Nandyal Tragedy: అల్లుడు చేసిన అప్పుకు.. మామకు బలయ్యాడు ! మైక్రో ఫైనాన్స్ వాళ్ల వేధింపులతో సామాన్యుడి ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandyal Tragedy: నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఘోరం జరిగింది. అల్లుడు చేసిన ఆర్థిక లావాదేవీల గొడవ.. ఓ నిరుపేద కార్పెంటర్ ప్రాణాలను బలి తీసుకుంది. మైక్రో ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులు, పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక రమణ అనే వ్యక్తి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన రమణ.. గత కొన్నేళ్లుగా కార్పెంటర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కుమార్తె కొద్దికాలం క్రితం గంగాధర్ ఆచారి అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. అయితే, గంగాధర్ ఓ ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ సుమారు 70 లక్షల రూపాయల సంస్థ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఫైనాన్స్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది.
READ ALSO: Notice to Haleem Stalls: హలీమ్ స్టాల్స్కు అధికారుల నోటీసులు.. ఉదయం వరకు తొలగించాల్సిందే..!
Also Read
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
అల్లుడు గంగాధర్ అప్పు చెల్లించలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు, ఫైనాన్స్ నిర్వాహకులు రమణను లక్ష్యంగా చేసుకున్నారు. “అల్లుడు చేసిన అప్పు నువ్వు కట్టాల్సిందే” అంటూ రమణను పదేపదే స్టేషన్కు పిలిపించి వేధించినట్లు తెలుస్తోంది. బాండ్ పేపర్లు, చెక్కుబుక్కులు ఇవ్వాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడంతో రమణ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మైక్రో ఫైనాన్స్ వేధింపులకు తీవ్ర ఒత్తిడికి లోనైన రమణ.. ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రమణ కన్నుమూశారు. కేవలం 10 లక్షల రూపాయల వివాదం ఉంటే.. అందులో 5 లక్షలు ఇప్పటికే చెల్లించామని.. అయినా వేధింపులు ఆపలేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, వేధింపులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రమణ కుటుంబం డిమాండ్ చేస్తోంది. అప్పు చేసింది.. తప్పు చేసింది అల్లుడు అయితే పోలీసుల వేధింపులు మాత్రం మామకు జరిగాయి. దీంతో ఆ సామాన్యుడు రమణ మృతితో ఆ కుటుంబం వీధిన పడింది.
READ ALSO: Healthy Food: బాలింతలకు వరం.. పసిపాపలకు బలం.. ‘బీరకాయ తెలగపిండి కూర’!
తాజావార్తలు
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!