Nandyal Tragedy: అల్లుడు చేసిన అప్పుకు.. మామకు బలయ్యాడు ! మైక్రో ఫైనాన్స్ వాళ్ల వేధింపులతో సామాన్యుడి ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandyal Tragedy: నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఘోరం జరిగింది. అల్లుడు చేసిన ఆర్థిక లావాదేవీల గొడవ.. ఓ నిరుపేద కార్పెంటర్ ప్రాణాలను బలి తీసుకుంది. మైక్రో ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులు, పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక రమణ అనే వ్యక్తి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన రమణ.. గత కొన్నేళ్లుగా కార్పెంటర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కుమార్తె కొద్దికాలం క్రితం గంగాధర్ ఆచారి అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. అయితే, గంగాధర్ ఓ ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ సుమారు 70 లక్షల రూపాయల సంస్థ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఫైనాన్స్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది.
READ ALSO: Notice to Haleem Stalls: హలీమ్ స్టాల్స్కు అధికారుల నోటీసులు.. ఉదయం వరకు తొలగించాల్సిందే..!
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
అల్లుడు గంగాధర్ అప్పు చెల్లించలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు, ఫైనాన్స్ నిర్వాహకులు రమణను లక్ష్యంగా చేసుకున్నారు. “అల్లుడు చేసిన అప్పు నువ్వు కట్టాల్సిందే” అంటూ రమణను పదేపదే స్టేషన్కు పిలిపించి వేధించినట్లు తెలుస్తోంది. బాండ్ పేపర్లు, చెక్కుబుక్కులు ఇవ్వాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడంతో రమణ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మైక్రో ఫైనాన్స్ వేధింపులకు తీవ్ర ఒత్తిడికి లోనైన రమణ.. ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రమణ కన్నుమూశారు. కేవలం 10 లక్షల రూపాయల వివాదం ఉంటే.. అందులో 5 లక్షలు ఇప్పటికే చెల్లించామని.. అయినా వేధింపులు ఆపలేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, వేధింపులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రమణ కుటుంబం డిమాండ్ చేస్తోంది. అప్పు చేసింది.. తప్పు చేసింది అల్లుడు అయితే పోలీసుల వేధింపులు మాత్రం మామకు జరిగాయి. దీంతో ఆ సామాన్యుడు రమణ మృతితో ఆ కుటుంబం వీధిన పడింది.
READ ALSO: Healthy Food: బాలింతలకు వరం.. పసిపాపలకు బలం.. ‘బీరకాయ తెలగపిండి కూర’!
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!