Sukhdev Singh Gogamedi: “కర్ణి సేన” అధినేత దారుణ హత్య.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukhdev Singh Gogamedi: రాజస్థాన్ రాజధాని జైపూర్లో కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రముఖ రాజ్పుత్ నాయకుల్లో ఇతను ఒకరు. మంగళవారం జైపూర్లోని అతని నివాసంలో కాల్చి చంపబడ్డాడు. రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి తన ఇంటిలో ఉండగా, గుర్తు తెలియని దుండగుడు చొరబడి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గోగమేడితో పాటు అతని ఇద్దరు సహచరులకు బుల్లెట్ గాయాలయ్యాయి.
Read Also: Safest City: ఇండియాలోనే సురక్షితమైన నగరం.. వరసగా మూడో ఏడాది సేఫెస్ట్ సిటీగా గుర్తింపు..
Also Read
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
కాల్పుల అనంతరం వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించాడరని వైద్యులు ప్రకటించారు. గతంలో బాలీవుడ్ సినిమా ‘పద్మావత్’ని విడుదల చేయవద్దని జరిగిన ఆందోళనకు ఈయన నాయకత్వం వహించారు. తాజాగా జరిగిన కాల్పుల్లో గోగమేడి తల, ఛాతిపై గాయాలయ్యాయి. ‘‘ప్రాథమిక నివేదికల ప్రకారం, గోగమేడి ఉన్న ఇంట్లోకి నలుగురు వ్యక్తులు ప్రవేశించి అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గోగమేడి భద్రతా సిబ్బంది ఒకరు మరియు మరొకరు గాయపడ్డారు’’ అని రాష్ట్ర డీజీపీ ఉమేష్ మిశ్రా వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.

గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు కర్ణిసేన చీఫ్ సుఖ్ దేవ్ సింగ్ గోగమేడిని చంపినట్లు బాధ్యత వహించాడు. బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ రోహిత్ గోదారా ఈ విషయాన్ని ప్రకటించాడు. గోగమేడిని చంపిన తర్వాత రోహిత్ గోదారా తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు తెలిపాడు. రాజస్థాన్ రాష్ట్రంలో కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా పేరున్న రోహిత్ గోదారా భారత్ నుంచి పరారీలో ఉన్నాడు. ఎన్ఐఏ అతనిపై చర్యలు తీసుకుంది. గోగమేడికి హత్యకు సంబంధించిన చిత్రాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కర్ణి సేన చీఫ్పై తుపాకీతో కాల్పులు జరిపారు.
https://twitter.com/Shubham_fd/status/1731985448887537999
తాజావార్తలు
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!