Karnataka: ప్రభుత్వ ఉద్యోగి కంటే.. పానీ-పూరీ అమ్మేవాడే బెటర్!.. ఎందుకంటే..
- ప్రభుత్వ ఉద్యోగానికి ప్రాధాన్యం
- ప్రభుత్వ ఉద్యోగాల కంటే పానీ-పూరీ అమ్మడం బెటర్
- పని ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నాం
- వ్యాధులు వస్తున్నాయ్
- ప్రశాంతంగా జీవించలేక పోతున్నాం
- ఇది కర్ణాటకలోని ఓ తహసీల్దార్ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది ప్రైవేట్ ఉద్యోగానికి బదులు ప్రభుత్వ ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కర్ణాటకలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిళ్లపై ఓ తహసీల్దార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీశాయి. ప్రభుత్వ ఉద్యోగంలో మిగిలేది లేదని, పానీపూరీ అమ్మే వాడు మనకంటే గొప్పవాడని తహసీల్దార్ చెప్పారు. పానీ పూరీ అమ్మేవాడి సంపాదన కూడా తమ కంటే ఎక్కువేనని ఆ తహసీల్దార్ వ్యాఖ్యానించాడు.
READ MORE: Minister Ponguleti: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదు.. ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమే!
Also Read
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
- Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
తాలూకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోలెనర్సీపూర్ తహసీల్దార్ కేకే కృష్ణమూర్తి మాట్లాడుతూ..”ఈ ఉద్యోగం చేయడం కంటే.. పానీపూరీ లేదా గోబీ మంచూరియన్ను అమ్మడం మేలు. ఎందుకంటే వాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్లొచ్చు. మా జీవితాలు వారికి విరుద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ అధికారులు నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కనీసం మా కుటుంబంతో కలిసి దేవాలయాలకు కూడా వెళ్లలేకపోతున్నాం.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE:Amit Shah: లొంగిపోయిన మావోలపై వరాల జల్లు.. ఇల్లుతో పాటు ఉపాధి కల్పిస్తామని ప్రకటన
“టెక్నాలజీ మా పనిభారాన్ని పెంచాయి. సీనియర్ అధికారులు వాట్సాప్ గ్రూప్ల ద్వారా వారి పనిని పర్యవేక్షిస్తున్నారు. పని అప్పగించిన రోజూ పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆలస్యం అయితే.. శాఖాపరమైన విచారణ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. విలేజ్ అకౌంటెంట్లు కూడా భయంతో బిక్కు బిక్కు మంటూ ఏం జరిగినా.. బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఉపాధ్యాయులు విద్యపై దృష్టి పెట్టకుండా పిల్లలకు గుడ్లు, అల్పాహారం పంపిణీ వంటి ప్రభుత్వ పథకాలతో భారాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఆహారంలో ఏం లోపం జరిగినా..వారి ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది.” అని హోలెనర్సీపూర్ తహసీల్దార్ కేకే కృష్ణమూర్తి నిర్భయంగా వెల్లడించారు. అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీ, కాలేయ వ్యాధులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఒత్తిడి కారణంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని ఆలోచిస్తున్నట్లు పలువురు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
-
Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
-
Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!