Crime: ఉత్తర్ ప్రదేశ్లో దారుణమైన సంఘటన జరిగింది. సభ్య సమాజం తలదించుకునే పని చేసింది ఓ తల్లి. కొడుకు అని చూడకుండా ప్రియుడి కోసం హత్యకు పాల్పడింది కసాయి తల్లి. అక్రమ సంబంధం, కామం, డబ్బు కోసం కన్న కొడుకునే హతమార్చింది. కాన్పూర్ దేహాత్లో జరిగిన ఈ సంఘటన స్థానికుల్ని నివ్వెరపరించింది.
Amazon layoffs: ప్రపంచవ్యాప్తంగా టెక్ లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందనే భయం టెక్కీలో నెలకొంది. ఇప్పటికే టాప్ టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇటీవల అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ సంఖ్య 30,000 వరకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల, అమెజాన్ తన ఉద్యోగులకు తెల్లవారుజామున టెక్స్ట్ మెసేజులు చేసి, ఉద్యోగంలో నుంచి పీకేస్తున్నట్లు తెలియజేసింది.
JD Vance Erika Kirk: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వారం ప్రారంభంలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ క్యాంపస్ ఈవెంట్లో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన భార్య ఉషా వాన్స్ హిందూ మతం నుంచి క్రిస్టియానిటీని స్వీకరిస్తుందని చెప్పారు.
Bihar Election 2025: బీహార్ ఎన్నికలకు మరో ఐదు రోజులు మాత్రమే సమయంలో ఉంది. 243 సీట్లకు రెండు విడుతలుగా నవంబర్ 6, 11న ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న వెలువడుతాయి. ఈ ఎన్నికలు అధికార బీజేపీ+జేడీయూల ఎన్డీయే కూటమికి, ప్రతిపక్ష మహాఘటబంధన్ లోని ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్షాల కూటమికి ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే అనుకుంటుంటే, ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని ఆర్జేడీ కూటమి భావిస్తోంది.
Nitish Kumar: బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఎన్నికల ముందు సీఎం నితీష్ కుమార్ బీహార్ ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. 2005లో తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి తాను ‘‘నిజాయితీగా కష్టపడి పనిచేయడం ’’ ద్వారా ప్రజలకు సేవ చేశానని అన్నారు. మూడు నిమిషాల వీడియోలో.. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 2005కు ముందు బీహారీగా ఉండటం అవమానకరమైన విషయంగా ఉండేదని చెప్పారు.
Pakistan: పాకిస్తాన్లో మరోసారి ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’ యాక్టివ్ అయ్యారు. గత కొంత కాలంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని అన్-నోన్ గన్మెన్ హతమారుస్తున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ)లో క్రియాశీల సభ్యుడు, కమాండర్గా ఉన్న షేక్ మోయిజ్ ముజాహిద్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
Himanta Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి కాంగ్రెస్ ఎంపీ, అస్సాం పీసీసీ చీఫ్ గౌరవ్ గొగోయ్ను మరోసారి టార్గెట్ చేశారు. ఆయన విదేశీ శక్తుల చేత నాటబడిన ఒక పాకిస్తానీ ఏజెంట్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన ఆరోపణలు అబద్ధమైతే, గొగోయ్ తనపై పరువునష్టం దాఖలు చేయాలని సవాల్ విసిరారు.
Shocking: మధ్యప్రదేశ్లో షాకింగ్ సంఘటన జరిగింది. అబ్బాయికి, అమ్మాయికి పెళ్లి చేయాల్సింది పోయి, వారి పేరెంట్స్ లేచిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి, తన కూతురుకు కాబోయే అత్తగారితో లేచిపోయాడు. వధువు తండ్రి, వరుడి తల్లి ఇద్దరు కలిసి పారిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది. పిల్లల నిశ్చితార్థానికి కొన్ని రోజుల ముందు ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీలో 8 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. గురువారం పోలీసులు పారిపోయిన మహిళను కనుగొన్నారు.
Amazon: టెక్ లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా, అమెజాన్ 14,000 మంది ఉద్యోగుల్ని తీసేసింది. దీనిపై అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ స్పందించారు. ఉద్యోగుల తొలగింపు ‘‘ వర్క్ కల్చర్’’కు సంబంధించిందని చెప్పారు. తొలగింపులు AI కోసం, డబ్బు కోసం కాదని ఆయన స్పష్టం చేశారు.
Priyank Kharge: కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ పంచాయతీ కొనసాగుతోంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ ర్యాలీల అనుమతులను నిరాకరించడంపై వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే గురువారం సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ సీనియర్ నేతల పిల్లలు హస్టల్ విద్యార్థులను ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్కు హాజరుకావాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. ఇతరులకు వర్తించే చట్టాలు ఆ సంస్థలకు ఎందుకు వర్తించవు అని ప్రశ్నించారు.