Venu Goapl Reddy
Author- NTV Telugu-
1993 Train blasts: 1993 రైలు పేలుళ్ల ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తుండాను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు..
1993 Train blasts: 1993 రైలు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లష్కర్ తోయిబా ఉగ్ర సంస్థ బాంబు తయారీదారు అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్ ప్రత్యేక కోర్టు నేడు నిర్దోషిగా ప్రకటించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత గడిచి సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో పలు రైళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఇద్దరు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. అయితే, తుండాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని పేర్కొన్న కోర్టు, ఇద్దరు నిందితులు అమీనుద్దీన్, ఇర్ఫాన్లను దోషులుగా నిర్ధారించి వారికి జీవిత… -
Congress: హిమాచల్ చేజారితే.. ఈ రెండు రాష్ట్రాలకే కాంగ్రెస్కి దిక్కు..
Congress: 2024 లోక్సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే, ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. మొత్తం 68 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ఒక్క రాజ్యసభ ఎంపీని గెలిపించుకోలేకపోయింది. బీజేపీ పార్టీకి 25 ఎమ్మెల్యేలు ఉండగా.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతు తెలపడంతో బీజేపీ రాజ్యసభ స్థానాన్ని కైవసం… -
Uttar Pradesh: ప్రభుత్వ స్కీమ్ పొందేందుకు భర్తనే మార్చేసింది.. వేరే వ్యక్తితో పెళ్లి తంతు..
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లో ఓ యువతి నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న పథకం యొక్క ప్రయోజనాలు పొందేందుకు ఏకంగా భర్తనే మార్చేసింది. తనను పెళ్లి చేసుకోవాల్సిన వరుడు రాకపోవడంతో ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం ప్రయోజనాలను పొందేందుకు సదరు మహిళ తన బంధువుల అబ్బాయితో వివాహ లాంఛనాలను పూర్తి చేసింది. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ ప్రారంభించారు. ఝాన్సీలో మంగళవారం 132 జంటలకు జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
Jammu Kashmir: కాశ్మీర్లోని “ముస్లిం కాన్ఫరెన్స్ వర్గాల”పై నిషేధం ప్రకటించిన అమిత్ షా..
Jammu Kashmir: ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జమ్మూ కాశ్మీర్కి చెందిన రెండు ముస్లిం కాన్ఫరెన్స్ వర్గాలపై కేంద్రం నిషేధం విధించింది. ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ (సుమ్జీ వర్గం), ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ & కాశ్మీర్ (భాట్ వర్గం)లను బుధవారం నిషేధిత గ్రూపులుగా ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో కృతనిశ్చయంతో ఉందని, ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమిత్ షా హెచ్చరించారు. -
Karnataka: “బీజేపీకి పాకిస్తాన్ శత్రు దేశం, మాకు కాదు”.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాల రచ్చ నడుస్తోంది. నిన్న రాజ్యసభ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ మద్దతుదారులు పాక్ అనుకూల నినాదాలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఇది నిజమని తేలితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీ కావాలనే ఇలాంటి కుట్రలకు తెరతీస్తోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. బీజేపీ ఆరోపణల్ని కొట్టిపారేశారు. -
Political parties income: పొలిటికల్ పార్టీల ఆదాయంలో బీజేపీ టాప్.. 6 జాతీయ పార్టీ వివరాలు..
Political parties income: కేంద్రంతో పాటు మెజారిటీ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ఆదాయం పరంగా టాప్ ప్లేస్లో ఉంది. దేశంలో ఉన్న 6 జాతీయ పార్టీల ఆదాయాలను బట్టి చూస్తే ఎవరికి అందనంత ఎత్తులో కాషాయ పార్టీ నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6 జాతీయ పార్టీలకు రూ. 3077 కోట్ల ఆదాయం వస్తే.. బీజేపీ ఏకంగా 76.77 శాతంతో రూ. 2361 కోట్ల ఆదాయాన్ని సంపాదించినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను ఉటంకిస్తూ.. అసోసియేషన్ ఫర్ డిమెక్రాటిక్ రిఫార్మ్స్(ADR) బుధవారం… -
Mahindra Thar Earth edition: మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ లాంచ్.. బండి మామూలుగా లేదుగా..
Mahindra Thar Earth edition: ఇండియాలో ఆఫ్ రోడ్ వాహనాల్లో మహీంద్రా థార్కి ఉన్న క్రేజే వేరు. వేరే కార్ మేకర్ కంపెనీల నుంచి పలు రకాల ఆఫ్ రోడర్లు వచ్చినప్పటికీ థార్కి ఉన్న ఆదరణ మాత్రం నానాటికి పెరుగుతోంది. తాజాగా థార్ కొత్త అవతార్లో వస్తోంది. -
Isro: శ్రీహరికోట ఉండగా.. ఇస్రో కులశేఖరపట్టణంలో మరో రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎందుకు నిర్మిస్తోంది.? కారణం ఇదే..
Isro: ప్రధాని నరేంద్రమోడీ బుధవారం దేశంలో రెండో రాకెట్ లాంచింగ్ స్టేషన్కి శంకు స్థాపన చేశారు. తమిళనాడు కులశేఖరపట్టణంలో ఈ స్పేస్పోర్ట్ రాబోతోంది. ఇన్నాళ్లు ఇస్రో రాకెట్ ప్రయోగాలకు కేరాఫ్గా ఏపీలోని శ్రీహరికోట ఉంది. గత దశాబ్దాలుగా ఈ శ్రీహరికోట రాకెట్ ప్రయోగాలకు ప్రసిద్ధి చెందింది. దీనికి 700 కిలోమీటర్ల దూరంలో కొత్త స్పేస్పోర్ట్ రాబోతోంది. ఈ రాకెట్ లాంచింగ్ స్టేషన్ని చిన్న శాటిలైట్స్, లోఎర్త్ఆర్బిట్(LEO)లోకి ప్రయోగించే ఉపగ్రహాల కోసం ఉపయోగించనున్నారు. -
Crime: ఆన్లైన్లో పరిచయం.. మైనర్ బాలికపై స్నేహితుడి అత్యాచారం..
Crime: ఆన్లైన్, సోషల్ మీడియా పరిచయాలు అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. స్నేహితుల పేరుతో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు ఇప్పటి వరకు చాలానే నమోదయ్యాయి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ మైనర్ బాలికపై ఆమె స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని దబ్రీ మెట్రోస్టేషన్ సమీపంలో బాలిక అపాస్మారక స్థితిలో కనిపించిందని పోలీసులు బుధవారం వెల్లడించారు. -
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల తర్వాత ఏ పార్టీ బలం ఎంత..? బీజేపీ మెజారిటీ సాధించిందా..?
Rajya Sabha Elections: క్రాస్ ఓటింగ్, రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతుగా క్రాస్ ఓటింగ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా చోటు చేసుకుంది.
తాజావార్తలు
-
Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
-
Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్నర్స్తో!
-
Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
-
Latheesh: ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజుల నుంచి టాలీవుడ్ విలన్ దాకా!
-
Jitesh Sharma: “ఇంకా పిల్లాడే”.. వైభవ్ను ‘అన్ప్రొఫెషనల్’ అనడం వెనుక ఉన్న అసలు గుట్టు విప్పిన జితేష్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!