PM Modi: కులాల పేరుతో దేశాన్ని విభజించాలనుకున్నారు.. కాంగ్రెస్పై మోడీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతతో అధికారం చేపట్టబోతోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించింది. ఇదిలా ఉంటే మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్రమోడీ ‘చారిత్రక, అపూర్వ’ విజయంగా కొనియాడారు. దేశాన్ని కులాల వారీగా విభజించేందుకు ప్రయత్నాలు చేసిందని, కాంగ్రెస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేపడతానని రాహుల్ గాంధీ పదేపదే చెప్పారు. కాంగ్రెస్ వాగ్ధానంపై మాట్లాడుతూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
మూడు రాష్ట్రాల్లో గెలుపు అనంతరం ఆదివారం రాత్రి కార్యకర్తలను, నేతలు ఉద్దేశించి ప్రసంగించారు. నేటి విజయం చారిత్రత్మకమని, అపూర్వమైందని, నేడు ‘సబ్ కా సాత్-సబ్ కా వికాస్’ విజయం సాధించిందని అభివృద్ధి చెందుతున్న భారత్, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం గెలిచిందని ఆయన అన్నారు. నేడు నిజాయితీ, సుపరిపాలన గెలిచిందని ప్రధాని ప్రకటించారు. తనకు నాలుగు కులాలు ముఖ్యమని అవి నారీ శక్తి, యువశక్తి, కిసాన్ ఔర్ గరీబ్ పరివార్ ప్రధాని మోడీ చెప్పారు. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ అంచనాలకు దూరంగా ఉండే వాడినని, కానీ ఈసారి మాత్రం రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని ముందే చెప్పానని, రాజస్థాన్ ప్రజలు విశ్వాసంతో ఈ వ్యాఖ్యలు చేశానని ప్రధాని అన్నారు.
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
Read Also: Congress: రేపే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం!
అవినీతి, కుటుంబ పాలనకు ఓటర్లు చెక్ పెట్టారని ప్రధాని అన్నారు. దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని, దేశాన్ని బలహీనం చేసే రాజకీయాలు చేయవద్దని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నానని ప్రధాని మోడీ చెప్పారు. ఈ తీర్పు ఓ హెచ్చరిక లాంటిదని ఆయన అన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం 2024 విజయానికి బాటుల వేసిందని అన్నారు. దేశంలో పేదలకు ఇళ్లను, ప్రతీ ఇంటికి నీటిని అందిస్తున్నామని, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దూసుకెళ్తోందని, ప్రతీ గ్రామానికి ఫైబర్ ఆప్టిక్ సౌకర్యాలు కల్పిస్తున్నామని, కొత్త రైల్వే స్టేషన్లను నిర్మిస్తున్నామని అన్నారు.
తాజావార్తలు
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!