాన్స్ నిర్వాహకులు రమణను లక్ష్యంగా చేసుకున్నారు. “అల్లుడు చేసిన అప్పు నువ్వు కట్టాల్సిందే” అంటూ రమణను పదేపదే స్టేషన్కు పిలిపించి వేధించినట్లు తెలుస్తోంది. బాండ్ పేపర్లు, చెక్కుబుక్కులు ఇవ్వాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడంతో రమణ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మైక్రో ఫైనాన్స్ వేధింపులకు తీవ్ర ఒత్తిడికి లోనైన రమణ.. ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రమణ కన్నుమూశారు. కేవలం 10 లక్షల రూపాయల వివాదం ఉంటే.. అందులో 5 లక్షలు ఇప్పటికే చెల్లించామని.. అయినా వేధింపులు ఆపలేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, వేధింపులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రమణ కుటుంబం డిమాండ్ చేస్తోంది. అప్పు చేసింది.. తప్పు చేసింది అల్లుడు అయితే పోలీసుల వేధింపులు మాత్రం మామకు జరిగాయి. దీంతో ఆ సామాన్యుడు రమణ మృతితో ఆ కుటుంబం వీధిన పడింది.
READ ALSO: Healthy Food: బాలింతలకు వరం.. పసిపాపలకు బలం.. ‘బీరకాయ తెలగపిండి కూర’!
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!