Venu Goapl Reddy
Author- NTV Telugu-
Australia: ఆస్ట్రేలియాలో 420 కిలోల గాంధీ విగ్రహం చోరీ..
Australia: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహాం దొంగతానికి గురైంది. గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ముందు ఏర్పాటు చేశారు. దీనిని దుండగులు చోరీ చేశారు. ఈ విగ్రహం బరువు సుమారు 420-426 కిలోలు ఉంటుంది. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) దీనిని బహుమతిగా అందించింది. -
Pakistan: ‘‘మా సైన్యం వల్ల కావడం లేదు’’.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
Pakistan: బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)ను ఎదుర్కోవడంలో తమ సైన్యం వల్ల కావడం లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. బలూచిస్తాన్ విస్తీర్ణం పెద్దది కావడంతో పాక్ భద్రతా బలగాలు అలసిపోతున్నాయని చెప్పారు. జాతీయ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన... పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ విస్తీర్ణమే భద్రతా బలగాలకు ప్రధాన సవాల్ అని అన్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల నేపథ్యంలో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
Adani-Italy Deal: అదానీ-లియోనార్డో కీలక ఒప్పందం.. భారత్లో హెలికాప్టర్ ఉత్పత్తి..
Adani-Italy Deal: అదానీ గ్రూప్, ఇటలీకి చెందిన లియోనార్డో ఏరోస్పేస్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. భారత్లో హెలికాప్టర్ల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ భాగస్వామ్యాన్నికి సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) మంగళవారం న్యూఢిల్లీలో కుదిరింది. ఈ భాగస్వామ్యం ‘‘మేక్ ఇన్ ఇండియా’’ ప్రోగ్రాంకు ముందడుగుగా భావిస్తున్నారు. హెలికాప్టర్ల తయారీలో భారత్ స్వయం సమృద్ధిగా మారే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా భారత్లో ఒక ఇంటిగ్రేటెడ్ హెలికాప్టర్ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. […] -
Parliament Budget Session: లోక్సభ నుంచి 8 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్..
విపక్ష సభ్యులు సభాపతి చైర్ వైపు కాగితాలను విసిరేశారు. దీంతో 8 మంది ప్రతిపక్ష ఎంపీలను లోక్సభ సస్పెండ్ చేసింది. రాహుల్ గాంధీ ప్రసంగానికి బీజేపీ ఎంపీలు అభ్యంతరం చెప్పడంతో ఈ ఘటన జరిగింది. సస్పెండ్ అయిన 8 మంది ఎంపీల్లో ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, గుర్జీత్ ఓజ్లా, రాజా వారింగ్, ఎబి ఈడెన్, కిరెన్ రెడ్డి, వెంకట్ రామన్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. స్పీకర్ ఈ సంఘటనను ఖండించారు. పార్లమెంటరీ మర్యాదను ఉల్లంఘనగా అభివర్ణించారు. -
Russia On Trade Deal: ‘‘భారత్ చమురు కొనుగోలు నిలిపేస్తుందని చెప్పలేదు’’.. యూఎస్తో డీల్పై రష్యా కామెంట్స్..
Russia On Trade Deal: భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. గత కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఇరు దేశాలు కూడా తమ వాణిజ్యాన్ని మరింత విస్తరించాలని కోరుకున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఈ డీల్పై రష్యా స్పందించింది. -
India-US Deal: భారత రైతులకు భద్రత, వెనిజులా నుంచి చమురు.. భారత్-యూఎస్ డీల్..
India-US Deal: భారత్-అమెరికా మధ్య ప్రతిష్టాత్మక ట్రేడ్ డీల్ ఓకే అయింది. భారత్పై ట్రంప్ విధించిన పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఇదిలా ఉంటే, భారత రైతులు ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలిగించలేదని ట్రేడ్ డీల్పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ‘‘ఆంక్షలు లేని’’ దేశాల నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే రెండో అతిపెద్ద దేశంగా ఉంది, అయితే, ఇప్పుడు […] -
Modi-Trump: ప్రధాని మోడీతో మాట్లాడిన ట్రంప్.. యూఎస్ రాయబారి ఆసక్తికర పోస్ట్..
Modi-Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోడీతో ఈరోజు(సోమవారం) ఫోన్లో మాట్లాడినట్లు భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ట్విట్టర్ పోస్టులో ‘‘స్టే ట్యూన్డ్’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అయితే, ఇరువురు నేతలు ఏ విషయంపై మాట్లాడారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే, భారత్-అమెరికా మధ్య కీలక వాణజ్య ఒప్పందం త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. Read Also: […] -
Budget 2026-27: కేంద్ర బడ్జెట్.. ధరలు తగ్గనున్న 17 రకాల క్యాన్సర్ మందుల ఇవే..
Budget 2026-27: కేంద్ర బడ్జెట్ 2026-27లో క్యాన్సర్ రోగులకు ఉపశమనం ఇచ్చింది. 17 రకాల క్యాన్సర్ ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించింది. దీని వల్ల క్యాన్సర్తో బాధపడుతున్న వారి చికిత్స మరింత చౌకగా మారనుంది. క్యాన్సర్ చికిత్సకు వాడే డ్రగ్స్ తరుచుగా విదేశాల నుంచి భారత్కు వస్తుంటాయి. -
T20 World Cup 2026: భారత్ మ్యాచ్ బాయ్కాట్ తర్వాత, పాకిస్తాన్ ‘ఈమెయిల్’ డ్రామా..
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ ముందు పాకిస్తాన్ నాటకాలు ముగియడం లేదు. ఇప్పటికే, బంగ్లాదేశ్కు సపోర్టుగా పాకిస్తాన్, భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరించింది. ఈ నెల 15 కొలంబో వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) కొత్త డ్రామాకు తెర తీసింది. భారత్తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ను బహిష్కరించడంపై పాకిస్తాన్ బోర్డు ఐసీసీకి అధికారిక ఈమెయిల్ పంపలేదు. దీంతో, పాక్పై […] -
Air India: ఎయిర్ ఇండియాకు తప్పిన భారీ ప్రమాదం.. ఇంధన స్విచ్ ‘‘రన్’’ నుంచి ‘‘కట్ ఆఫ్’’కి మార్పు..
Air India: ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంధన స్విచ్లలో సాంకేతిక సమస్య తలెత్తిన నేపథ్యంలో దానిని గ్రౌండ్ చేశారు. ఇంజన్ స్టార్ట్ చేసే సమయంలో ఎడమ ఇంజన్కు సంబంధించిన ఇంధన స్విచ్ ‘‘రన్’’ పొజిషన్లో నిలువకుండా రెండుసలార్ ‘‘కట్ ఆఫ్’’కి మారిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు.
తాజావార్తలు
-
Viral : పంది కడుపున ‘ఏనుగు పిల్ల’.. విస్తుపోతున్న జనం.!
-
Editor Madhu Reddy: చిన్న వయసులోనే దూరమైన ప్రతిభావంతుడు.. గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
-
Gold In India: ఇండియాలో బంగారమే బంగారం.. బయటపడ్డ 42.5 టన్నుల గోల్డ్.. తవ్వకాలకు అంతా సిద్ధం..
-
House Construction: మీరు ఇంటిని ఏ డబ్బుతో కడుతున్నారు..? స్వాధీనం తప్పుదు..!
-
Rammohan Naidu : మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ చేసిన క్షమించరాని పాపం
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?