Karnataka: ప్రభుత్వ ఉద్యోగి కంటే.. పానీ-పూరీ అమ్మేవాడే బెటర్!.. ఎందుకంటే..
- ప్రభుత్వ ఉద్యోగానికి ప్రాధాన్యం
- ప్రభుత్వ ఉద్యోగాల కంటే పానీ-పూరీ అమ్మడం బెటర్
- పని ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నాం
- వ్యాధులు వస్తున్నాయ్
- ప్రశాంతంగా జీవించలేక పోతున్నాం
- ఇది కర్ణాటకలోని ఓ తహసీల్దార్ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది ప్రైవేట్ ఉద్యోగానికి బదులు ప్రభుత్వ ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కర్ణాటకలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిళ్లపై ఓ తహసీల్దార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీశాయి. ప్రభుత్వ ఉద్యోగంలో మిగిలేది లేదని, పానీపూరీ అమ్మే వాడు మనకంటే గొప్పవాడని తహసీల్దార్ చెప్పారు. పానీ పూరీ అమ్మేవాడి సంపాదన కూడా తమ కంటే ఎక్కువేనని ఆ తహసీల్దార్ వ్యాఖ్యానించాడు.
READ MORE: Minister Ponguleti: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదు.. ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమే!
Also Read
- Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
- Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
- Whale Graveyard : నీటి అట్టడుగున 53 లక్షల సంవత్సరాల నాటి తిమింగలాల శ్మశాన వాటిక... ఎక్కడుందో తెలుసా ?
- Sachin Tendulkar: "ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!" ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
తాలూకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోలెనర్సీపూర్ తహసీల్దార్ కేకే కృష్ణమూర్తి మాట్లాడుతూ..”ఈ ఉద్యోగం చేయడం కంటే.. పానీపూరీ లేదా గోబీ మంచూరియన్ను అమ్మడం మేలు. ఎందుకంటే వాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్లొచ్చు. మా జీవితాలు వారికి విరుద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ అధికారులు నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కనీసం మా కుటుంబంతో కలిసి దేవాలయాలకు కూడా వెళ్లలేకపోతున్నాం.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE:Amit Shah: లొంగిపోయిన మావోలపై వరాల జల్లు.. ఇల్లుతో పాటు ఉపాధి కల్పిస్తామని ప్రకటన
“టెక్నాలజీ మా పనిభారాన్ని పెంచాయి. సీనియర్ అధికారులు వాట్సాప్ గ్రూప్ల ద్వారా వారి పనిని పర్యవేక్షిస్తున్నారు. పని అప్పగించిన రోజూ పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆలస్యం అయితే.. శాఖాపరమైన విచారణ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. విలేజ్ అకౌంటెంట్లు కూడా భయంతో బిక్కు బిక్కు మంటూ ఏం జరిగినా.. బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఉపాధ్యాయులు విద్యపై దృష్టి పెట్టకుండా పిల్లలకు గుడ్లు, అల్పాహారం పంపిణీ వంటి ప్రభుత్వ పథకాలతో భారాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఆహారంలో ఏం లోపం జరిగినా..వారి ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది.” అని హోలెనర్సీపూర్ తహసీల్దార్ కేకే కృష్ణమూర్తి నిర్భయంగా వెల్లడించారు. అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీ, కాలేయ వ్యాధులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఒత్తిడి కారణంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని ఆలోచిస్తున్నట్లు పలువురు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
US-Iran: శాంతి ఒప్పందంపై ప్రతిష్టంభన.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
-
Telegram Ban in India: భారత్లో టెలిగ్రామ్పై నిషేధం ఎందుకు..? వివాదానికి కారణమైన 5 కీలక ఫీచర్లు ఇవే
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Vaibhav And Tilak Varma: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీకి భారీ జరిమానా, కెప్టెన్ తిలక్ వర్మపై నిషేధం..
-
Ind Vs Ned: పసికూన నెదర్లాండ్పై భారీ స్కోర్.. విధ్వంసం స్పష్టించిన ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ..
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!